Team India: టీమ్ఇండియా.. సీనియర్ల లోటు పూడ్చే కుర్రాళ్లు ఎవరు?
ప్రతి ఆటలోనూ.. సీనియర్ ఆటగాళ్ల స్థానాన్ని జూనియర్లు భర్తీ చేస్తుంటారు. ప్రస్తుతం టీమ్ఇండియా కూడా సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ఎదురుచూస్తోంది. మరి, సీనియర్ల స్థానాన్ని పూడ్చే కుర్రాళ్లు ఎవరో..?
రోజులు గడుస్తున్న కొద్దీ.. ఏళ్లు కరుగుతున్న కొద్దీ.. కాలానుసారం మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారత క్రికెట్ జట్టు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఎంత దిగ్గజ ఆటగాడైనా ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. పాత నీరు వెళ్తేనే.. కొత్త నీరు వచ్చేది. ప్రతి జట్టులోనూ సంధి దశ ఉంటుంది. సీనియర్ ఆటగాళ్ల ప్లేసులను భర్తీ చేసేందుకు జూనియర్లు వస్తారు. ఇప్పుడు టీమ్ఇండియా కూడా అలాంటి సంధి దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆటగాళ్ల మార్పు అనివార్యమైంది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సీనియర్ల లోటును తీర్చేదెవరు? భారత జట్టు భవిష్యత్ తారలుగా నిలిచెదేవరు?
ఆ దిగ్గజాలు వెళ్లినా..
గంగూలీ, సెహ్వాగ్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, ధోని, యువరాజ్ సింగ్, జహీర్ఖాన్, ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ లాంటి దిగ్గజాలతో ఒకప్పుడు టీమ్ఇండియా కళకళలాడుతుండేది. వీళ్లతో కూడిన జట్టు ఎంతో పటిష్ఠంగా కనిపించేది. దీంతో వీళ్లు ఆటకు వీడ్కోలు పలికితే జట్టు పరిస్థితి ఏమిటీ? వీళ్లను భర్తీ చేసే అసలైన వారసులు వస్తారా? అనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి, పుజారా, రహానె, జడేజా, బుమ్రా, షమి, సిరాజ్, అశ్విన్ లాంటి ఆటగాళ్లు వచ్చారు. ఉత్తమ ప్రదర్శనతో జట్టును విజయాల దిశగా నడిపిస్తున్నారు. జట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ ఇప్పుడు మరోసారి జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బయటకు వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం యువ ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. ఘన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు ఎవరు?
ఇప్పటికే పుజారా, రహానె టెస్టు జట్టుకు దూరమయ్యారు. కెప్టెన్ రోహిత్ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి కెరీర్ కూడా ముగింపు దిశగా సాగుతోంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న షమి కూడా ఎక్కువ కాలం ఆడేలా కనిపించడం లేదు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్కు అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సంధి దశను ఎదుర్కొంటుందనే చెప్పాలి. మరి ఈ దశ సాఫీగా సాగేలా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురు కాకుండా ఉండేలా జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. 37 ఏళ్లకు చేరువలో ఉన్న రోహిత్ ఇంకెంతో కాలం జట్టులో కొనసాగే పరిస్థితి లేదనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అతడి ప్రయాణం ముగింపు దిశగా సాగే అవకాశముంది. రోహిత్ ప్లేసును భర్తీ చేసేందుకు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా లాంటి యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శుభ్మన్, టెస్టుల్లో యశస్వి జైస్వాల్ మరో ఓపెనర్గా ఆడుతున్నారు. ఇక కోహ్లిని రీప్లేస్ చేసే నైపుణ్యాలు హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మలో కనిపిస్తున్నాయి.
టెస్టుల విషయానికి వస్తే పుజారా, రహానె ప్లేసుల్లో ఇప్పుడు శుభ్మన్, శ్రేయస్ ఆడుతున్నారు. బౌలింగ్లో చూస్తే ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ ఛాన్స్లు అందుకునేలా కనిపిస్తున్నారు. కానీ రోహిత్, కోహ్లి, పుజారా, రహానె, అశ్విన్, షమి, చాహల్ ఖాళీ చేసే ప్లేసులను భర్తీ చేయడం అంత సులువు కాదు. అత్యుత్తమ ప్రదర్శనతో వీళ్లు లేని లోటును మరిపించాల్సిన బాధ్యత ఈ యువ ఆటగాళ్లపై ఉంది. కానీ దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో యశస్వి, శుభ్మన్, శ్రేయస్, ప్రసిద్ధ్ అంచనాలను అందుకోలేకపోయారు. తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పటికే జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో నిలకడగా రాణించకపోతే అది వ్యక్తిగతంగానే కాదు జట్టుకూ నష్టం చేసే ప్రమాదముంది. అందుకే జట్టు ఆశలు నిలబడేలా, అంచనాలు అందుకునేలా యువ ఆటగాళ్లు సత్తాచాటాల్సి ఉంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!