IPL 2023: వారికి పీడకలలు.. తారుమారైన టీమ్ల ఫలితాలు!
ఐపీఎల్ మ్యాచ్లు (IPL 2023) రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్ స్థానాల కోసం టాప్ జట్లు రేసులో ముందువరుసలో ఉన్నాయి. అయితే, కొంతమంది ఆటగాళ్లకు మాత్రం మింగుడుపడని అనుభవాలు ఎదురయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) సీజన్ సగానికిపైగా ముగిసింది. ఎనిమిది జట్లు ఏడేసి మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. ఆర్సీబీ, కోల్కతా మాత్రమే ఎనిమిది మ్యాచ్లను పూర్తి చేసుకున్నాయి. ఎక్కువ భాగం మ్యాచ్లు చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగాయి. భారీ స్కోర్లు నమోదైనప్పటికీ విజయం సాధించేందుకు చివరి వరకూ పోరాటం చేసిన జట్లు కొన్ని ఉండగా.. కేవలం ఒక్క ఓవర్లోనే ఫలితం తారుమారై ఓటమి పాలైన మ్యాచ్లూ అభిమానులను అలరించాయి. అయితే కొందరు ఆటగాళ్లకు, జట్లకు మాత్రం కొన్ని చేదుగుళికలు అనిపించిన సందర్భాలూ ఉన్నాయి. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..
వర్షంతో ఆరంభం..
నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్కతాకు తొలి మ్యాచ్లోనే వరుణుడు అడ్డంకిగా మారాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా డక్వర్త్లూయిస్ పద్ధతిన ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత పంజాబ్ 191/5 స్కోరు చేయగా.. కోల్కతా 146/7 (16 ఓవర్లు) స్కోరు వద్ద ఉన్నప్పుడు వర్షం పడటంతో మ్యాచ్ను ఆపేశారు. అప్పటికి కోల్కతా ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే.. మంచి ఫామ్లో ఉన్న శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ లక్ష్య ఛేదన పూర్తి చేసే అవకాశం ఉంది. వర్షం రావడంతో కోల్కతా విజయావకాశాలు ముగిశాయి.
217 పరుగుల భారీ ఛేదనలో..
చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్లో 217/7 భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో లఖ్నవూ కూడా ధాటిగా ప్రారంభించింది. పవర్ప్లేలో 80 పరుగులు చేసి టార్గెన్ను కాస్త తేలిక చేసుకుంది. దీపక్ చాహర్ (0/55), తుషార్ దేశ్పాండే (2/45) భారీగా పరుగులు సమర్పించారు. అయితే, మొయిన్ అలీతోపాటు (4/26) మిచెల్ సాంట్నర్ (1/21) కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో లఖ్నవూ 205/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో 12 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. చివరి వరకూ హడలెత్తించిన లఖ్నవూ కీలక సమయంలో పరుగులు సాధించలేక ఓడింది.
రాజస్థాన్ను ఓడించిన పడిక్కల్
గతేడాది ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత పంజాబ్ 197/4 స్కోరు చేస్తే రాజస్థాన్ 192/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ ఓడించిందని కాకుండా.. రాజస్థాన్ బ్యాటర్ దేవదుత్ పడిక్కల్ (26 బంతుల్లో 21 పరుగులు) ఓడించాడంటే బాగుంటుందేమో. మిగతా బ్యాటర్లంతా దూకుడుగా ఆడుతుంటే పడిక్కల్ మాత్రం విలువైన బంతులను వృథా చేసి లక్ష్య ఛేదన రన్రేట్ పెరిగేలా చేశాడు. ఆఖర్లో జురెల్ (32 పరుగులు: 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మెయర్ (36 పరుగులు: 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది.
యశ్ దయాల్ మరిచిపోలేని మ్యాచ్..
తన ఐపీఎల్ కెరీర్లో యశ్ దయాల్కు మరిచిపోలేని మ్యాచ్. ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు సహా 31 పరుగులు సమర్పించి గుజరాత్ టైటాన్స్ ఓటమికి కారణమయ్యాడు. హార్దిక్ పాండ్య గైర్హాజరీలో రషీద్ ఖాన్ నడిపించిన గుజరాత్ జట్టు తొలుత 204/4 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో 18 ఓవర్లకు కోల్కతా 162/7 వద్ద ఉంది. చివరి 12 బంతుల్లో కోల్కతా విజయానికి 52 పరుగులు కావాలి. 19వ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ జాషువా లిటిల్ సిక్స్, ఫోర్ సహా 14 పరుగులు ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తొలి బంతికి యశ్ దయాల్ కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో చివరి 5 బంతుల్లో నాలుగు సిక్స్లు, ఒక ఫోర్ పడితేనే కోల్కతాకు విజయం సొంతమవుతుంది. ఆ సమయంలో రింకు సింగ్ (48*) అనూహ్యంగా వరుసగా ఐదు బంతుల్లోనూ సిక్స్లు కొట్టి కోల్కతాను గెలిపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ లేకుండా 69 పరుగులు సమర్పించడం గమనార్హం. ఇదే మ్యాచ్లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించినా.. యశ్ దెబ్బకు గుజరాత్ ఓడిపోవాల్సి వచ్చింది.
డీకే రనౌట్ మిస్..
