IND vs SA: ముందుంది సఫారీ సవాల్.. ఈసారి జెండా పాతుతారా?
దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. అయితే, టెస్టు సిరీస్ను ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగబోతోంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఇలా ఒక్కో విదేశీ గడ్డపై భారత క్రికెట్ జట్టు (Team India) జెండాలు ఎగరేస్తూ వచ్చింది. కానీ దక్షిణాఫ్రికాకి వచ్చేసరికే ఎందుకో ఒకింత తడబాటు. చేతికి అందినట్టే ఉంటది కానీ అందదు. మనోళ్లు గెలిచేస్తారా? అనిపిస్తారు చివరికి గెలవరు! 90ల్లో అయితే బలహీనమైన భారత జట్టు కదా అనుకోవచ్చు.. కానీ ఎంతో మెరుగుపడిన ప్రస్తుత టీమ్ఇండియా కూడా దక్షిణాఫ్రికాలో జెండా పాతలేకపోతోంది. మళ్లీ వచ్చింది సఫారీ సిరీస్! టెస్టుల్లో పోలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో కాస్త మెరుగైనా.. నంబర్వన్ జట్టుగా సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు టీ20లు, వన్డేల్లోనూ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి సంబరపడుతున్న యువ జట్టుకు సఫారీలతో (IND vs SA) టీ20లు, వన్డేల్లో కూడా పెనుసవాల్ ఎదురు కావడం ఖాయం.
ఎన్నో దండయాత్రలు
1992 నుంచి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం కోసం భారత్ చకోర పక్షిలా ఎదురు చూస్తూనే ఉంది. ప్రతిసారి ఎన్నో ఆశలు, అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టడం ఆ తర్వాత చేదు అనుభవాలతో వెనుదిరగడం భారత్కు మామూలే. ఎందుకంటే ఇక్కడి పిచ్లు ఒకదానికి ఒకటి పొంతన ఉండవు. కఠినమైన డర్బన్ పిచ్లో ఆడడం అన్నిటికి మించి పెద్ద సవాల్. బౌన్స్, స్వింగ్ అవుతూ భారత బ్యాటర్ల సత్తాకు పరీక్ష పెడతాయి ఇక్కడి ట్రాక్లు. ముఖ్యంగా టెస్టుల్లో సఫారీ పేసర్ల విజృంభణ ముందు నిలవడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్ని మెరుపులు మెరిపించినా.. టెస్టుల్లో మాత్రం భారత్ది ఎప్పుడూ వెనుకడుగే. 2006, 2010 పర్యటనల్లో ఒక్కో మ్యాచ్ గెలిచి సంబరపడిన భారత్.. 2018లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. కానీ సిరీస్ కలను నెరవేర్చుకోలేకపోయింది. 2022 సిరీస్లో పూర్తిగా తేలిపోయి రెండు టెస్టుల్లోనూ ఓడింది. మరోసారి టెస్టు సిరీస్ వేటకు వెళ్లోంది భారత్. అది కూడా గత రెండు సిరీస్లలో ఆడిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె లాంటి వాళ్లు లేకుండా మరి ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం.
దిగ్గజాలు చేయలేనిది
దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయం సచిన్ కల. అతడికి నెరవేరలేదు. గంగూలీ, ద్రవిడ్ లాంటివాళ్లకు కూడా సాధ్యం కాలేదు. విజయవంతమైన కెప్టెన్ ధోని వల్ల కూడా కాలేదు. కోహ్లికి కూడా సాధ్యపడలేదు. మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి రోహిత్ సేనకు చరిత్రను తిరగరాసే ఛాన్స్ వచ్చింది. కెరీర్ ఆఖర్లో ఉన్న రోహిత్, కోహ్లి లాంటి దిగ్గజాలకు సఫారీ గడ్డను జయిస్తే అంతకుమించిన సంతృప్తి మరొకటి ఉండదు. ప్రపంచకప్ ఓటమితో కుంగిన భారత్కు దక్షిణాఫ్రికాలో విజయం కచ్చితంగా పెద్ద బూస్టింగ్ అవుతుంది. కానీ ప్రణాళిక ప్రకారం ఆడకపోతే మునుపటి ఫలితాలు పునరావృతం కావడం ఖాయం. దక్షిణాఫ్రికాలో చాలా సిరీస్లు ఆడిన అనుభవం ఉన్న ద్రవిడ్ కోచింగ్ కూడా భారత్కు మేలు చేసేదే. ఇక్కడి పిచ్లపై బౌలింగ్లో టీమ్ఇండియా మరీ నిరాశపరచలేదు కానీ బ్యాటింగ్లో మాత్రం దాదాపు ప్రతిసారీ ఉసూరుమనించింది. ఈ విభాగంలో భారత్ సత్తా చాటకపోతే కష్టమే. దక్షిణాఫ్రికాలో పరిస్థితులను అంచనా వేసేందుకు ముందుగానే భారత-ఏ జట్టు తరఫున కొందరు సీనియర్ ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం కచ్చితంగా కలిసొచ్చే అంశమే.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్