T20 World Cup: టీ20 ప్రపంచకప్లు.. పరుగుల హోరు.. రికార్డుల జోరు
తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్ (2007)ను భారత్ గెలుచుకొంది. ఆసీస్ వేదిగా ప్రారంభమైన ఎనిమిదో టైటిల్ను సొంతం చేసుకొనే జట్టేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఆలోపు గత పొట్టి కప్ టోర్నీల్లో నమోదైన పలు రికార్డులను తెలుసుకొందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఏడాది కాలం గిర్రున తిరిగింది. గతేడాదే టీ20 ప్రపంచకప్ను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులను అలరించేందుకు మళ్లీ పొట్టి కప్ వచ్చేసింది. నిరుడు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా ఈసారి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. టీమ్ఇండియా తొలి ట్రోఫీని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఎనిమిదోసారి జరుగుతున్న టోర్నీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ఆలోపు ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో నమోదైన పలు రికార్డులను తెలుసుకోండి..
- శతక వీరులు వీరే..: టీ20ల్లో సెంచరీ చేయడమంటే అంత సులువేం కాదు. ప్రపంచకప్ వంటి పోటీల్లో ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లో తొమ్మిది సెంచరీలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి ఫీట్ను క్రిస్ గేల్ రెండుసార్లు (117, 100) సాధించాడు. ఇక మన టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా (101) కూడా ఒక శతకం చేయడం విశేషం. అత్యధిక వ్యక్తిగత స్కోరు కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ (123) 2012 వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్పై బాదాడు. ఇతర బ్యాటర్లలో మహేల జయవర్థెనె, అలెక్స్ హేల్స్, అహ్మద్ షెహ్జాద్, తమిమ్ ఇక్బాల్, జోస్ బట్లర్ కూడా సెంచరీ వీరులే.
- అర్ధశతకాలు.. విరాట్ అగ్రస్థానం: శతకం కంటే అర్ధశతకం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. టీ20 ప్రపంచకప్లో భారత్ మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 10 హాఫ్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ (9), రోహిత్ శర్మ (8), జయవర్థెనె (6), డేవిడ్ వార్నర్ (6) టాప్ -5లో నిలిచారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (4) కూడా ఈ రేసులో ఉన్నప్పటికీ.. ఎనిమిదో స్థానంలో కొనసాగడం గమనార్హం. ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానూ విరాట్ కోహ్లీ (319) రికార్డు నమోదు చేశాడు.
- అంతా పాతవారే: బ్యాటింగ్ దూకుడు చూపించే టీ20 ఫార్మాట్లో బంతితో కళ్లెం వేయడమంటే సాధారణ విషయం కాదు. సిక్స్, ఫోర్లను బాదడమే పనిగా బ్యాటర్లు బరిలోకి దిగుతారు. అయితే పొట్టి ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మాత్రం మాజీ క్రికెటర్లపై ఉన్నాయి. శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ (6/8) పేరిట రికార్డు ఉంది. 2012 టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే మీద విజృంభించాడు. వేసిన నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ లంకకు చెందిన హసరంగ (16). అయితే మొత్తం ప్రపంచకప్ పోటీల్లో మాత్రం ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్గా షకిబ్ అల్ హసన్ 41 వికెట్లతో రికార్డు తన పేరిట లిఖించుకొన్నాడు.
- భారీ స్కోరు ఆ జట్టుదే: 2007 టీ20 ప్రపంచకప్లో శ్రీలంక జట్టు కెన్యాపై 260/6 భారీ స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు పొట్టి వరల్డ్ కప్లో ఏ జట్టైనా సాధించిన అత్యధిక స్కోరు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 230/8 చేసింది. 2016లో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్లో సాధ్యమైంది. ఇక టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ రెండు సార్లు 200కిపైగా స్కోరు నమోదు చేసింది. అందులో 2007లోనే ఇంగ్లాండ్పై (218/4), గతేడాది అఫ్గానిస్థాన్పై (210/2) సాధించింది.
- అత్యల్ప స్కోర్లు..: బ్యాటర్లు పైచేయి సాధించే టీ20 క్రికెట్లో బౌలర్ల దెబ్బకు పేకమేడలా కుప్పకూలితే ఎలా ఉంటుందో నెదర్లాండ్స్ను చూస్తే అర్థమవుతుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో చెత్త రికార్డైన అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రెండుసార్లు నెదర్లాండ్స్ నిలిచింది. 2014లో లంక మీద కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. అలాగే 2021లోనూ శ్రీలంకపైనే 44 రన్స్కే ఆలౌటైంది. ఆ తర్వాత భారీ హిట్టర్లు కలిగిన వెస్టిండీస్ కూడానూ 55 పరుగులకే (ఇంగ్లాండ్ మీద) చేతులెత్తేసింది.