ప్రస్తుత సీజన్లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్గా లఖ్నవూ - బెంగళూరు జట్ల మధ్య జరిగిన పోరు నిలుస్తుందనడంలో సందేహం లేదు. కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్వెల్ హాఫ్ సెంచరీలతో బెంగళూరు 212/2 స్కోరు చేసింది. అనంతరం లఖ్నవూ టాప్ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మార్నస్ స్టొయినిస్ (65), నికోలస్ పూరన్ (62), ఆయుష్ బదోని (30) వీరబాదుడు బాదేయడంతో లఖ్నవూ రేసులోకి వచ్చింది. 19 ఓవర్లకు 208/7 స్కోరుతో లఖ్నవూ నిలవడంతో ఉత్కంఠ రేగింది. అనుకున్నట్లుగానే హర్షల్ పటేల్ బౌలింగ్లో రెండు వికెట్లు తీసి బెంగళూరుకు ఊపిరి పోశాడు. ఐదు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. ఆ ఒక్కటి కొట్టకపోతే తొలి సూపర్ ఓవర్ను చూసే అవకాశం వచ్చేది. అయితే, హర్షల్ అద్భుతమైన బంతిని సంధించినా.. వికెట్ కీపర్ బంతిని పట్టుకొని రనౌట్ చేయడంలో విఫలం కావడం.. అవేశ్ ఖాన్ పరుగు పూర్తి చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో సరిగ్గా 20 ఓవర్లలో 213/9 స్కోరు చేసి లఖ్నవూ సంచలన విజయం నమోదు చేసింది.
దిల్లీకి గెలుపు చేజారిందిలా..
వరుసగా ఓటములతో కొనసాగుతున్న దిల్లీ, ముంబయి జట్ల మధ్య ఉత్కంఠ పోరుకు 16 మ్యాచ్ వేదికైంది. ఇరు జట్లూ చివరి వరకూ పోరాడినా విజయం మాత్రం ముంబయికే సొంతమైంది. తొలుత దిల్లీ 172 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ముంబయి ఇండియన్స్ దూకుడుగా లక్ష్య ఛేదనను ప్రారంభించింది. తొలి వికెట్కు ఇషాన్ తో కలిసి రోహిత్ 71 పరుగులు రాబట్టాడు. తర్వాత ఇషాన్ ఔటైనప్పటికీ.. తిలక్ వర్మతో కలిసి మరో 68 పరుగులను జోడించారు. స్వల్ప వ్యవధిలో తిలక్తోపాటు సూర్య (0) పెవిలియన్ చేరారు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ముంబయి 139/3కి చేరింది. చివరి నాలుగు ఓవర్లలో 34 పరుగులు చేస్తే చాలు.. టీ20ల్లో పెద్ద సమస్యే కాదు. కానీ, దిల్లీ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి బంతికి ముంబయి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో దిల్లీ కెప్టెన్ విసిరిన త్రో సరైన దిశగా లేకపోవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరిగ్గా ముంబయి 20 ఓవర్లలో 174/4తో విజయం సాధించింది.
226 పరుగులైనా సరే..
ఐపీఎల్లో అత్యధిక అభిమానులను కలిగిన రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో చెప్పడానికి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల పోరు చాలు. సీఎస్కే 226/6 భారీ స్కోరు చేసినా.. ఏమాత్రం భయపడకుండా దీటుగా బదులిస్తూ ఆర్సీబీ బ్యాటింగ్ కొనసాగించింది. చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం. ఆల్రౌండర్లు హసరంగ, సుయాశ్ ప్రభుదేశాయ్ ఉండటంతో మరోసారి కేకేఆర్-జీటీ మ్యాచ్ ఫలితం పునరావృతం అవుతుందా అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే, సీఎస్కే యువ బౌలర్ పతిరాణ మాత్రం అద్భుతమైన బంతులను సంధించి వికెట్ తీసి కేవలం 10 పరుగులను మాత్రమే ఇచ్చాడు. దీంతో ఉత్కంఠపోరులో సీఎస్కే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అర్జున్ ఖాతాలో చెత్త రికార్డు..
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్.. కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే, తన రెండో మ్యాచ్లో మాత్రం తేలిపోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కేవలం మూడు ఓవర్ల స్పెల్లో ఏకంగా 48 పరుగులు సమర్పించాడు. ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, తర్వాత హైదరాబాద్, గుజరాత్ మీద జరిగిన మ్యాచ్ల్లో తన బౌలింగ్ సత్తాను చాటాడు.
టార్గెట్కు చేరువగా వచ్చి మరీ..
ఈ సీజన్లో హైదరాబాద్కు పెద్దగా కలిసిరాలేదు. సొంతమైదానంలో ముంబయి, దిల్లీ జట్లతో జరిగిన మ్యాచుల్లోనూ చివరి వరకు వచ్చి ఓటమిపాలైన తీరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిల్లీ క్యాపిటల్స్ను తక్కువ పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం హైదరాబాద్కు మిగల్లేదు. సన్రైజర్స్ బ్యాటర్లు ఆడారు. 145 పరుగుల స్వల్ప టార్గెట్ను కూడా ఛేదించడంలో విఫలమైంది. ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకు ముందు ముంబయితో జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ కీలక సమయంలో చేతులెత్తేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్