T20 World Cup 2022: ముగిసిన టీ20 ప్రపంచకప్.. రికార్డులు ఏంటో చూసేద్దాం..!
ఇన్నాళ్లు అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్ సమరం నేటితో ముగిసింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిరెండోసారి టీ20 ప్రపంచకప్ని ముద్దాడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్నాళ్లు అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్ సమరం ముగిసింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్థాన్పై ఇంగ్లాండ్ విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకొనిపోయింది. ఇది ఇంగ్లాండ్కు రెండో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఈసారి మొత్తం 45 మ్యాచ్లు జరిగాయి. మరి హోరాహోరీగా సాగిన ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో నమోదైన పలు రికార్డులపై ఓ లుక్కేద్దాం..
- విరాట్ కోహ్లీ: టీ20 ప్రపంచకప్లో అత్యధికంగా పరుగులు సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో 296 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత నెదర్లాండ్స్ ఆటగాడు మాక్స్ ఓ డౌడ్ (242 పరుగులు 8 ఇన్నింగ్స్ల్లో), సూర్యకుమార్ యాదవ్ (239 పరుగులు 6 ఇన్నింగ్స్ల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే హాఫ్ సెంచరీల్లోనూ కోహ్లీ టాప్ (ఆరు ఇన్నింగ్స్ల్లో 4 అర్ధశతకాలు). ఆ తర్వాత సూర్యకుమార్ (3 అర్ధ సెంచరీలు) కావడం విశేషం.
- హసరంగ: టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక బౌలర్ హసరంగ (15) అత్యధిక వికెట్లు తీశాడు. సామ్ కరన్ (13), బాస్ డి లీడే (13) తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్ -10 బౌలర్లలో టీమ్ఇండియా నుంచి ఒక్క బౌలరూ లేకపోవడం గమనార్హం. యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పది వికెట్లతో 11వ స్థానంలో నిలిచాడు.
- రిలీ రోసోవ్: టీ20ల్లో ధాటిగా ఆడటం చాలా ముఖ్యం. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రూసో బంగ్లాదేశ్పై శతకం సాధించాడు. 109 పరుగులు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరర్గా తొలి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్(శ్రీలంకపై 104) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్లో ఈ ఇద్దరే శతకాలు బాదారు.
- సామ్ కరన్: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికైన సామ్ కరన్ (5/10) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్పై ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు. కరన్ తర్వాత ఆన్రిచ్ నోకియా (4/10, బంగ్లాదేశ్పై), ట్రెంట్ బౌల్ట్ (4/13, శ్రీలంకపై) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
- సూర్యకుమార్ యాదవ్: అత్యధిక ఫోర్ల జాబితాలో మన ‘మిస్టర్ 360’ ఆటగాడు సూర్యకుమార్ టాప్లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో 26 ఫోర్లు బాది మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్ల్లో 25 బౌండరీలు, జోస్ బట్లర్ 6 ఇన్నింగ్స్ల్లో 24 ఫోర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- సికందర్ రజా: జింబాబ్వే కీలక ఆటగాడు సికందర్ రజా (8 ఇన్నింగ్స్ల్లో 11 సిక్స్లు ) అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (6 ఇన్నింగ్స్ల్లో 10 సిక్స్లు) రెండో స్థానంలో, కుశాల్ మెండిస్ (8 ఇన్నింగ్స్ల్లో 10 సిక్స్లు) మూడో స్థానంలో ఉన్నాడు.
- ఫ్రెడ్ క్లాసెన్: టీ20ల్లో పరుగు ఇవ్వకుండా బంతిని సంధించడం కత్తిమీద సామే. అలాంటిది నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడ్ క్లాసెన్ ఏకంగా 93 డాట్ బాల్స్ వేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత రిచర్డ్ ఎన్గరవ (89), పాల్ వాన్ మీకెరెన్ నెదర్లాండ్స్ (85) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- ఇంగ్లాండ్: టైటిల్ను నెగ్గిన ఇంగ్లాండ్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది. ఆరు మ్యాచుల్లో 5 విజయాలు, ఒక ఓటమితో 83.3 శాతం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (75 శాతం) 4 మ్యాచ్ల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానం, భారత్ (66.667) 6 మ్యాచ్ల్లో 4 విజయాలు, రెండు ఓటములతో మూడో ప్లేస్లో నిలిచాయి.
- శ్రీలంక; నెదర్లాండ్స్: క్వాలిఫయిర్ మ్యాచ్లతో కలిపి శ్రీలంక ఎనిమిది మ్యాచ్లు ఆడింది. అందులో నాలుగు విజయాలు నమోదు చేయగా.. మరో నాలుగింటిలో ఓడింది. అలాగే నెదర్లాండ్స్ కూడా 8 మ్యాచ్ల్లో నాలుగేసి గెలుపోటములతో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికాపై కీలక విజయం సాధించిన నెదర్లాండ్స్ సంచలనం సృష్టించింది.
- ప్రైజ్మనీ: ఫైనల్లో పాక్పై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచిన ఇంగ్లాండ్కు రూ.13 కోట్ల ప్రైజ్మనీ దక్కగా.. రన్నరప్తో సరిపెట్టుకున్న పాకిస్థాన్కు రూ.6.5 కోట్ల ప్రైజ్మనీ లభించింది. అలాగే సెమీస్లో ఓడిన రెండు జట్లకు చెరో 3.25 కోట్ల చొప్పున దక్కడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్