Bhuvneswar Kumar : బక్కోడే కానీ.. గట్టోడు.. ఈ భువనేశ్వరుడు
బక్కపాటి శరీరం.. పొడగరి కూడా కాదు.. కేవలం మీడియం పేసర్.. బంతి మహా అయితే 130 కి.మీ నుంచి 135 కి.మీ వేగంతో మాత్రమే దూసుకొస్తుంది. అయితేనేం బ్యాటర్ను...
అరుదైన రికార్డు సాధించిన స్వింగ్ కింగ్..
ఇంటర్నెట్ డెస్క్: బక్కపల్చని శరీర ఆకారం.. పెద్ద పొడగరి కూడా కాదు.. కేవలం మీడియం పేసర్.. బంతి మహా అయితే 130 కి.మీ నుంచి 135 కి.మీ వేగంతో మాత్రమే దూసుకొస్తుంది. అయితేనేం బ్యాటర్ను తికమక పెట్టించగలిగే నేర్పరి.. ఆరంభ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీయగల సమర్థుడు. అంతర్జాతీయ టీ20ల్లో పవర్ప్లే ఓవర్లలో 502 డాట్బాల్స్ వేసిన తొలి బౌలర్. ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనేగా మీ డౌటు.. అదేనండి టీమ్ఇండియా సీనియర్ బౌలర్, స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ప్రత్యేకతలు ఇవి.. తొలి ఓవర్లలోనే టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (14) తీసిన బౌలర్గా రికార్డు సృష్టించిన భువీ గురించి ప్రత్యేక కథనం..
డేంజరస్ బ్యాటర్లకే చుక్కలు
డేంజరస్ బ్యాటర్ క్రీజ్లో ఉంటే ఎంతటి బౌలరైనా కాసింత ఆందోళనగానే ఉంటాడు. అయితే అవేవీ తన మొహంలో కనిపించనీయకుండా తనదైన శైలిలో వికెట్లే లక్ష్యంగా బంతులను సంధించే భువనేశ్వర్ కుమార్ ఇంగ్లాండ్తో జరుగుతోన్న టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారీ హిట్టర్లు కలిగిన ఇంగ్లాండ్ను కట్టడి చేయడమంటే ఆషామాషీ కాదు. మరోవైపు భారత టీ20 లీగ్లో అత్యధిక పరుగుల వీరుడు, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ భీకర ఫామ్లో ఉన్నాడు. అలాంటి బట్లర్ను రెండు మ్యాచుల్లోనూ భువీనే పెవిలియన్కు చేర్చడం విశేషం. తన తొలి ఓవర్లోనే ఓపెనర్లలో ఎవరో ఒకరిని ఔట్ చేయడం భువీ స్టైల్. తొలి టీ20 మ్యాచ్లో జోస్ బట్లర్ (0), రెండో మ్యాచ్లో జాసన్ రాయ్ (0)ను పెవిలియన్కు చేర్చాడు. వీరిద్దరూ భువనేశ్వర్ బౌలింగ్లో తమ తొలి బంతికే ఔట్ కావడం గమనార్హం. ఇలా మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ 14 సార్లు వికెట్ తీశాడు. ఇప్పటికే టెస్టు దేశాల ఆటగాళ్లలో భువీనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఇంకో మూడు వికెట్లు పడగొడితే.. ఐసీసీ అనుబంధ దేశమైన ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ (16)ను దాటేస్తాడు. భువీ తర్వాత డేవిడ్ విల్లే (13), మ్యాథ్యూస్ (11), టిమ్ సౌథీ (9), డేల్ స్టెయిన్ (9) ఉన్నారు.
వారి నుంచి తీవ్ర పోటీ..?
టీమ్ఇండియాలో బౌలర్లకు కొదవేం లేదు. ఒకప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్లను రూపొందించేలా చేసిన బీసీసీఐ.. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. స్వదేశంలో ఎక్కువగా స్పిన్ పిచ్ల మీద ఆడి సత్ఫలితాలను రాబడుతున్నప్పటికీ.. విదేశాల్లో తేలిపోతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జహీర్ ఖాన్, నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, ఆర్పీ సింగ్, శ్రీశాంత్ తదితరులు భారత ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని నడిపించారు. వీరి తర్వాత మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, బుమ్రా.. ఇదే విధంగా కుర్రాళ్లు హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, నవ్దీప్ సైని, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్ తదితరులు సుస్థిర స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరందరిలోకి భువీ ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి పిచ్మీదైనా స్వింగ్ రాబట్టగలడు. ఇక అదే స్వింగ్కు అనుకూలిస్తే మాత్రం రెచ్చిపోతాడు. 2014లో టీమ్ఇండియా జట్టులోకి వచ్చిన భువీకి ఇప్పుడు ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం సీనియర్లతోపాటు జూనియర్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్పై అతడి ప్రదర్శన చూస్తుంటే ప్రపంచకప్లో చోటు సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసే అవకాశం..!
ప్రస్తుత సంవత్సరంలో అదరగొట్టేస్తున్న భువనేశ్వర్ గతేడాది మాత్రం పెద్దగా రాణించలేదు. 12 మ్యాచులకు గాను కేవలం 12 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్లో అయితే కేవలం ఒకే మ్యాచ్ ఆడిన భువీ వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడు ఓవర్లు వేసి 25 పరుగులను సమర్పించాడు. స్వదేశంలో విండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై జరిగిన సిరీసుల్లో మరోసారి తన స్వింగ్ను రాబట్టి వికెట్లను కుప్పకూల్చాడు. ఈ మూడు టీమ్లపై ఎనిమిది మ్యాచ్లకుగాను 11 వికెట్లు తీశాడు. ఇక ఐర్లాండ్పైనా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వారి పిచ్లపై రెండు మ్యాచుల్లో 2 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అక్కడ నుంచి నేరుగా ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. తొలి టీ20లో కేవలం పది పరుగులే ఇచ్చి బట్లర్ వికెట్ తీశాడు. ఇక రెండో మ్యాచ్లో జేసన్ రాయ్, బట్లర్ తోపాటు రిచర్డ్ గ్లీసన్ వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన భువనేశ్వర్ 17 వికెట్లు తీసి భళా అనిపించాడు. ఇదే ఫామ్ కొనసాగితే ఒకే ఏడాదిలో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే టీ20 ప్రపంచకప్ పోటీలకు ముందు భారత్ కనీసం ఇంకో 15కిపైగా టీ20లను ఆడే అవకాశం ఉంది. కాబట్టి ఘనతను సాధించడం భువీకి కష్టం కాకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM