IND vs AUS: భారత్ X ఆసీస్.. రెండో టెస్టులో రికార్డుల మోత మోగేనా..?
భారత్ X ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య దిల్లీ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ఇండియా (Team India) 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో విజయం సాధించి సిరీస్ రేసులో ముందుకు సాగాలని భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో (Ind vs Aus) రెండో టెస్టు కోసం భారత్ సన్నద్ధమవుతోంది. నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ (Team India).. రెండో టెస్టులోనూ విజయం సాధించి ముందడుగు వేయాలని ఆశిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరువగా వచ్చిన భారత్.. తొలి స్థానం దక్కించుకోవాంటే ఈ విజయం చాలా కీలకం. ఈ క్రమంలో దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో పలు రికార్డులను సొంతం చేసుకొనేందుకు అవకాశం ఉంది.
దాదాపు ఐదేళ్ల తర్వాత దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఇక్కడ భారత్ను కాదని గెలవడం పర్యాటక దేశానికి అంత ఈజీ కాదు. దిల్లీ స్టేడియంలో 1959లో చివరిసారిగా గెలిచిన ఆసీస్.. ఇప్పటి వరకు మరొక విజయం సాధించలేకపోయింది. ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్ లు అరుదైన ఘనతలను తమ ఖాతాలో వేసుకొనేందుకు ఇదొక చక్కటి అవకాశం. దిల్లీ మైదానం కూడా నాగ్పుర్ మాదిరిగానే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రికార్డులు, ఘనతలు ఇవీ..
* జడేజా కేవలం ఒక్క వికెట్ తీస్తే టెస్టుల్లో 250 మార్క్ను తాకుతాడు. అలాగే 2500 పరుగులు, 250 వికెట్లు తీసిన రెండో వేగవంతమైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ (51 టెస్టుల్లో) ఈ ఘనతను సాధించగా.. ఇప్పుడు వికెట్ తీస్తే 62 టెస్టుల్లో జడేజా కూడా జాబితాలోకి వచ్చేస్తాడు.
* మరో రెండు వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ పేరిట కూడా ఓ రికార్డు నమోదవుతుంది. అదీనూ రవిచంద్రన్ అశ్విన్ తర్వాతే కావడం విశేషం. ప్రస్తుతం 9 టెస్టుల్లో 48 వికెట్లు తీశాడు. ఇంకో రెండు పడగొడితే తక్కువ టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్ను తాకిన రెండో భారత బౌలర్గా అవతరిస్తాడు. అశ్విన్ కేవలం 9 టెస్టుల్లోనే ఈ మార్క్ను అందుకొన్నాడు.
* రవిచంద్రన్ అశ్విన్ కూడా మూడు వికెట్లు తీస్తే తన ఖాతాలోనూ ఓ రికార్డు వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియాపై వంద వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. కుంబ్లే మాత్రమే ఆసీస్పై 100 వికెట్లు పడగొట్టాడు. మరోసారి 5 వికెట్ల ప్రదర్శన చేస్తే అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశం అశ్విన్కు ఉంది. స్వదేశంలో 25 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో సమానంగా ఉన్నారు.
* బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో వంద వికెట్లు తీసిన బౌలర్గా నాథన్ లయన్ మారడానికి కేవలం ఐదు వికెట్ల దూరంలో నిలిచాడు. అతడికి దరిదాపుల్లో ప్రస్తుత ఆసీస్ బౌలర్లు ఎవరూ లేరు. బ్రెట్ లీ మాత్రం 53 వికెట్లు తీశాడు.
* టెస్టు క్రికెట్లో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టాప్ -20 జాబితాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరో 73 పరుగులను స్మిత్ చేస్తే ఏబీ డివిలియర్స్ (8,765), వీవీఎస్ లక్ష్మణ్ (8,781)ను దాటేసి టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల టాప్ -20 జాబితాలోకి వచ్చేస్తాడు.
* ఛెతేశ్వర్ పుజారా వందో టెస్టు ఆడుతున్న 13వ భారతీయ క్రికెటర్గా మారతాడు. ఇప్పుడున్న జట్టు సభ్యుల్లో విరాట్ కోహ్లీ మాత్రమే వంద టెస్టులు ఆడిన ఆటగాడు కావడం విశేషం. ఇక మరో వంద పరుగులు చేస్తే ఆసీస్పై 2వేల పరుగులు చేసిన బ్యాటర్గానూ పుజారా రికార్డు సృష్టిస్తాడు. ఇలా సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా ఘనత అందుకొంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు