T20 League: బౌలర్లు కావాలి బాబోయ్!.. పాత జట్లకు కొత్త కలవరం!
టీ20 లీగ్లో ఈ సారి వింత పరిస్థితి నెలకొంది. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన కొన్ని జట్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుండగా.. కొత్త జట్లతోపాటు మరికొన్ని టీమ్లు అదరగొడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన జట్లు
టీ20 లీగ్లో ఈసారి వింత పరిస్థితి నెలకొంది. గతంలో ఛాంపియన్లుగా నిలిచిన కొన్ని జట్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తుండగా.. కొత్త జట్లతోపాటు మరికొన్ని టీమ్లు అదరగొడుతున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన జట్లు ఈ సారి అట్టడుగు స్థానాలకు పరిమితమవడానికి బౌలింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు రాణించకపోవడం వల్లే ఆ జట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అర్థమవుతోంది. మరి ఆ జట్లు ఏవి.. ఆ ఫాస్ట్బౌలర్లు ఎవరు అనేది దానిపై ప్రత్యేక కథనం.
ముంబయిని ముంచుతోంది.. ఫాస్ట్బౌలర్లే
టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి జట్టు. అత్యధిక టైటిళ్లు (5) నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబయి.. ఈ సారి దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. బ్యాటింగ్లో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్లో పూర్తిగా తేలిపోతోంది. ఈ జట్టులోని ఫాస్ట్బౌలర్లు ధారాళంగా పరుగులిస్తూ వికెట్లు పడగొట్టడం లేదు. నేటితరం మేటి బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా కాస్త పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా వికెట్లు తీయడం లేదు. మిగతా బౌలర్లు నుంచి సరైన సహకారం అందకపోవడంతో అతడు ఒత్తిడికి లోనవుతున్నాడు. గతంలో బుమ్రాకు తోడుగా ఉన్న ట్రెంట్ బౌల్ట్ ఈసారి జట్టులో లేడు. ఇది కూడా ముంబయి బౌలింగ్పై ప్రభావం చూపుతోంది. జయదేవ్ ఉనద్కత్, బసిల్ థంపి, టైమల్ మిల్స్, రిలె మెరిడిత్ వంటి ఫాస్ట్బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అందుకే ముంబయి ఇన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇకనైనా ఆ జట్టు ఫాస్ట్బౌలర్లు గాడినపడతారో లేదో చూడాలి.
చెన్నై ఓటములకు ప్రధాన సమస్య అదే
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై కూడా ఈ సారి పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం మూడింటిలో మాత్రమే నెగ్గింది. చెన్నై ఓటములకు ఫాస్ట్బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమవడంతో చెన్నైకి గట్టి షాక్ తగిలింది. ముఖేశ్ చౌదరి, డ్వేన్ బ్రావో కాస్త పరుగులు ఎక్కువగా ఇస్తున్నా వికెట్లు పడగొడుతున్నారు. క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ ప్రభావం చూపలేకపోతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీసే నమ్మకమైన ఫాస్ట్బౌలర్ లేకపోవడం చెన్నైకి తీవ్ర ప్రతికులాంశంగా మారింది. రానున్న మ్యాచ్ల్లో ఫాస్ట్బౌలర్లు పుంజుకుంటేనే ఆ జట్టు విజయాలు సాధించే అవకాశం ఉంది.
మంచి బౌలర్లు ఉన్నా... కోల్‘కథ’ మారట్లేదు
2012, 2014 సంవత్సరాల్లో ఛాంపియన్గా నిలిచిన కోల్కతా జట్టు సీజన్లో ఆశించిన మేరకు రాణించడం లేదు. జట్టులో ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, రసెల్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫాస్ట్బౌలర్లు ఉన్నా కోల్కతా పరాజయాల పాలవుతోంది. ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. రసెల్ అప్పుడప్పుడు వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులిస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు బ్యాట్తో రెచ్చిపోయే ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో విఫలమవుతున్నాడు. దీంతో అతడిని పలు మ్యాచ్ల్లో తుది జట్టులోకి తీసుకోలేదు.
దిల్లీ.. ఎందుకిలా?
మంచి ఆటతీరుని ప్రదర్శిస్తూ గత కొన్ని సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరుకున్న దిల్లీ జట్టు కూడా ఈ సారి తడబడుతోంది. ఈ జట్టులో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా, ఆన్రిచ్ నార్జ్, ముస్తాఫిజుర్ రెహ్మన్లతో పేస్ విభాగం పేపర్పై బలంగా కనిపిస్తున్నా మ్యాచ్ల్లో తేలిపోతోంది. రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 10 మ్యాచ్ల్లో ఏడు వికెట్లే పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్ ఫర్వాలేదనిపిస్తున్నా.. మరింత ప్రభావం చూపాల్సిన అవసరముంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారి దిల్లీ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించే అవకాశం ఉంది.
పంజాబ్లో రబాడ ఒక్కడే
ఈ ఏడాది పంజాబ్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఒక మ్యాచ్లో గెలుపు, మరో మ్యాచ్లో ఓటమిలా ఉంది ఆ జట్టు పరిస్థితి. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. 5 మ్యాచ్ల్లో గెలుపొందగా.. మరో ఐదింటిలో ఓటమిపాలైంది. గత సీజన్లో 21 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్ సింగ్ ఈ సారి నాలుగు వికెట్లే పడగొట్టాడు. కానీ, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పరుగులు కట్టడి చేయడంతోపాటు వికెట్లు తీస్తే జట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సందీప్ శర్మ, వైభవ్ అరోరా, ఒడియన్ స్మిత్ అడపదడపా వికెట్లు తీస్తున్నారు. కగిసో రబాడ 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇతనికి తోడుగా ఇతర ఫాస్ట్బౌలర్లు వికెట్లు పడగొడితే జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుంది.
గాడి తప్పిన హైదరాబాద్ బౌలింగ్
ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన హైదరాబాద్.. మళ్లీ తడబడుతోంది. గత మూడు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. బౌలర్లు విఫలమవ్వడమే ఇందుకు గల ప్రధాన కారణం. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టగా.. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ బౌలింగ్ మారలేదు. దీంతో ఇందులోనూ కేన్ సేనకు ఓటమి ఎదురైంది. మున్ముందు బౌలింగ్ తీరు ఇలానే కొనసాగితే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరుకోవడం కష్టంగా మారుతుంది. మిగతా మ్యాచ్ల్లోనైనా హైదరాబాద్ బౌలర్లు పుంజుకుంటారో లేదో చూడాలి.
టాప్లో ఉన్న జట్ల విజయాల్లో వీరిదే కీలకపాత్ర
కొత్త జట్టు గుజరాత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టులోని ఫాస్ట్బౌలర్లు మహ్మద్ షమి, ఫెర్గూసన్, యశ్ దయాల్ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. లఖ్నవూ విజయాల్లో అవేశ్ ఖాన్, జేసన్ హోల్డర్.. రాజస్థాన్ గెలుపుల్లో ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా