IND vs SA: ముందుంది సఫారీ సవాల్.. ఈసారి జెండా పాతుతారా?
దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. అయితే, టెస్టు సిరీస్ను ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగబోతోంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇలా ఒక్కో విదేశీ గడ్డపై భారత క్రికెట్ జట్టు (Team India) జెండాలు ఎగరేస్తూ వచ్చింది. కానీ దక్షిణాఫ్రికాకి వచ్చేసరికే ఎందుకో ఒకింత తడబాటు. చేతికి అందినట్టే ఉంటది కానీ అందదు. మనోళ్లు గెలిచేస్తారా? అనిపిస్తారు చివరికి గెలవరు! 90ల్లో అయితే బలహీనమైన భారత జట్టు కదా అనుకోవచ్చు.. కానీ ఎంతో మెరుగుపడిన ప్రస్తుత టీమ్ఇండియా కూడా దక్షిణాఫ్రికాలో జెండా పాతలేకపోతోంది. మళ్లీ వచ్చింది సఫారీ సిరీస్! టెస్టుల్లో పోలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో కాస్త మెరుగైనా.. నంబర్వన్ జట్టుగా సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు టీ20లు, వన్డేల్లోనూ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి సంబరపడుతున్న యువ జట్టుకు సఫారీలతో (IND vs SA) టీ20లు, వన్డేల్లో కూడా పెనుసవాల్ ఎదురు కావడం ఖాయం.
ఎన్నో దండయాత్రలు
1992 నుంచి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం కోసం భారత్ చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉంది. ప్రతిసారి ఎన్నో ఆశలు, అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టడం ఆ తర్వాత చేదు అనుభవాలతో వెనుదిరగడం భారత్కు మామూలే. ఎందుకంటే ఇక్కడి పిచ్లు ఒకదానికి ఒకటి పొంతన ఉండవు. కఠినమైన డర్బన్ పిచ్లో ఆడడం అన్నిటికి మించి పెద్ద సవాల్. బౌన్స్, స్వింగ్ అవుతూ భారత బ్యాటర్ల సత్తాకు పరీక్ష పెడతాయి ఇక్కడి ట్రాక్లు. ముఖ్యంగా టెస్టుల్లో సఫారీ పేసర్ల విజృంభణ ముందు నిలవడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మెరుపులు మెరిపించినా.. టెస్టుల్లో మాత్రం భారత్ది ఎప్పుడూ వెనుకడుగే. 2006, 2010 పర్యటనల్లో ఒక్కో మ్యాచ్ గెలిచి సంబరపడిన భారత్.. 2018లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. కానీ సిరీస్ కలను నెరవేర్చుకోలేకపోయింది. 2022 సిరీస్లో పూర్తిగా తేలిపోయి రెండు టెస్టుల్లోనూ ఓడింది. మరోసారి టెస్టు సిరీస్ వేటకు వెళ్లోంది భారత్. అది కూడా గత రెండు సిరీస్లలో ఆడిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె లాంటి వాళ్లు లేకుండా మరి ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం.
దిగ్గజాలు చేయలేనిది
దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయం సచిన్ కల. అతడికి నెరవేరలేదు. గంగూలీ, ద్రవిడ్ లాంటివాళ్లకు కూడా సాధ్యం కాలేదు. విజయవంతమైన కెప్టెన్ ధోని వల్ల కూడా కాలేదు. కోహ్లికి కూడా సాధ్యపడలేదు. మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి రోహిత్ సేనకు చరిత్రను తిరగరాసే ఛాన్స్ వచ్చింది. కెరీర్ ఆఖర్లో ఉన్న రోహిత్, కోహ్లి లాంటి దిగ్గజాలకు సఫారీ గడ్డను జయిస్తే అంతకుమించిన సంతృప్తి మరొకటి ఉండదు. ప్రపంచకప్ ఓటమితో కుంగిన భారత్కు దక్షిణాఫ్రికాలో విజయం కచ్చితంగా పెద్ద బూస్టింగ్ అవుతుంది. కానీ ప్రణాళిక ప్రకారం ఆడకపోతే మునుపటి ఫలితాలు పునరావృతం కావడం ఖాయం. దక్షిణాఫ్రికాలో చాలా సిరీస్లు ఆడిన అనుభవం ఉన్న ద్రవిడ్ కోచింగ్ కూడా భారత్కు మేలు చేసేదే. ఇక్కడి పిచ్లపై బౌలింగ్లో టీమ్ఇండియా మరీ నిరాశపరచలేదు కానీ బ్యాటింగ్లో మాత్రం దాదాపు ప్రతిసారీ ఉసూరుమనించింది. ఈ విభాగంలో భారత్ సత్తా చాటకపోతే కష్టమే. దక్షిణాఫ్రికాలో పరిస్థితులను అంచనా వేసేందుకు ముందుగానే భారత-ఏ జట్టు తరఫున కొందరు సీనియర్ ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం కచ్చితంగా కలిసొచ్చే అంశమే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా