Team India: కొత్త ఏడాదిలో ఈ సవాళ్లను టీమ్ఇండియా దాటేనా?
కొత్త సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శనతో మరిపించేందుకు టీమ్ఇండియా ఉత్సాహంతో సాగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించాలన్నా ఈ ఏడాది భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది.
కొంగొత్త ఆశలను మోసుకుంటూ కొత్త ఏడాది వచ్చేసింది. భారత క్రికెటర్లు కూడా నూతన సంవత్సరంలో సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి.. వన్డే ప్రపంచకప్ తుదిపోరులో పరాజయం.. ఇవీ 2023 మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. ఇప్పుడు వీటిని దాటి 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో మరిపించేందుకు టీమ్ఇండియా కొత్త ఉత్సాహంతో సాగనుంది. కానీ ఈ ఏడాది మన క్రికెట్ జట్టుకు కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించాలన్నా ఈ ఏడాది భారత జట్టుకు ఎంతో కీలకం.
అదే మొదటిది..
2024లో టీమ్ఇండియాకు తొలి సవాలు దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రూపంలో ఎదురు కానుంది. సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని నిరుడు డిసెంబర్లో అక్కడ అడుగుపెట్టిన భారత్కు తొలి మ్యాచ్లోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. అన్ని విభాగాల్లోనూ ముఖ్యంగా బౌలింగ్లో విఫలమైన టీమ్ఇండియా ఏకంగా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో చిత్తయింది. సఫారీ పేస్ బౌలింగ్కు దాసోహమన్న భారత్ వరుసగా తొలి రెండు ఇన్నింగ్స్ల్లో 245, 131 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో సిరీస్ 0-2తో క్లీన్స్వీప్ పరాభవం తప్పించుకోవాలంటే భారత్ బుధవారం ఆరంభమయ్యే రెండో టెస్టులో గెలవాల్సిందే. విజయం దక్కాలంటే ముందు ప్రత్యర్థి పేసర్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై దృష్టి పెట్టిన భారత బ్యాటర్లు నెట్స్లో ప్రత్యేకంగా సాధన కొనసాగిస్తున్నారు.
ఇంగ్లిష్ టెస్టు..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండు సార్లు ఫైనల్కి చేరినా టీమ్ఇండియా విజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు 2023-25 చక్రంలో విజేతగా నిలవాలంటే భారత్ శక్తికి మించి కష్టపడాల్సిందే. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకూ మూడు టెస్టులాడిన భారత్.. ఒక్కో మ్యాచ్లో విజయం, ఓటమి, డ్రా నమోదు చేసింది. ప్రస్తుతం 38.89 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే అయిదు టెస్టుల సిరీస్ టీమ్ఇండియాకు అత్యంత కీలకమైంది. ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేసినా, భారీ తేడాతో సొంతం చేసుకున్నా డబ్ల్యూటీసీలో భారత్కు కలిసొస్తుంది. కానీ అదంత సులువు కాదు. ఎందుకంటే టెస్టుల్లో బజ్బాల్ ఆటతీరుతో ఇంగ్లాండ్ దూకుడు ప్రదర్శిస్తోంది. కొన్ని సార్లు ఓటములు ఎదురైనా తగ్గేదే లేదంటూ ఆ జట్టు సాగుతోంది. భారత్తో టెస్టు సిరీస్లోనూ ఇదే ఆటతీరు ప్రదర్శిస్తామని కూడా ఆ జట్టు ఆటగాళ్లు చెబుతున్నారు. స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేకపోయినా.. ఇంగ్లాండ్తో సిరీస్లో మరీ అతివిశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.
నిరీక్షణ ముగిస్తారా..
ఐసీసీ ట్రోఫీ కోసం టీమ్ఇండియా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్లో గెలిచేలా కనిపించిన భారత్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత టీమ్ఇండియా మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అదే వన్డే ప్రపంచకప్ అయితే 2011లో గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్ చూసుకుంటే 2007 ఆరంభ సీజన్ తర్వాత మరోసారి విజేతగా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచకప్ అందుకునేందుకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో టీమ్ఇండియాకు అవకాశం వచ్చింది. జూన్లో అమెరికా- వెస్టిండీస్లో ఈ పొట్టి కప్పు జరుగుతుంది. అయితే తీవ్రమైన పోటీని తట్టుకుని, అగ్రశ్రేణి జట్లను ఓడిస్తేనే భారత్కు గెలిచే అవకాశాలుంటాయి.
ఈ సారి టోర్నీలో 20 జట్లు పోటీపడబోతున్నాయి. మరి ఈ కప్పు దిశగా ఇప్పటికే యువ జట్టును నిర్మించే ప్రయత్నాల్లో బీసీసీఐ నిమగ్నమైంది. జట్టులోకి యువ రక్తాన్ని ఎక్కిస్తోంది. అయితే ఈ ప్రపంచకప్లో జట్టు కెప్టెన్ ఎవరనేది కూడా సస్పెన్స్గా మారింది. హార్దిక్ కెప్టెన్గా కొనసాగే అవకాశముందని అనుకుంటే, తాజాగా రోహిత్ ఈ కప్పులో జట్టును నడిపించాలని బీసీసీఐ కోరిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు కెప్టెన్గా ఉంటారో చూడాలి. ఇక అక్టోబర్లో స్వదేశంలో కివీస్తో మూడు టెస్టుల సిరీస్ కూడా భారత్కు సవాలు విసిరేదే. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటన కూడా భారత్కు కఠినమైన పరీక్షగా నిలిచే అవకాశముంది. ఈ సవాళ్లను దాటి భారత్ జైత్రయాత్ర సాగించాలన్నదే అభిమానుల కోరిక.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!