Shubman Gill: వచ్చాడు.. వచ్చాడు.. టీమ్ఇండియా యువరాజు
శుభ్మన్ గిల్.. 20 ఏళ్లకే టీమ్ఇండియాలో చోటు దక్కించుకుని అమోఘమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ..పరుగుల వరద పారిస్తూ.. భారత భవిష్యత్ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు.
శుభ్మన్ వన్డేల్లో నంబర్వన్
పంజాబ్ నుంచి ఓ కుర్రాడొచ్చాడు. చిన్న వయస్సులోనే దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు. 2018 అండర్-19 ప్రపంచకప్లో సత్తాచాటాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి భారత్ ట్రోఫీ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పుడే అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్లకే టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. 2023 నుంచి అమోఘమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. భారత భవిష్యత్ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత కింగ్ కోహ్లి వచ్చాడు. ఇప్పుడు కోహ్లి తర్వాత ఎవరూ అంటే అతనే పేరే వినిపిస్తోంది. అతనే.. టీమ్ఇండియా యువరాజు శుభ్మన్ గిల్ (Shubman Gill). ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం సాధించి తనపై అంచనాలను మరింత పెంచేశాడు.
ఆ దిగ్గజాల తర్వాత..
దిగ్గజం సచిన్ తెందుల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని, కింగ్ కోహ్లి.. ఈ ముగ్గురూ తమదైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు ఎదిగారు. టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. క్రికెట్ దేవుడిగా పేరు పొందిన సచిన్.. దిగ్గజ సారథిగా గుర్తింపు సాధించిన ధోని.. క్రికెట్ రారాజుగా కీర్తి సాధించిన కోహ్లి.. ఇలా ఈ ముగ్గురూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే వన్డే క్రికెట్లో ఈ ముగ్గురి ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్డే క్రికెట్లో నంబర్వన్ బ్యాటర్గా గతంలో ఈ ముగ్గురూ నిలిచారు. ఇప్పటికే సచిన్, ధోని జట్టుకు వీడ్కోలు పలికారు. ఇక కోహ్లి దూకుడు కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కోహ్లి వయస్సు 35 ఏళ్లు. అతని తర్వాత టీమ్ఇండియా సూపర్ స్టార్గా శుభ్మన్ కనిపిస్తున్నాడు. అవును.. తాజాగా ప్రపంచ నంబర్వన్ వన్డే ఆటగాడిగా ఎదిగిన అతను.. సచిన్, ధోని, కోహ్లి తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. 1988లో వన్డే ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టగా ఇప్పటివరకూ భారత్ నుంచి కేవలం నలుగురు బ్యాటర్లే నంబర్వన్గా నిలిచారంటే దీనికున్న ప్రాముఖ్యత, ఇది సాధించడం వెనుక ఉండే కష్టం అర్థం చేసుకోవచ్చు.
సొగసైన ఆటతో..
టీ20ల కాలంలో ఇప్పటి యువతరం ఆటగాళ్లు ధనాధన్ షాట్లు ఆడటంపైనే దృష్టి పెడుతున్నారు. కానీ 24 ఏళ్ల శుభ్మన్ మాత్రం ప్రస్తుత తరంలోని అరుదైన ఆటగాడు అని చెప్పాలి. టీ20లకు తగ్గట్లుగా వేగంగా ఆడటంతో పాటు వన్డేలకు అనుగుణంగా క్రీజులో కుదురుకోవడం, టెస్టు పరిస్థితులకు సర్దుకోవడం అతనికి తెలుసు. సొగసైన ఆటతీరు అతని సొంతం. ముఖ్యంగా వన్డేల్లో అతని ప్రదర్శన అమోఘం. క్రీజులో బలంగా నిలబడి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కోసం అతను కొట్టే హాఫ్ వ్యాలీ షాట్ చూసి వారెవా అనుకోవాల్సింది. అలాగే లాఫ్టెడ్ షాట్లలోనూ గిల్ ప్రత్యేకత వేరు. అతను 2019లో వన్డేలతోనే అంతర్జాతీయ క్రికెట్లో గిల్ అడుగుపెట్టాడు. జట్టులో పోటీ, కరోనా తదితర కారణాలతో 2022 జులై ముందు వరకూ అతను కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడగలిగాడు. కానీ ఆ తర్వాతే భారత క్రికెట్లో శుభ్మన్ శకం మొదలైంది. జట్టులో చోటును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పరుగుల వేటలో దూసుకెళ్తున్నాడు. శతకాలు బాదుతున్నాడు.
ఈ ఏడాది మన ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్పై వన్డేలో అతను సాధించిన ద్విశతకాన్ని ఎలా మర్చిపోగలం. వన్డేల్లో ద్విశతకం చేసిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా శుభ్మన్ రికార్డు సృష్టించాడు. శుభ్మన్ సెంచరీలు చేసినా వెంటనే ఔటైపోవడం అతని తండ్రి లఖ్విందర్ సింగ్కు నచ్చలేదు. ఇదే విషయాన్ని గిల్కు చెప్తే.. వెంటనే కివీస్తో మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి తండ్రికి కానుకగా ఇచ్చాడు. తనయుడి కోసం లఖ్విందర్ సొంతంగా మైదానం ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటివరకూ గిల్ 41 వన్డేల్లో 61.02 సగటుతో 2136 పరుగులు చేశాడు. ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా (38 ఇన్నింగ్స్) 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడు అతనే. మరోవైపు టీ20ల్లోనూ అతని దూకుడు కొనసాగుతోంది. ఈ ఏడాది ఐఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున 17 మ్యాచ్ల్లో 59.33 సగటుతో 890 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కివీస్తో టీ20లో అజేయంగా 126 పరుగులు చేసిన అతను.. పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. ఇది శుభ్మన్కు ఆరంభం మాత్రమే. ఇంకెంతో సుదీర్ఘమైన కెరీర్ అతనికుంది. అతనిలాగే నిలకడగా రాణిస్తే దిగ్గజాలను దాటే అవకాశం ఉంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు