IND w Vs AUS w: పోరాడి ఓడిన భారత్.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆసీస్
మహిళల టీ20 ప్రపంచకప్లో (Womens World Cup 2023) భారత్ మరోసారి చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో 5 పరుగుల తేడాతో భారత్పై ఆసీస్ (IND w Vs AUS w) విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్లో (Womens World Cup 2023) భారత్ కథ ముగిసింది. మరోసారి ఆసీస్ చేతిలో భారత్కు (IND w Vs AUS w) పరాభవం తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో 5 పరుగుల తేడాతో భారత్పై ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 167 పరుగులకే పరిమితమైంది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ఆసీస్ చేరుకుంది.
వారిద్దరూ ఉండుంటే..
ఆసీస్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. అద్భుత ఫామ్లో ఉన్న స్మృతీ మంధాన (2), షఫాలీ వర్మ (9)తోపాటు యస్తికా భాటియా (2) త్వరగా పెవిలియన్కు చేరారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (43), హర్మన్ ప్రీత్ కౌర్ (52) మాత్ర వచ్చీరావడంతోనూ హిట్టింగ్ మొదలుపెట్టారు. దీంతో ఛేదించాల్సిన రన్రేట్ అదుపులోకి వచ్చింది. వీరిద్దరూ నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించారు. అయితే కీలక సమయంలో జెమీమాతోపాటు హర్మన్ కూడా పెవిలియన్కు చేరడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. మరోవైపు దీప్తి శర్మ (20*) కాసేపు పోరాడినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయింది. ఆసీస్ బౌలర్లు బ్రౌన్ 2, గార్డెనర్ 2.. జొనాసెన్, స్కట్ చెరో వికెట్ తీశారు.
క్యాచ్లు మిస్ చేసి..
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత ఫీల్డింగ్ గొప్పగా ఏమీ లేదు. కానీ, చేతిలో పడిన క్యాచ్లను మిస్ చేసి భారీ మూల్యం చెల్లించుకొంది. కీలకమైన మూనీ (54), హీలీ (25) క్యాచ్లను చేజార్చడంతో ఆసీస్ మంచి లక్ష్యాన్నే భారత్ ముందుంచగలిగింది. ఆసీస్ విజయం సాధించడానికి వారి ఫీల్డింగ్ కూడా ఓ కారణం.. బౌండరీలను ఆపి మరీ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. నాకౌట్ దశలో ఇలాంటి పొరపాట్లు ఎంత పని చేస్తాయనేది ఈ మ్యాచ్తోనైనా టీమ్ఇండియా ఫీల్డర్లు తెలుసుకోవాలి. భారత బౌలర్లూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. లేకపోతే ఆసీస్ను 160 పరుగుల్లోపే కట్టడి చేసే అవకాశం ఉండేది. శిఖా పాండే 2.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.