IND vs NZ: బెక్హామ్తో మాటామంతీ.. జెర్సీలు ఇచ్చిపుచ్చుకొన్న దిగ్గజాలు.. హార్దిక్ స్టైల్ అదుర్స్.. స్పెషల్ వీడియోలు!
టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో కివీస్పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విన్నింగ్ మూమెంట్స్ అలరించాయి.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) సెమీస్లో న్యూజిలాండ్ను ఓడించి టీమ్ఇండియా ఫైనల్కు చేరింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో భారీగా వచ్చిన అభిమానుల మధ్య భారత్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీడియోలను ఐసీసీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
జెర్సీలు మార్చుకుంటూ..
వరల్డ్ కప్ తొలి సెమీస్కు ఇద్దరు దిగ్గజ క్రీడా ప్రముఖలు ముఖ్య అతిథులుగా హాజరయ్యరు. టీమ్ఇండియా క్రికెట్ గాడ్ సచిన్తో కలిసి ఇంగ్లాండ్ ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ సందడి చేశారు.
విరాట్ సెంచరీ.. సచిన్ ఫిదా
విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో తన 49 సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్ను సచిన్ అభినందించాడు. అలాగే కోహ్లీకి అనుష్క ప్లయింగ్ కిస్లు ఇచ్చింది.
పాండ్య స్టైల్ అదుర్స్..
గాయం కారణంగా వరల్డ్ కప్ మధ్యలోనే వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తొలి సెమీస్ సందర్భంగా వాంఖడే మైదానానికి వచ్చాడు. ఈ సందర్భంగా కొబ్బరి బోండాం నీళ్లను ఆస్వాదిస్తూ కనిపించాడు.
బెక్హామ్తో మాటామంతీ.. ఫుట్బాల్
భారత ఆటగాళ్లంతా బెక్హామ్ను పరిచయం చేసుకుని సరదాగా సంభాషించారు. అలాగే బెక్హామ్తో ఫుట్బాల్ కూడా ఆడారు. ఈ సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేశాయి.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షమీ
న్యూజిలాండ్పై ఏడు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడి బౌలింగ్ ప్రదర్శనను మరోసారి చూసేద్దాం..
12 ఏళ్ల నిరీక్షణకు తెర
దాదాపు పన్నెండేళ్ల తర్వాత భారత్ ఫైనల్కు చేరుకుంది. 2011లో చివరిసారిగా టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది. అప్పుడే రెండోసారి మనం ఛాంపియన్గా నిలిచాం. గత వరల్డ్ కప్ల్లో (2015, 2019) సెమీస్లోనే ఓటమిపాలయ్యాం. ఇప్పుడా గండాన్ని అలవోకగా దాటేశాం.
ఇవి కదా సేఫ్ హ్యాండ్స్..
దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద రవీంద్ర జడేజా ఒడిసిపట్టిన తీరు అద్భుతం. బుమ్రా బౌలింగ్లో ఫిలిప్స్ భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. దీంతో మ్యాచ్ టీమ్ఇండియా వైపు మొగ్గు చూపింది.
క్రీడాస్ఫూర్తికి నిదర్శనం
న్యూజిలాండ్ సెంచరీ హీరో డారిల్ మిచెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మ్యాచ్ మధ్యలో కండరాలు పట్టేయడంతో మైదానంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే భారత ఆటగాడు ఇషాన్ కిషన్ డారిల్కు సాయపడ్డాడు. ఇషాన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. దీంతో క్రీడా స్ఫూర్తి ఇదేనంటూ అభిమానులు ప్రశంసించారు.
విరాట్ గురించి వివ్ రిచర్డ్స్
విరాట్ కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్పై క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ హర్షం వ్యక్తం చేశాడు. తానెందుకు విరాట్ను అభిమానిస్తానేది చక్కగా వివరించాడు.
విన్నింగ్ మూవ్మెంట్
న్యూజిలాండ్ చివరి వికెట్ను షమీ తీయడంతో భారత్ ఫైనల్కు చేరుకుంది. దీంతో మూడోసారి విశ్వవిజేతగా నిలవడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆఖరి వికెట్ తీసిన తర్వాత భారత క్రికెటర్లు, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్