IND vs AUS: భారత్ X ఆసీస్.. రెండో టెస్టులో రికార్డుల మోత మోగేనా..?
భారత్ X ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య దిల్లీ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ఇండియా (Team India) 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో విజయం సాధించి సిరీస్ రేసులో ముందుకు సాగాలని భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో (Ind vs Aus) రెండో టెస్టు కోసం భారత్ సన్నద్ధమవుతోంది. నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ (Team India).. రెండో టెస్టులోనూ విజయం సాధించి ముందడుగు వేయాలని ఆశిస్తోంది. ఇప్పటికే టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరువగా వచ్చిన భారత్.. తొలి స్థానం దక్కించుకోవాంటే ఈ విజయం చాలా కీలకం. ఈ క్రమంలో దిల్లీ వేదికగా జరిగే మ్యాచులో పలు రికార్డులను సొంతం చేసుకొనేందుకు అవకాశం ఉంది.
దాదాపు ఐదేళ్ల తర్వాత దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఇక్కడ భారత్ను కాదని గెలవడం పర్యాటక దేశానికి అంత ఈజీ కాదు. దిల్లీ స్టేడియంలో 1959లో చివరిసారిగా గెలిచిన ఆసీస్.. ఇప్పటి వరకు మరొక విజయం సాధించలేకపోయింది. ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్ లు అరుదైన ఘనతలను తమ ఖాతాలో వేసుకొనేందుకు ఇదొక చక్కటి అవకాశం. దిల్లీ మైదానం కూడా నాగ్పుర్ మాదిరిగానే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రికార్డులు, ఘనతలు ఇవీ..
* జడేజా కేవలం ఒక్క వికెట్ తీస్తే టెస్టుల్లో 250 మార్క్ను తాకుతాడు. అలాగే 2500 పరుగులు, 250 వికెట్లు తీసిన రెండో వేగవంతమైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రవిచంద్రన్ అశ్విన్ (51 టెస్టుల్లో) ఈ ఘనతను సాధించగా.. ఇప్పుడు వికెట్ తీస్తే 62 టెస్టుల్లో జడేజా కూడా జాబితాలోకి వచ్చేస్తాడు.
* మరో రెండు వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ పేరిట కూడా ఓ రికార్డు నమోదవుతుంది. అదీనూ రవిచంద్రన్ అశ్విన్ తర్వాతే కావడం విశేషం. ప్రస్తుతం 9 టెస్టుల్లో 48 వికెట్లు తీశాడు. ఇంకో రెండు పడగొడితే తక్కువ టెస్టుల్లోనే 50 వికెట్ల మార్క్ను తాకిన రెండో భారత బౌలర్గా అవతరిస్తాడు. అశ్విన్ కేవలం 9 టెస్టుల్లోనే ఈ మార్క్ను అందుకొన్నాడు.
* రవిచంద్రన్ అశ్విన్ కూడా మూడు వికెట్లు తీస్తే తన ఖాతాలోనూ ఓ రికార్డు వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియాపై వంద వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు సృష్టిస్తాడు. కుంబ్లే మాత్రమే ఆసీస్పై 100 వికెట్లు పడగొట్టాడు. మరోసారి 5 వికెట్ల ప్రదర్శన చేస్తే అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశం అశ్విన్కు ఉంది. స్వదేశంలో 25 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో సమానంగా ఉన్నారు.
* బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో వంద వికెట్లు తీసిన బౌలర్గా నాథన్ లయన్ మారడానికి కేవలం ఐదు వికెట్ల దూరంలో నిలిచాడు. అతడికి దరిదాపుల్లో ప్రస్తుత ఆసీస్ బౌలర్లు ఎవరూ లేరు. బ్రెట్ లీ మాత్రం 53 వికెట్లు తీశాడు.
* టెస్టు క్రికెట్లో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టాప్ -20 జాబితాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరో 73 పరుగులను స్మిత్ చేస్తే ఏబీ డివిలియర్స్ (8,765), వీవీఎస్ లక్ష్మణ్ (8,781)ను దాటేసి టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల టాప్ -20 జాబితాలోకి వచ్చేస్తాడు.
* ఛెతేశ్వర్ పుజారా వందో టెస్టు ఆడుతున్న 13వ భారతీయ క్రికెటర్గా మారతాడు. ఇప్పుడున్న జట్టు సభ్యుల్లో విరాట్ కోహ్లీ మాత్రమే వంద టెస్టులు ఆడిన ఆటగాడు కావడం విశేషం. ఇక మరో వంద పరుగులు చేస్తే ఆసీస్పై 2వేల పరుగులు చేసిన బ్యాటర్గానూ పుజారా రికార్డు సృష్టిస్తాడు. ఇలా సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా ఘనత అందుకొంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434