Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Australia tour of India)లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు (Ind vs Aus) ఈ నెల 9న ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో జట్టు తుది కూర్పు (Team india prediction) ఇలా ఉండొచ్చు.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీతో రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్స్ (WTC Finals) బెర్త్, ర్యాంకింగ్స్లో మొదటి ప్లేస్... ఈ రెండు కీలక అంశాలను తేల్చే బోర్డర్ గావస్కర్ (Border Gavaskar Trophy) ట్రోఫీకి రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా (India - Australia) మధ్య గురువారం (జనవరి 9) నాగ్పూర్లో తొలి టెస్టు (Nagpur Test) మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా తుది కూర్పు ఇలా ఉండొచ్చు అని వార్తలొస్తున్నాయి. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం కంగారూలను ఢీకొట్టే 11 మంది భారతీయులు వీరే కావొచ్చు.
టీమ్ ఇండియా ఫైనల్ 11 గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఏడు ప్లేస్ల గురించి అంతా ఓకే.. నాలుగు స్థానాల మీదే చర్చ నడుస్తోంది. ఆ స్థానాల కోసం పోటీలో ఉన్నది శుభ్మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కె.ఎస్.భరత్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. వీరిలో ముగ్గురు తుది జట్టులో ఉంటారు. అయితే వాళ్లెవరూ అనేదే ఇక్కడ చర్చ. రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్కు చోటు పక్కా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ల గత ఆటతీరు, ఫామ్, రికార్డులు.. ఇలా ఏవి చూసుకున్నా.. వీళ్ల ప్లేస్ గురించి ఆలోచనే అవసరం లేదు. జడేజా గత కొన్ని నెలలుగా గాయం కారణంగా దూరంగా ఉన్నా.. ఇటీవల రంజీలో దుమ్మురేపి జట్టులోకి వచ్చాడు.
స్పిన్నర్ ఎవరు.. కీపర్ ఎవరు
పెండింగ్లో ఉన్న నాలుగు స్థానాల్లో తొలుత మూడో స్పిన్నర్ సంగతి చూద్దాం. టెస్టులు, అందులోనూ భారత్లో టెస్టులు అంటే మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్కి ఓటేస్తారు చాలామంది. అయితే అక్షర్ కంటే కుల్దీప్ యాదవ్ అయితే బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. జడేజా, అక్షర్ బౌలింగ్ స్టయిల్ కాస్త దగ్గరదగ్గరగా ఉంటాయని.. అందుకే వైవిధ్యం కోసం కుల్దీప్కు చోటివ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఎలాంటి పిచ్ మీదనైనా బంతిని తిప్పేయడం అక్షర్ కంటే కుల్దీప్కే సాధ్యం అనేది చర్చ. అయితే బ్యాటింగ్ను కూడా పరిగణలోకి తీసుకుంటే అక్షర్కే ఎక్కువ మార్కులు పడతాయి.
రెండో చర్చనీయాంశం.. కీపర్. రిషబ్ పంత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో రేసులోకి కె.ఎస్.భరత్, ఇషాన్ కిషన్ వచ్చారు. పంత్ స్టైల్ అగ్రెసివ్ బ్యాటింగ్, కీపింగ్ కావాలి అనుకుంటే ఇషాన్ని మించిన ఆప్షన్ లేదు. అయితే రంజీ గేమ్స్లో ప్రదర్శన భరత్కు పాజిటివ్గా మారింది. ఇటు బ్యాటింగ్లోను, అటు కీపింగ్లోనూ అదరగొట్టడం.. జట్టులో చాలా రోజులు బెంచ్ మీద ఉండటం లాంటి అంశాలు భరత్కు కలిసొస్తాయి అంటున్నారు పరిశీలకులు.
గిల్ ఉంటాడా.. స్కై వస్తాడా
గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అవ్వడంతో ఆ ప్లేస్ను ఫిల్ చేసే తలనొప్పి టీమ్ మేనేజ్మెంట్కి వచ్చింది. అయితే ఇది ప్లేయర్లు లేక కాదు.. ఆ స్థానం కోసం ఒకరికి మించి పోటీలో ఉండటమే సమస్య. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న బ్యాటర్ల పేర్లు సూర్య కుమార్ యాదవ్, శుభ్మన్ గిల్. ఇప్పటికే గిల్ టెస్టుల్లో మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గిల్, సూర్య మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఫామ్కి ఓటేస్తారా.. తొలి ఛాన్స్ ఇచ్చి టెస్టులకు ‘స్కై’ని పరిచయం చేస్తారా అనేది చూడాలి.
టీమ్లో పంత్ లేని నేపథ్యంలో దూకుడైన ప్లేయర్ కావాలంటే సూర్య ఉండాల్సిందే. రీసెంట్ ఫామ్ను దృష్టిలో పెట్టుకుంటే గిల్ను తీసుకుంటారు. అప్పుడు స్కై కోరిక ఇప్పుడు నెరవేరదు. అయితే మిడిలార్డర్లో ఆడటానికి సిద్ధం అని కేఎల్ రాహుల్ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం ఖాళీ అని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే శుబ్మన్కే ఫైనల్ 11లో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ భరత్ బదులు ఇషాన్ను తీసుకుంటే.. అతను ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి.. అప్పుడు సూర్యకు జట్టులో చోటు ఉండొచ్చు. గిల్ బెంచ్కే పరిమితమవుతాడు. దానికితోడు రాహుల్ మిడిలార్డర్లోనే రాణిస్తుండటంతో.. జట్టు యాజమాన్యం కొత్త ఓపెనర్ ఆలోచనలో పడింది అంటున్నారు. ఒకవేళ ఓపెనర్ అనే పాయింట్ చర్చకు వస్తే.. సూర్యకి కష్టమే.
ఇది కష్టమే...
అవకాశాలు తక్కువగా ఉన్నా.. చర్చలో ఉన్న మరో అంశం మూడో పేసర్. నాగ్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని... అందుకే ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అనూహ్యంగా ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగాలి అనుకుంటే అక్షర్/ కుల్దీప్ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు దాదాపు అసాధ్యం అని చెప్పాలి.
తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్.రాహుల్ (వైస్ కెప్టెన్), ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ శుబ్మన్ గిల్, కె.ఎస్.భరత్/ ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు