Cricket Records : RRR.. సరసన చేరేదెవరు?
వీరోచిత ఇన్నింగ్స్లకు మారు పేరైన వీరేంద్ర సెహ్వాగ్...ధనాదన్ బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించే ఎంఎస్ ధోనీ...దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై
ఐర్లాండ్పై దీపక్ హుడా శతకం.. అయినా ఆ జాబితాలో లేడు
వీరోచిత ఇన్నింగ్స్లకు మారు పేరైన వీరేంద్ర సెహ్వాగ్... ధనాదన్ బ్యాటింగ్తో మ్యాచ్ను ముగించే ఎంఎస్ ధోనీ... దూకుడైన ఆటతో ప్రత్యర్థులపై విరుచుకుపడే విరాట్ కోహ్లీ.. వీరెవ్వరికి సాధ్యం కాని ఘనతను ‘RRR’ ఆటగాళ్లు సాధించారు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన త్రయమే.. రైనా, రోహిత్, రాహుల్.
ఎనిమిదేళ్లు అయినా..
ఎప్పుడో 2016లో వెస్టిండీస్పై టీ20 మ్యాచ్లో సెంచరీ చేసి రాహుల్... టీమ్ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో శతకం నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ మరే భారత ఆటగాడు వీరి సరసన చేరలేకపోయాడు. తాజాగా ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో దీపక్ హుడా శతక్కొట్టి ఈ ఫార్మాట్లో సెంచరీ చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. అయితే మూడు ఫార్మాట్లో శతకం బాదిన ప్లేయర్ల జాబితాలో ఇంకా ఆ ముగ్గురి పేర్లే కనిపిస్తున్నాయి.
నాలుగో ప్లేయర్గా నిలిచేదెవరూ..?
భారత్ తరఫున ఈ ఘనతను అందుకొన్న తొలి క్రికెటర్ సురేశ్ రైనా. తర్వాత రోహిత్, కేఎల్ రాహుల్ సాధించారు. అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో సెంచరీ ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. వన్డే, టెస్టుల్లో 70కు పైగా శతకాలు బాదిన విరాట్... భారత టీ20 లీగ్లో 5 సెంచరీలు కొట్టాడు. అయితే టీమ్ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకూ శతకం కొట్టలేదు. రెండున్నరేళ్లుగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేదు. అతడు మళ్లీ ఫామ్లోకి వస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ సరసన చేరడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక శిఖర్ ధావన్ సైతం అంతే.. వన్డే, టెస్టులతో పాటు భారత టీ20 లీగ్లో శతకం కొట్టినా టీమ్ఇండియా తరఫున పొట్టి ఫార్మాట్లో సాధించలేదు. అతడు జట్టులో చోటు కూడా కోల్పోయాడు. ఇక పంత్, శ్రేయస్ కూడా పొట్టి ఫార్మాట్లో శతకం కొట్టగల ప్రతిభావంతులే. అయితే రోహిత్, రాహుల్ ఇప్పుడు మూడు ఫార్మాట్లో ఆడగల ఓపెనర్లు.. ఇలాంటి ప్లేయర్లు టీమ్ఇండియాలో ప్రస్తుతం ఎవరూ లేరు. కాబట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ సరసన చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
సెంచరీలు ఇలా..
* పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన మొదటి బ్యాటర్ - క్రిస్ గేల్ (వెస్టిండీస్) (2007లో)
* మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ - హీథర్ నైట్ (ఇంగ్లాండ్) (2020లో)
* ఇప్పటివరకు పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో 19 మంది మాత్రమే మూడు ఫార్మాట్లో శతకం కొట్టారు. వీరిలో చివరి ఆటగాడు డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్). ఈ ఏడాది నెదర్లాండ్స్తో జరిగిన వన్డే మ్యాచ్లో శతకం చేయడం ద్వారా అతడు ఈ జాబితాలో చేరాడు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