Team India: రికార్డులైనా.. ఆటైనా... టీమ్ఇండియా తగ్గేదేలే
అంతర్జాతీయ క్రికెట్లో ఆటైనా.. రికార్డులైనా భారత్ దిగనంతవరకే.. ఒక్కసారి టీమ్ఇండియా అడుగుపెట్టిందంటే చరిత్ర మన సొంతం కావాల్సిందే. ఇప్పుడు భారత జట్టు నిలకడగా రాణిస్తూ.. అద్భుత విజయాలు సాధిస్తూ.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తోంది. ప్రపంచకప్లో రోహిత్ సేన జోరే అందుకు నిదర్శనం. ఒకప్పుడు వెస్టిండీస్లా, ఆ తర్వాత ఆస్ట్రేలియాలా ఇప్పుడు భారత్ సాగుతోంది. ఆ రికార్డుల లెక్కేంటో చూద్దామా!
అప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లి
వన్డేలు, టెస్టులు.. ఇలా రెండు ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్కు తిరుగులేకుండా ఉండేది. అసాధారణ ప్రదర్శనతో, అసామాన్య ప్రతిభతో ప్రపంచ క్రికెట్ను అతను ఏలాడు. కానీ సచిన్ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో మన ఆధిపత్యం కొనసాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ పరుగుల రారాజు కోహ్లి వచ్చాడు. సచిన్ వారసత్వాన్ని నిలబెడుతూ.. అద్వితీయమైన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్నాడు. తాజాగా వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో నంబర్వన్గా ఉన్న సచిన్ (49)ను కోహ్లి సమం చేశాడు. శతాబ్దాల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో ఇన్ని సెంచరీలు చేసిన ఇద్దరు బ్యాటర్లు భారత్కు చెందినవాళ్లే అంటేనే మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తోంది. మూడో సాౖనంలోనూ మన ఆటగాడే రోహిత్ శర్మ (31) ఉన్నాడు.
ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో వార్నర్ (22), డికాక్ (21) మాత్రమే 20 కంటే ఎక్కువ శతకాలు చేశారు. దీన్ని బట్టి భారత ఆటగాళ్లకు మిగతా దేశాల క్రికెటర్లు ఎంత దూరంలో ఉన్నారో అరౖమవుతోంది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మన దిగ్గజం సచినే. 463 మ్యాచ్ల్లో అతను 18,426 పరుగులు చేశాడు. కోహ్లి (13626), సౌరభ్ గంగూలీ (11221), రాహుల్ ద్రవిడ్ (10768), ధోని (10599), రోహిత్ శర్మ (10554).. ఇలా ఆరుగురు భారత ఆటగాళ్లు 10 వేలకు పైగా పరుగులు చేశారు. మరే దేశ ఆటగాళ్లు కూడా ఇంత మంది 10వేల కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఇప్పుడు ఆటలో కొనసాగుతున్న వాళ్లలో కోహ్లి, రోహిత్ మాత్రమే 10 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్లు. మూడో స్థానంలో ముష్ఫికర్ రహీమ్ (7577) ఎంతో దూరంలో ఉన్నాడు.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మన రోహిత్ (264)దే. అత్యధిక డబుల్ సెంచరీ (3)లూ అతనివే. రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, సచిన్ తెందుల్కర్.. ఇలా వన్డేల్లో ద్విశతక వీరుల్లోనూ మనదే ఆధిపత్యం. వన్డేల్లో 200కు పైగా పరుగులు చేసిన మిగతా విదేశీ ఆటగాళ్లు గప్తిల్ (న్యూజిలాండ్), గేల్ (వెస్టిండీస్), ఫకర్ జమాన్ (పాకిస్తాన్) మాత్రమే. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డూ రోహిత్ (314) పేరు మీదే ఉంది. ఓ క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది సచిన్ (1,894). ఇందులో తొలి నాలుగు సాౖనాలూ మనవే. అత్యధిక సార్లు ఓ క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడు కోహ్లి (8). ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేని రికార్డులు మన ఆధిపత్యానికి నిదర్శనం.
మూడోసారి గెలిచేస్తే..
1975 ప్రుడెన్షియల్ ట్రోఫీ (ఇంగ్లాండ్లో భారత పర్యటన)తో మొదలైన భారత వన్డే ప్రయాణం ఇప్పుడు ఘనంగా సాగుతోంది. సుమారు 5 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. రెండు సార్లు ప్రపంచకప్ (1983, 2011)ను ముద్దాడింది. ఇప్పుడు మూడోసారి వన్డే విశ్వవిజేతగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది. ‘‘ఛాంపియన్ కావాలంటే పెద్ద విజయాలు సాధించాలి. మనది అత్యుత్తమ జట్టు అని, మిగతా జట్లు అందుకోలేనంత దూరంలో ఉందని చాటాలి. ఇప్పుడు టీమ్ఇండియా అదే చేస్తోంది’’ అని తాజాగా దిగ్గజ క్రికెటర్ గావస్కర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో భారత ఆధిపత్యం చూస్తే అది నిజమనక తప్పదు. ఆడిన 8 మ్యాచ్ల్లోనూ రోహిత్ సేన గెలిచింది. ప్రపంచకప్ విషయానికి వస్తే అయిదు టైటిళ్లతో ఆస్ట్రేలియా నంబర్వన్ జట్టుగా ఉంది. వెస్టిండీస్, భారత్ చెరో రెండు టైటిళ్లతో ఉమ్మడిగా రెండో సాౖనంలో ఉన్నాయి. ఇప్పుడు మూడో ప్రపంచకప్తో ఆసీస్ తర్వాత అత్యధిక టైటిళ్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలవాలి. ఇదే దూకుడు కొనసాగించి ఆస్ట్రేలియాను దాటాలన్నదే అభిమానుల కోరిక.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం