IND vs AUS: ఇదొక సూపర్ సిరీస్.. ఆ మ్యాచ్ ఫలితంపైనా ఓ కన్నేసి ఉంచాం: ద్రవిడ్
ఆసీస్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూసుకెళ్లింది. ఈ సందర్భంగా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ను (IND vs AUS) టీమ్ఇండియా 2-1తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా నాలుగో సారి సిరీస్ను గెలుచుకోవడం కూడా రికార్డే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇద్దరు భారత క్రికెటర్లను వరించింది. అవార్డును ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉమ్మడిగా సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్ వేదికగాజరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వరుసగా రెండోసారి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడమే దీనికి కారణం. ఇదే విషయంపైనా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కూడా స్పందించాడు. ఆసీస్తో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘చాలా రోజుల తర్వాత తీవ్రమైన పోటీపడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించిన విధాన అద్భుతం. శుభ్మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడటం చాలా బాగుంది. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కఠినంగా శ్రమిస్తాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేదానిపై మేం ఓ కన్నేసి ఉంచాం. ఈ టెస్టు లంచ్ బ్రేక్ సమయానికి ఆ మ్యాచ్ ఫలితం కూడా తేలిపోయింది. ఆసీస్కు అద్భుతమైన ఇద్దరు యువ స్పిన్నర్లు దొరికారు. మర్ఫీ, కునెమన్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. విదేశీ జట్లకు ఒకేఒక్క నాణ్యమైన స్పిన్నర్ను ఇప్పటి వరకు చూస్తూ ఉండేవాళ్లం. కానీ, ఈసారి మాత్రం లయన్తోపాటు వారిద్దరూ బాగా వేశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే తొలుత సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం’’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
ఆ సెషన్ సవాల్ విసిరింది: గిల్ (Shubman Gill)
నాలుగో టెస్టులో ఆసీస్పై శుభ్మన్ గిల్ (128) సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘నాథన్ లయన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఎప్పుడూ అతడి మార్క్ ఉంటుంది. మూడో రోజు తొలి సెషన్ చాలా సవాల్ విసిరింది. బ్యాటింగ్ చేయడానికి రోహిత్, నేనూ శ్రమించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా లయన్ బౌలింగ్ చేసేటప్పుడు క్లిష్టంగా మారింది. బ్యాటర్కు ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఆఫ్స్టంప్కు ఆవల నిలకడగా బంతులను సంధిస్తాడు’’ అని గిల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్