T20 League : హై హై ‘నాయకా’.. టీ20 లీగ్లో పైచేయి ఎవరిదంటే?
జట్టును నడపడం ఒక్కటే కెప్టెన్ కర్తవ్యం కాదు.. వ్యక్తిగతంగా రాణిస్తూ టీమ్కు అండగా నిలవాలి. బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్... ఎవరైనా సరే తమ...
కీలక ఇన్నింగ్స్లలో జట్టుకు అండగా నిలుస్తూ..
ఇంటర్నెట్ డెస్క్: జట్టును నడపడం ఒక్కటే కెప్టెన్ కర్తవ్యం కాదు.. వ్యక్తిగతంగా రాణిస్తూ టీమ్కు అండగా నిలవాలి. బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్... ఎవరైనా సరే తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందే. సారథిగా మైదానంలో సరైన ప్రణాళికలను అమలు చేసి ఫలితాలను రాబట్టడంతోపాటు జట్టు సభ్యుల్లో భరోసా నింపేలా ఆడితే తిరుగుండదు. మరి ప్రస్తుత టీ20 లీగ్లో పది జట్ల నాయకులు ఎలా ఆడుతున్నారు.. టీమ్లను ఏ విధంగా నడిపిస్తున్నారో చూద్దాం..
అన్నింట్లోనూ హార్దిక్ టాప్..!
టీ20 లీగ్లోకి కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టేస్తోంది. పది మ్యాచ్లకుగాను ఎనిమిది విజయాలు, రెండు ఓటములతో గుజరాత్ (16) ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య అయితే కెప్టెన్సీతోపాటు వ్యక్తిగతంగా రాణిస్తూ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. బ్యాటింగ్లో ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో మూడు అర్ధశతకాలతో 309 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో వస్తున్నాడు కాబట్టి స్ట్రైక్రేట్ 132.05 వరకు ఉంది. బౌలింగ్లో అయితే పెద్దగా రిస్క్ చేయడం లేదు. బౌలర్గా 111 బంతులు (18.3 ఓవర్లు) వేసిన 7.57 ఎకానమీతో 140 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు. రాజస్థాన్పై (87*) సూపర్ బ్యాటింగ్ చేశాడు.
గత సీజన్ ఫామ్ను కొనసాగిస్తూ..
గత సీజన్లో పంజాబ్కు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ ఈసారి లఖ్నవూకు మారిపోయాడు. వ్యక్తిగత ఫామ్పరంగా ఏమాత్రం మార్పులేదు. అయితే టీమ్ను నడిపించడంలో మాత్రం చాలా మెరుగయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటికే 10 మ్యాచ్ల్లో ఏడు విజయాలను నమోదు చేసిన లఖ్నవూ (14) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన ఐదు మ్యాచుల్లో కనీసం ఒకటి లేదా రెండు గెలిచినా ప్లేఆఫ్స్కు వెళ్లిపోయినట్లే. ఇప్పటికే రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు నమోదు చేసిన కేఎల్ రాహుల్ 145 స్ట్రైక్రేట్తో 451 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ అత్యధిక స్కోరు 103. ఈ సీజన్లో శతకాలు చేసిన బ్యాటర్లలో రెండో ఆటగాడు కేఎల్ రాహులే కావడం విశేషం.
వన్డౌన్లో అండగా నిలుస్తూ..
టీ20 లీగ్లో అత్యంత కీలక కెప్టెన్లలో సంజూ శాంసన్ ఒకరు. మంచి ఫామ్తో రాజస్థాన్ను నడిపిస్తున్న సంజూ ఈసారి వన్డౌన్లో వచ్చి వేగంగా పరుగులు రాబడుతున్నాడు. గత సీజన్లో రాజస్థాన్ తరఫున ఓపెనర్ వచ్చిన సంజూ శాంసన్ స్ట్రైక్రేట్ 136.72 ఉండేది. అయితే ఇప్పుడు వన్డౌన్ బ్యాటర్గా మాత్రం 153.61 స్టైక్రేట్తో పది మ్యాచుల్లో 298 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెప్టెన్గానూ ఈసారి రాజస్థాన్ను టాప్-4లో ఉండేలా చూస్తున్నాడు. ఇప్పటికే ఆరు విజయాలు, నాలుగు ఓటములతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. మంచి ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ను ఓపెనర్గా పంపి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అలానే స్పిన్ ద్వయం చాహల్-అశ్విన్ను చక్కగా వాడుకుంటూ విజయాలను సాధిస్తున్నాడు.
హేమాహేమీలు ఉన్న జట్టు..
విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తిక్ వంటి హేమాహేమీలతో పాటు హసరంగ, సిరాజ్, హర్షల్లాంటి యువ క్రికెటర్లతో కూడిన బెంగళూరును నడపడం ఆషామాషీ వ్యవహారం కాదు. తొలి కప్ కోసం వేచి చూస్తున్న అభిమానులను సంతృప్తి పరచాలంటే వ్యక్తిగత ప్రదర్శనతోపాటు కెప్టెన్సీపరంగా సూపర్ ఫామ్ను కనబరచాలి. ప్రస్తుతం డుప్లెసిస్ కూడా ఇదే చేస్తున్నాడు. తొలిసారి టీ20 లీగ్లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన డుప్లెసిస్ బెంగళూరును కప్ దిశగానే నడిపిస్తున్నాడు. అయితే మధ్యమధ్యలో ఓటములతో డీలా పడినప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో మాత్రం బెంగళూరు ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లకుగాను ఆరు విజయాలు, ఐదు ఓటములను చవిచూసిన బెంగళూరు (12) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మ్యాచ్ల్లో కనీసం ఇంకో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. వ్యక్తిగతంగా డుప్లెసిస్ పదకొండు మ్యాచ్ల్లో 130.04 స్ట్రైక్రేట్తో 316 పరుగులను సాధించాడు.
కేన్.. కెప్టెన్గా ఓకే కానీ..
కేన్ విలియమ్సన్.. కెప్టెన్సీపరంగా తిరుగులేని ఆటగాడు. న్యూజిలాండ్, హైదరాబాద్కు ఎన్నో విజయాలను అందించాడు. అయితే వ్యక్తిగతంగా మాత్రం తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచుల్లో 195 పరుగులు మాత్రమే చేశాడు. కేన్ స్ట్రైక్రేట్ (99.49) వంద కంటే తక్కువ కావడం గమనార్హం. వరుసగా ఐదు మ్యాచ్లను గెలిచిన సందర్భాల్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాలనే నిర్మించాడు. అయితే నెమ్మదిగా ఆడటమే కేన్ సమస్య. పరిస్థితులకు తగ్గట్లుగా దూకుడుగా ఆడటంలో విలియమ్సన్ను మించిన సారథి మరొకరు ఉండరు. ఇంకా ఐదు మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో కేన్ వ్యక్తిగతంగా రాణించడంతోపాటు హైదరాబాద్ను ప్లేఆఫ్స్కు చేర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అప్పుడప్పుడు తడబాటుకు గురై..
తొలి మ్యాచ్లోనే బెంగళూరు వంటి పటిష్ఠమైన జట్టుపై భారీ లక్ష్య ఛేదన చేసి మరీ మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ విజయం సాధించింది. ఇప్పటి వరకు పది మ్యాచ్లను ఆడిన పంజాబ్ ఐదు విజయాలు, ఐదు ఓటములను చవి చూసింది. దీంతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్లో గుజరాత్ను ఓడించి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. జట్టును బాగానే నడిపిస్తున్న మయాంక్ బ్యాటింగ్లో మాత్రం పెద్దగా రాణించడంలేదు. తానాడిన తొమ్మిది మ్యాచుల్లో మయాంక్ కేవలం 161 పరుగులను మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. గత సీజన్లో 12 మ్యాచులకు 441 పరుగులు చేసి అదరగొట్టిన మయాంక్కు ఈసారి కెప్టెన్సీ భారంగా మారిందేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత సీజన్లో ప్లేఆఫ్స్కు తీసుకెళ్లిన సారథి..
తొలి మ్యాచ్లోనే ఛాంపియన్ ముంబయిని మట్టికరిపించి పాయింట్ల ఖాతాను ఓపెన్ చేసిన దిల్లీకి ఆ తర్వాత పెద్దగా ఏదీ కలిసిరాలేదు. జట్టులో అగ్రస్థాయి ఆటగాళ్లున్నప్పటికీ విజయాల కోసం పోరాడుతోంది. ఆ జట్టు సారథి రిషభ్ పంత్ అయితే అడపాదడపా మంచి ఇన్నింగ్స్లనే ఆడుతున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోతున్నాడు. కీలక సమయాల్లో ఔటవ్వడంతో ఆ ప్రభావం జట్టుపై పడుతోంది. ఇప్పటివరకు దిల్లీ తొమ్మిది మ్యాచ్లకుగాను నాలుగు విజయాలను మాత్రమే సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ (8) ఏడో స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచ్లను గెలిస్తే కానీ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండవు. మరోవైపు రిషభ్ పంత్ కూడా బ్యాటింగ్లో రాణించాల్సి ఉంది. ఒక్క అర్ధ శతకం కూడా లేకపోవడం గమనార్హం. నాలుగోస్థానంలో వస్తున్న పంత్ ఇప్పటి వరకు 234 పరుగులను మాత్రమే చేశాడు.
కొత్త సారథి అయినా మారుస్తాడని భావిస్తే..
గత సీజన్లో ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్కతా ఫైనల్కు చేరుకుంది. వ్యక్తిగతంగా మోర్గాన్ రాణించకపోయినా జట్టును నడపడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. అయితే భారీ మొత్తం వెచ్చించిన కొనుగోలు చేసిన శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు) మాత్రం కోల్కతాను ప్లేఆఫ్స్కు చేర్చడానికే నానాపాట్లు పడుతున్నాడు. ఫామ్పరంగా శ్రేయస్ రాణిస్తున్నప్పటికీ జట్టు విజయాల్లో మాత్రం కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు. టీమ్ను గెలిపించే ఇన్నింగ్స్ లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడిన శ్రేయస్ రెండు అర్ధశతకాలను సాధించాడు. అదేవిధంగా 133.33 స్ట్రైక్రేట్తో 324 పరుగులు చేశాడు. కానీ ఇవేవీ కోల్కతాకు విజయాలను అందించలేకపోతున్నాయి. బ్యాటర్లు, బౌలర్లను సరైనవిధంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. 10 మ్యాచ్లకుగాను కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించిన కోల్కతా (8) పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
కెప్టెన్లు మారినా.. తేడా ఏమీ లేదు
డిఫెండింగ్ ఛాంపియన్గా కొత్త కెప్టెన్తో టోర్నీకి వచ్చిన చెన్నై తన ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రవీంద్ర జడేజా నేతృత్వంలో ఎనిమిది మ్యాచ్లను ఆడిన చెన్నై ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. వ్యక్తిగతంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 116 పరుగులు, ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. దీంతో తన ప్రదర్శనపై కెప్టెన్సీ భారం పడుతుందని భావించిన జడేజా నాయకత్వ బాధ్యతలను వదిలేశాడు. దీంతో ఎంఎస్ ధోనీ మళ్లీ జట్టు పగ్గాలను అందుకున్నాడు. తొలి మ్యాచ్లోనే హైదరాబాద్పై విజయం సాధించినా.. బెంగళూరుపై ఓటమి తప్పలేదు. ఇక ధోనీ సంగతికొస్తే మొదటి మ్యాచ్లోనే ఏడో స్థానంలో హాఫ్ సెంచరీ చేశాడు. ముంబయిపై చివరి ఓవర్లో విజృంభించి చెన్నై గెలిపించాడు. ఈ రెండూ మినహా మిగతా మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం 10 మ్యాచ్లకుగాను రెండు విజయాలతోనే ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే.
సారథి ప్రదర్శన ఘోరం.. సారథ్యం ఘోరం..
ప్రస్తుత సీజన్లో అత్యంత ఘోరంగా విఫలమైన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబయినే. తొమ్మిదో మ్యాచ్లో ముంబయి తొలి విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. ప్రస్తుత సీజన్లో అత్యంత దారుణ ప్రదర్శన చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచిపోయాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లకుగాను కేవలం 155 పరుగులను మాత్రమే సాధించాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబయి ఇకనైనా గెలుపుబాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా రోహిత్ శర్మ బ్యాట్ను ఝుళిపించాల్సిందే. ఆసీస్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు తగినంత ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటేనే టీమ్ఇండియా విజయాలు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్గా రాణిస్తే మిగతా బ్యాటర్లూ ఉత్సాహంగా ఆడేందుకు ప్రయత్నిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్