Playoffs 2022: తొలి క్వాలిఫయర్లో గుజరాత్తో తలపడేదెవరు?
గుజరాత్తో తొలి క్వాలిఫయర్తో తలపడే జట్టు ఏది అవ్వొచ్చో ఓసారి చూద్దాం!
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: భారత టీ20 లీగ్ చివరి దశకు చేరింది. దీంతో ఒక్కో మ్యాచ్ ఆసక్తిగా సాగుతోంది. ప్లే ఆఫ్స్కు చేరే ఆ 3 జట్లు ఏవీ అనే విషయంలో ఇంకా లెక్క తేలలేదు. తొలి స్థానం గుజరాత్కి పక్కా అనేది అందరికీ తెలిసిందే. మరి ఆ గుజరాత్తో తొలి క్వాలిఫయర్తో తలపడే జట్టు ఏది అవ్వొచ్చో ఓసారి చూద్దాం!
పాయింట్ల పట్టికలో గుజరాత్ 20 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఆ జట్టు ఇంకా బెంగళూరుతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అదీ గెలిస్తే మొత్తం 22 పాయింట్లతో లీగ్ స్టేజ్ను దిగ్విజయంగా పూర్తి చేయనుంది. ఒకవేళ ఓడినా తొలి స్థానానికి ఢోకా లేదు. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, లఖ్నవూ చెరో 16 పాయింట్లతో ఉన్నాయి. ఆ రెండు జట్లూ తమ చివరి మ్యాచ్ల్లో నెగ్గినా 18 పాయింట్లతోనే సరిపెట్టుకుంటాయి.
ఒకవేళ ఓడితే 16 పాయింట్లతో మూడు లేదా నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంటాయి. ప్రస్తుతం నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న దిల్లీ, బెంగళూరు 14 పాయింట్లతో ఉన్నాయి. అవి తమ చివరి మ్యాచ్ల్లో గెలిస్తే రాజస్థాన్, లఖ్నవూతో సమానంగా 16 పాయింట్లతో ఉంటాయి. అలాంటప్పుడు రన్రేట్లో మెరుగ్గా ఉన్న జట్లే రెండు, మూడు, నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటాయి.
రాజస్థాన్: ఇప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లఖ్నవూ కన్నా కాస్త మెరుగైన రన్రేట్ కలిగి ఉండటం సంజూ శాంసన్ సేనకు ఊరటనిచ్చే విషయం. అయితే, రాజస్థాన్ శుక్రవారం చెన్నైతో తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడాల్సి ఉంది. చెన్నై ఎలాగూ బలహీనంగా ఉండటంతో ఆ మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు గుజరాత్తో తొలి క్వాలిఫయర్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. అయితే, ఇక్కడ లఖ్నవూ తమ చివరి మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.
లఖ్నవూ: పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది లఖ్నవూ. ఈ రోజు కోల్కతాతో చివరి మ్యాచ్లో పోటీ పడాల్సి ఉంది. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న రాహుల్ టీమ్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 18 పాయింట్లు సాధించి రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఓడిపోతే 16 పాయింట్లతోనే నిలిచి... మూడు లేదా నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంటుంది. అది ఇతర జట్లతో సమానంగా నిలిస్తే రన్రేట్ను బట్టి స్థానం ఉంటుంది.
దిల్లీ: దిల్లీ వరుసగా గత రెండు మ్యాచ్ల్లో గెలిచి అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పుడు ఈ జట్టు తమ చివరి మ్యాచ్లో శనివారం ముంబయితో ఆడాల్సి ఉంది. రోహిత్ సేన పేలవ ఫామ్లో ఉండటంతో దిల్లీ మంచి రన్రేట్తో గెలిస్తే నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం రెండు, మూడులో ఉన్న రాజస్థాన్, లఖ్నవూ తమ చివరి మ్యాచ్ల్లో ఓడితే.. అప్పుడు దిల్లీ ఏకంగా రెండో స్థానాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.
గమనిక: ఇవి అంచనాలు మాత్రమే. ప్లే ఆఫ్స్ జట్ల విషయంలో రన్రేట్ కీలకం కాబట్టి. స్థానాలు ఎటైనా మారొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్