- నలుగురే ‘హ్యాట్రిక్’ ధీరులు: ఇప్పటి వరకు జరిగిన ఏడు ప్రపంచకప్ పోటీల్లో నలుగురు మాత్రమే హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టారు. అందులో ఆసీస్కు చెందిన బ్రెట్ లీ తొలి ప్రపంచకప్లోనే ఘనత సాధించగా.. ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫెర్, శ్రీలంక స్పిన్నర్ హసరంగ, కగిసో రబాడ గతేడాది వరల్డ్ కప్లో హ్యాట్రిక్ తీశారు. అలాగే తొమ్మిది మంది ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. వారిలో అజంత మెండిస్ (6/8), హెరాత్ (5/3), ఉమర్ గుల్ (5/6), అహ్సాన్ మాలిక్ (5/19), ఆడమ్ జంపా (5/19), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (5/20), జేమ్స్ ఫాల్కనర్ (5/27), లసిత్ మలింగ (5/31) ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.
- సూపర్ ఓవర్/బౌలౌట్: టీమ్ఇండియా తొలి టీ20 ప్రపంచకప్ను (2007) నెగ్గిన విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్థాన్ మీద గ్రూప్ స్టేజ్లో బౌలౌట్ పద్ధతిలోనే భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ఐసీసీ బౌలౌట్ను తీసేసి సూపర్ ఓవర్ను తీసుకొచ్చింది. అయితే కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. రెండుసార్లూ న్యూజిలాండ్ ఉండటం గమనార్హం. 2012 టీ20 ప్రపంచకప్లోనే శ్రీలంక, వెస్టిండీస్ మీద కివీస్ సూపర్ ఓవర్ ఆడింది. పాపం రెండు మ్యాచుల్లోనూ కివీస్ ఓటమిపాలైంది.
- అత్యధిక మ్యాచ్లు ఆడింది వీరే: టీ20 ప్రపంచకప్లో తమ జాతీయ జట్టు తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. అలా శ్రీలంక టాప్ బ్యాటర్ తిలకరత్న దిల్షాన్ (35), షాహిద్ అఫ్రిది (34), డ్వేన్ బ్రావో (34), షోయబ్ మాలిక్ (34), ఎంఎస్ ధోనీ (33) గేల్ (33), ముస్తాఫికర్ రహీమ్ (33), రోహిత్ శర్మ (33), జయవర్థెనె (31), లసిత్ మలింగ (31) ఉన్నారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించడం ఖాయం. మరో మూడు మ్యాచ్లు ఆడినా టాప్ ప్లేయర్గా మారిపోతాడు. అయితే కెప్టెన్గా అత్యధిక మ్యాచ్లకు నాయకత్వం వహించిన రికార్డు మాత్రం ఎంఎస్ ధోనీ (33) పేరిటే ఉంది.
- ఒడిసి పట్టేశారు..: ఫీల్డింగ్లో చురుగ్గా ఉండే ఏబీ డివిలియర్స్ పేరిట అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రికార్డు ఉంది. 30 మ్యాచుల్లో 23 క్యాచ్లు ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మార్టిన్ గప్తిల్ (19), డేవిడ్ వార్నర్ (18), రోహిత్ శర్మ (15), స్టీవ్ స్మిత్ (14), గ్లెన్ మ్యాక్స్వెల్ (14), రాస్ టేలర్ (14) ఉన్నారు. వీరిలో ఏబీడీ, రాస్ టేలర్ మినహా మిగతా ఆటగాళ్లు తమ పేరిట కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈసారి వీరంతా బరిలోకి దిగారు. మార్టిన్ గప్తిల్, వార్నర్ కాస్త చేరువగా ఉన్నారు.
- హిట్టర్లే.. డక్ అయ్యారు: భారీ షాట్లు కొడుతూ.. వేగంగా పరుగులు సాధించడంలో సాటిలేని ఆటగాళ్లు.. అయితే వారే అత్యధిక డకౌట్లుగా మారడం విశేషం. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, దిల్షాన్ టీ20 ప్రపంచకప్లో అత్యధిక సార్లు డకౌట్లు అయిన బ్యాటర్. ఐదుసార్లు ‘సున్నా’ పరుగులకే పెవిలియన్కు చేరారు. వీరిద్దరి తర్వాత సిమన్స్ (4), ఆండ్రూ రస్సెల్ (4), సనత్ జయసూర్య (4), లూక్ రైట్ (4), ఆశిశ్ నెహ్రా (3) డకౌట్లు అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్