Team India: ర్యాంకుల్లో మనమే.. ప్రపంచ క్రికెట్లో భారత్ తిరుగులేని ఆధిపత్యం
ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) టీమ్ఇండియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కోణంలోనే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తీసుకున్నా మనమే టాప్ కావడం విశేషం.
ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యం మామూలుగా లేదిప్పుడు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఈ మూడింట్లోనూ మన జట్టే నంబర్వన్ అన్న సంగతి తెలిసిందే. అంతే కాక ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్లోనూ మనవాళ్లదే ఆధిపత్యం. ఇక ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కోణంలోనే కాదు.. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తీసుకున్నా భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. సచిన్, ధోని, కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాళ్ల తర్వాత భారత్ నుంచి వన్డేల్లో నంబర్వన్ అయింది శుభ్మనే. ఇప్పటిదాకా ఈ యువ ఓపెనర్ వన్డేల్లో ఆడింది 41 ఇన్నింగ్స్లే. ఇంతలోనే అగ్రస్థానం సాధించడం అనూహ్యం. కోహ్లి వల్ల కూడా సాధ్యం కాని డబుల్ సెంచరీని గిల్ అందుకున్నాడు. అతనిప్పటికే 6 శతకాలు బాదేశాడు. 2022 ఆరంభానికి ముందు టాప్-10లో కూడా లేని గిల్.. ఇప్పుడు బాబర్ అజామ్ను వెనక్కి నెట్టి ఏకంగా నంబర్వన్ అయిపోయాడు. ప్రస్తుతం శుభ్మన్ ఖాతాలో 830 పాయింట్లుంటే.. బాబర్ 824 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విశేషం ఏంటంటే.. వన్డేల్లో నంబర్వన్ బౌలర్ కూడా భారతీయుడే. ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న సిరాజ్ వికెట్ల మీద వికెట్లు తీస్తూ నంబర్వన్ బౌలరయ్యాడు. అతను 709 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటర్ల టాప్-10 ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఇంకో ఇద్దరు ఆటగాళ్లున్నారు. కోహ్లి (770 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. రోహిత్ (739) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలర్ల టాప్-10లోనూ ఇంకో ముగ్గురు భారత ఆటగాళ్లున్నారు. కుల్దీప్ (661 పాయింట్లు), 4, బుమ్రా (654), 8, షమి (635) వరుసగా 4, 8, 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమ్ర్యాంకింగ్స్లో భారత్ కూడా ఈ ఏడాదే తిరిగి నంబర్వన్ అయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో సూర్యకుమార్ చాన్నాళ్ల నుంచి నంబర్వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 863 పాయింట్లున్నాయి. రెండో స్థానంలో ఉన్న రిజ్వాన్ (787)కు అతడికి చాలా అంతరం ఉండటంతో సూర్య ఫామ్ కోల్పోతే తప్ప ఇంకా చాలా రోజులు అగ్రస్థానంలో కొనసాగే అవకాశముంది. ఈ ఫార్మాట్లో హార్దిక్ పాండ్య ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్లోనూ భారత ఆటగాళ్ల హవా నడుస్తోంది. నంబర్వన్ బౌలర్ అశ్విన్ (879) కాగా, ఆల్రౌండర్లలో అగ్రస్థానం జడేజా (455)ది. బౌలర్లలో జడేజా మూడో స్థానంలో ఉంటే.. ఆల్రౌండర్లలో అశ్విన్ (370) రెండో స్థానంలో ఉండటం విశేషం. అక్షర్ పటేల్ (298) ఆల్రౌండర్లలో అయిదో స్థానంలో ఉన్నాడు. ఇలా మూడు ఫార్మాట్లలోనూ జట్టు, ఆటగాళ్ల ర్యాంకింగ్స్ పరంగా భారత్ ఆధిపత్యం చలాయిస్తోంది.
కప్పులో దూకుడు
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో భారత్ మంచి అంచనాలతోనే బరిలోకి దిగింది. కానీ ఆ అంచనాలను మించిపోయి అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో మ్యాచ్ల్లో మాత్రమే కొంచెం కష్టపడ్డ టీమ్ఇండియా.. మిగతా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. వేరే జట్లను వణికించిన దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. టోర్నీలో ఇప్పటిదాకా అన్ని మ్యాచ్లూ గెలిచిన ఏకైక జట్టు భారతే. చివరి మ్యాచ్ నెదర్లాండ్స్తో కాబట్టి రోహిత్ సేన అజేయంగానే లీగ్ దశను ముగించే అవకాశముంది. ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన, వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితా తీస్తే అక్కడా భారత్ ఆధిపత్యమే కనిపిస్తోంది. బ్యాటర్లలో డికాక్ 550 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 543 పరుగులతో అతడి వెనుకే ఉన్నాడు. విరాట్ జోరు చూస్తుంటే టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 442 పరుగులతో అయిదో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లున్నారు. టోర్నీలో 4 మ్యాచ్లే ఆడిన షమి 16 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. బుమ్రా (15), జడేజా వరుసగా 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. మన ఆటగాళ్లు ఇలాగే చెలరేగితే, జట్టు సమష్టి ప్రదర్శన కొనసాగితే వన్డే ప్రపంచకప్ మూడోసారి భారత్ సొంతం కావడం ఖాయం.
-ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు