IND vs ENG : ఇంగ్లాండ్ వేదికగా.. పొట్టి కప్ కోసం సమర శంఖం పూరించేనా..?
ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఫలితం ఏంటో తేలిపోయింది. ఇక టీ20, వన్డే సిరీస్లు మిగిలాయి. జులై 7 నుంచి...
గురువారం నుంచి మూడు టీ20ల సిరీస్లో తలపడనున్న భారత్
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఫలితం ఏంటో తేలిపోయింది. ఇక టీ20, వన్డే సిరీస్లు మిగిలాయి. జులై 7 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మరి మంచి ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్తో పోరు ఆషామాషీగా ఉండదు. ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ పోటీలకు సమయం మరెంతో లేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా బలాలు ఏంటి..? ఇంగ్లాండ్తో ఎన్నిసార్లు ఢీకొట్టింది..? ఆధిపత్యం ఎవరు సాధించారు..? వంటి విషయాలను తెలుసుకుందాం..
రోహిత్కు అసలైన పరీక్ష
టీ20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంకు టీమ్ఇండియాదే. అయితే గత టీ20 ప్రపంచకప్లో దారుణంగా లీగ్ స్థాయిలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలేశాడు. అనంతరం జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వరుసగా న్యూజిలాండ్, శ్రీలంక, విండీస్ టీమ్లపై సిరీస్లను ఒడిసిపట్టాడు. అయితే అవన్నీ భారత్లోనే జరగడం గమనార్హం. తర్వాత దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ 2-2తో సమమైంది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే దీనికి రిషభ్ పంత్ సారథ్యం వహించాడు. ఇక తర్వాత ఐర్లాండ్పై రెండు టీ20ల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు హార్దిక్ పాండ్య నేతృత్వం వహించాడు. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్తో వారి గడ్డపైనే టీ20 సిరీస్ ఆడనున్న రోహిత్ నేతృత్వంలోని టీమ్ఇండియాకు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. కరోనా కారణంగా టెస్టు మ్యాచ్కు దూరమైన రోహిత్ పొట్టి ఫార్మాట్ బరిలోకి దిగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ కూడా విదేశాల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
టీమ్ఇండియా కుర్రాళ్ల హవా..
తొలి టీ20 మ్యాచ్కు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ దూరమవుతారు. టెస్టు మ్యాచ్ జరిగిన బర్మింగ్హామ్లోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ ఐదుగురు రెండో మ్యాచ్కు జట్టుతో కలుస్తారు. అయితే తొలి మ్యాచ్ ఆడే జట్టులో సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా, సంజూ శాంసన్, రుతురాజ్, ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లు ఉన్నారు. వీరిలో రుతురాజ్ మినహా మిగతావారంతా ఐర్లాండ్పై టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్లో వీరికి తోడుగా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (కెప్టెన్), దినేశ్ కార్తిక్ ఉండనే ఉన్నారు. బౌలింగ్లో సీనియర్ భువనేశ్వర్ కుమార్ ఎలానూ ఉన్నాడు. అతడికి తోడుగా అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, చాహల్ అండగా నిలిచే అవకాశం ఉంది. అక్టోబర్లో ఆసీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచకప్ ప్రారంభమయ్యే నాటికి భారత్ మహా అయితే 20 టీ20 మ్యాచ్లను ఆడే అవకాశం ఉంది. కాబట్టే ప్రతి మ్యాచ్లో రాణించడం ఆటగాళ్లకు కీలకం.
ఇంగ్లాండ్ను తక్కువగా అంచనా వేయలేం..
భారత్ ఎంత బలంగా కనిపిస్తున్నా.. మైదానంలో రాణించాలి. అసలే అక్కడ ప్రత్యర్థి ఇంగ్లాండ్. టెస్టులోనే భారీ లక్ష్య ఛేదనను అలవోకగా చేసేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో చెలరేగడం ఖాయం. భారత టీ20 లీగ్లో అదరగొట్టేసిన జోస్ బట్లర్ ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్తోపాటు జాసన్ రాయ్, డేవిడ్ మలన్, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ వంటి అగ్రస్థాయి బ్యాటర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించాల్సిందే. ఏమాత్రం అవకాశం దొరికినా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు. అయితే టీమ్ఇండియా బౌలింగ్తో పోలిస్తే ఇంగ్లాండ్ కాస్త వీక్గానే ఉంది. క్రిస్ జొర్డాన్, సామ్ కరన్, మిల్స్, డేవిడ్ విల్లే వంటి పేసర్లు ఉన్నప్పటికీ ఎంతమేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే. మొయిన్ అలీ, పార్కిన్సన్, లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్ దాడితో భారత్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు తక్కువే. పార్కిన్సన్ మినహా మిగతా బౌలర్లను టీ20 లీగ్లో ఎదుర్కొన్న అనుభవం టీమ్ఇండియా ఆటగాళ్లకు ఉంది.
భారత్Xఇంగ్లాండ్.. ఎవరిది ఆధిపత్యం..?
భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 19 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ కాస్త పైచేయి సాధించింది. టీమ్ఇండియా పది టీ20ల్లో విజయం సాధించగా.. ఇంగ్లాండ్ తొమ్మిందిట్లో గెలుపొందింది. భారత్, ఇంగ్లాండ్ చివరిసారిగా 2021లో అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 36 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్తో 11 మ్యాచుల్లో స్వదేశంలో తలపడినా భారత్ ఆరు మ్యాచుల్లో విజయం సాధించగా.. 6 మ్యాచులను ఇంగ్లాండ్లో ఆడితే టీమ్ఇండియా కేవలం రెండింట్లోనే గెలిచింది. తటస్థ వేదికల్లో జరిగిన రెండు మ్యాచ్లను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ను వారి గడ్డపైనే ఢీకొట్టడమంటే సాధారణ విషయం కాదని ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి టీ20 సిరీస్ను గెలవాలంటే ఇంగ్లాండ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
మ్యాచ్లు ఎప్పుడంటే..?
* జులై 7న రాత్రి 10.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
* జులై 9న రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
* జులై 10న రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
జట్లు ఇవే..:
భారత్: తొలి టీ20కి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
మిగిలిన రెండు టీ20లకు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
ఇంగ్లాండ్: జోస్ బట్లర్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జొర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, మిల్స్, మ్యాథ్యూ పార్కిన్సన్, జాసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీసె టోప్లే, డేవిడ్ విల్లే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM