INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు..
నేడే ఇంగ్లాండ్తో తొలి టీ20
రాత్రి 7 నుంచి
ముంబయి : భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. బంగ్లాదేశ్పై 2-1తో సిరీస్ సాధించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఫైనల్ చేరింది. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్పై భారత్కు గొప్ప రికార్డేం లేదు. తొమ్మిది మ్యాచ్ల్లో రెండే గెలిచింది. చివరిగా 2018లో ఆ జట్టుపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలను మెరుగుపరుచుకోవాలని హర్మన్ప్రీత్ బృందం భావిస్తోంది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్తో పాటు హర్మన్ప్రీత్ తప్పక రాణించాల్సి ఉంది. ఇటీవల మహిళల బిగ్బాష్ లీగ్లో హర్మన్ప్రీత్ 14 మ్యాచ్ల్లో 321 పరుగులు చేసింది. మరోవైపు సొంతగడ్డపై శ్రీలంక చేతిలో 1-2తో ఓడిన ఇంగ్లాండ్.. భారత్పై సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ హెథర్ నైట్, నాట్ సీవర్, ఎకిల్స్టోన్ రాణించడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
భారత్లో ఆడడం పెద్ద పరీక్షే... నైట్: భారత పిచ్లపై ఆడడం పెద్ద పరీక్ష అని ఇంగ్లాండ్ కెప్టెన్ హెథర్ నైట్ చెప్పింది. ‘‘భారత పరిస్థితుల్లో ఆడి ఆటను చాలా మెరుగుపరుచుకున్నా. ఏ క్రికెటర్కైనా ఇక్కడ పిచ్లపై ఆడడం పెద్ద సవాల్. భారత్లో వేడి, ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొంటూ మన నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది’’ అని నైట్ తెలిపింది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అలాంటి పిచ్లే పోలి ఉన్న భారత్లో ఆడడం మేలు చేస్తుందని నైట్ చెప్పింది. ‘‘ఆటను మెరుగుపరుచుకోవడానికి భారత్ సరైన వేదిక. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్ వేదిక బంగ్లాదేశ్లో పిచ్ల మాదిరే ఇక్కడి పిచ్లు కూడా ఉంటాయి’’ అని నైట్ తెలిపింది. సొంతగడ్డపై భారత్ను ఓడించడం అంత తేలికేం కాదని తెలిపింది.
భారత్ నిర్భయంగా ఆడాలి: మజుందార్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు నిర్భయంగా ఆడాలని చీఫ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరు బుధవారం వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ‘‘ఎప్పట్లాగే భారత్ తనదైన శైలిలో ఆడాలి. భయం లేకుండా ఆడటాన్నే సమర్థిస్తా. అలాంటి క్రికెటే ఆడతాం. ఈ విషయంలో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ చాలా కీలకం. వాళ్ల దూకుడు ఆట కొనసాగించాలనే కోరుకుంటున్నా’’ అని మజుందార్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు