IND vs AUS: ఇదొక సూపర్ సిరీస్.. ఆ మ్యాచ్ ఫలితంపైనా ఓ కన్నేసి ఉంచాం: ద్రవిడ్
ఆసీస్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూసుకెళ్లింది. ఈ సందర్భంగా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ను (IND vs AUS) టీమ్ఇండియా 2-1తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా నాలుగో సారి సిరీస్ను గెలుచుకోవడం కూడా రికార్డే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇద్దరు భారత క్రికెటర్లను వరించింది. అవార్డును ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉమ్మడిగా సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్ వేదికగాజరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వరుసగా రెండోసారి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడమే దీనికి కారణం. ఇదే విషయంపైనా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కూడా స్పందించాడు. ఆసీస్తో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘చాలా రోజుల తర్వాత తీవ్రమైన పోటీపడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించిన విధాన అద్భుతం. శుభ్మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడటం చాలా బాగుంది. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కఠినంగా శ్రమిస్తాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేదానిపై మేం ఓ కన్నేసి ఉంచాం. ఈ టెస్టు లంచ్ బ్రేక్ సమయానికి ఆ మ్యాచ్ ఫలితం కూడా తేలిపోయింది. ఆసీస్కు అద్భుతమైన ఇద్దరు యువ స్పిన్నర్లు దొరికారు. మర్ఫీ, కునెమన్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. విదేశీ జట్లకు ఒకేఒక్క నాణ్యమైన స్పిన్నర్ను ఇప్పటి వరకు చూస్తూ ఉండేవాళ్లం. కానీ, ఈసారి మాత్రం లయన్తోపాటు వారిద్దరూ బాగా వేశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే తొలుత సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం’’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
ఆ సెషన్ సవాల్ విసిరింది: గిల్ (Shubman Gill)
నాలుగో టెస్టులో ఆసీస్పై శుభ్మన్ గిల్ (128) సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘నాథన్ లయన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఎప్పుడూ అతడి మార్క్ ఉంటుంది. మూడో రోజు తొలి సెషన్ చాలా సవాల్ విసిరింది. బ్యాటింగ్ చేయడానికి రోహిత్, నేనూ శ్రమించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా లయన్ బౌలింగ్ చేసేటప్పుడు క్లిష్టంగా మారింది. బ్యాటర్కు ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఆఫ్స్టంప్కు ఆవల నిలకడగా బంతులను సంధిస్తాడు’’ అని గిల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు