IND vs NZ: వీరూ.. నా బౌలింగ్లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్..ఒకానొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో దంచి కొట్టాడంట...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్.. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో దంచి కొట్టాడట. దాంతో బంతి మైదానం దాటి వెళ్లిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో అజాజ్ పది వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ అతడి ఘనతను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్ సైతం కివీస్ స్పిన్నర్ను మెచ్చుకున్నాడు. దానికి స్పందించిన అజాజ్.. వీరూతో తనకున్న ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.
‘ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టడం క్రికెట్లో అత్యంత కష్టమైన రికార్డు. అజాజ్ ఈరోజు.. నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు. ముంబయిలో పుట్టి.. ముంబయిలోనే చరిత్ర సృష్టించావు. ఈ చారిత్రక ప్రదర్శనకు అభినందనలు’ అని మెచ్చుకుంటూ సెహ్వాగ్ తొలుత ఓ ట్వీట్ చేశాడు. దీనికి బదులిచ్చిన అజాజ్.. వీరూకు ధన్యవాదాలు తెలుపుతూ.. ‘ఒకసారి ఓవల్లోని ఈడెన్ పార్క్ మైదానంలో నేను నెట్ బౌలర్గా ఉండగా మీరు నా బౌలింగ్లో బంతిని దంచికొట్టడం.. అది మైదానం దాటి వెళ్లడం నాకింకా గుర్తుంది’ అని అభిమానులతో పంచుకున్నాడు. అనంతరం సెహ్వాగ్ ప్రతి స్పందించాడు. ‘ముంబయిలో నువ్వు సాధించింది అత్యంత విశేషమైనది. అందువల్లే టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించడం కన్నా.. నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు మరింత విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా, భారత్ రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!