IND vs ENG: ఈ ఇంగ్లిష్ టెస్టు చాలా టఫ్ గురూ! ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో టీమ్ఇండియా సవాళ్లివే
కొత్త ఏడాదిలో టీమ్ఇండియాకు అసలు సిసలైన పరీక్ష. ప్రమాదకర ఇంగ్లాండ్తో (IND vs ENG 2024) అయిదు టెస్టుల సిరీస్ గురువారమే ఆరంభం కానుంది.
భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు సమయం ఆసన్నమైంది. ప్రమాదకర ఇంగ్లాండ్తో (IND vs ENG 2024) అయిదు టెస్టుల సిరీస్ గురువారమే ఆరంభం కానుంది. తొలి టెస్టు మన ఉప్పల్లోనే. ఆడేది స్వదేశంలోనే అయినా.. ఇక్కడ రోహిత్ సేనకు తిరుగులేకపోయినా.. ఈ ఇంగ్లిష్ టెస్టు మాత్రం చాలా టఫ్. బజ్బాల్ ఆటతీరుతో సాగుతున్న ఇంగ్లాండ్కు చెక్ పెట్టడం అంత సులువు కాదు. ఈ సిరీస్లో టీమ్ఇండియాకు సవాళ్లు ఎదురుకానున్నాయి. కొన్ని సమస్యలూ ఉన్నాయి. మరి స్వదేశంలో గత 16 టెస్టు సిరీస్లను సొంతం చేసుకున్న టీమ్ఇండియా ఈ ఛాలెంజ్లను దాటి అదరగొడుతుందా?ఉప్పల్లో జెండా ఎగరేసి సిరీస్ను ఘనంగా మొదలెడుతుందా?
ఓపెనింగ్తో మొదలు!
భారత టెస్టు జట్టు సవాళ్లు ఓపెనింగ్తోనే మొదలవుతున్నాయి. ఓ ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడతాడు. మరో ఓపెనర్గా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ బరిలో దిగుతాడు. కానీ ఈ జోడీ ఇంకా కుదురుకోలేదనే చెప్పాలి. అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో ఈ ఓపెనర్ల ప్రదర్శనే అందుకు నిదర్శనం. సఫారీ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి మాత్రమే వీళ్ల భాగస్వామ్యం 20 పరుగులు దాటింది. వెస్టిండీస్తో టెస్టు అరంగేట్రం చేసిన యశస్వికి స్వదేశంలో ఇదే తొలి టెస్టు సిరీస్. మరి ఈ సిరీస్లో రోహిత్తో కలిసి అతను మంచి ఆరంభాలను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మూడో స్థానంలో వచ్చే శుభ్మన్ కూడా టెస్టుల్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. 20 టెస్టుల్లో 30.58 సగటు మాత్రమే నమోదు చేశాడు. 2021లో ఇంగ్లాండ్తో సొంతగడ్డపై ఆడిన నాలుగు టెస్టుల్లోనూ రాణించలేకపోయాడు. మూడో స్థానంలో ఆడి 6 ఇన్నింగ్స్ల్లో 103 పరుగులు మాత్రమే చేశాడు. సంధి దశలో ఉన్న జట్టుకు శుభ్మన్ ఫామ్ అందుకోవడం అత్యంత అవసరం.
బలహీనంగా మిడిలార్డర్
2021లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కోహ్లీ, పుజారా, రహానె ఉండటంతో మిడిలార్డర్ బాగుంది. కోహ్లీకి 113, పుజారాకు 103, రహానెకు 85 టెస్టుల అనుభవం ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకోవడం.. పుజారా, రహానెకు జట్టులో చోటు దక్కకపోవడంతో మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ ఏమేరకు రాణిస్తారో చూడాలి. ఇక కోహ్లీ లేని లోటు తీర్చలేనిదే. సొంతగడ్డపై కోహ్లీ టెస్టు సగటు 60.05గా ఉంది. ఇప్పుడా భారాన్ని శ్రేయస్ మోయగలడా? అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్కు సొంతగడ్డపై మంచి రికార్డే ఉంది. కానీ నిరుడు ఆస్ట్రేలియా బౌలర్లను అతను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. ముఖ్యంగా షార్ట్పిచ్ బంతి బలహీనతను అధిగమించాల్సి ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పేసర్లు కూడా ఇదే ఆయుధంతో అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించొచ్చు. రాహుల్ ఫామ్ గురించి చింత లేదు. మరోవైపు జట్టులో పేస్ ఆల్రౌండర్ లేకపోవడం కూడా లోటే. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడే ఆస్కారముంది.
భరత్కు భలే ఛాన్స్
కేఎస్ భరత్కు మరోసారి మంచి అవకాశం దక్కనుంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడని కోచ్ ద్రవిడ్ చెప్పిన నేపథ్యంలో భరత్కు ఆ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. మరి ఈ ఛాన్స్ను అతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. వికెట్ల వెనకాల అతని ప్రదర్శనపై ఎలాంటి సందేహాలు లేవు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో అతను ఒకడు. స్పిన్ బౌలింగ్లోనూ మెరుగ్గా వికెట్ కీపింగ్ చేస్తాడు. కానీ అతను బ్యాటింగ్తో రాణించడం వ్యక్తిగతంగా భరత్కే కాకుండా జట్టుకు చాలా అవసరం. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన ఈ ఆంధ్ర ఆటగాడు 129 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ అతని కెరీర్కు ఎంతో కీలకమైందనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!