IND vs NZ: వీరూ.. నా బౌలింగ్లో దంచికొట్టడం ఇంకా గుర్తుంది: అజాజ్
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్..ఒకానొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో దంచి కొట్టాడంట...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్.. ఒకానొక సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో దంచి కొట్టాడట. దాంతో బంతి మైదానం దాటి వెళ్లిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో అజాజ్ పది వికెట్లు తీసి కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ అతడి ఘనతను కీర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్ సైతం కివీస్ స్పిన్నర్ను మెచ్చుకున్నాడు. దానికి స్పందించిన అజాజ్.. వీరూతో తనకున్న ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.
‘ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టడం క్రికెట్లో అత్యంత కష్టమైన రికార్డు. అజాజ్ ఈరోజు.. నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు. ముంబయిలో పుట్టి.. ముంబయిలోనే చరిత్ర సృష్టించావు. ఈ చారిత్రక ప్రదర్శనకు అభినందనలు’ అని మెచ్చుకుంటూ సెహ్వాగ్ తొలుత ఓ ట్వీట్ చేశాడు. దీనికి బదులిచ్చిన అజాజ్.. వీరూకు ధన్యవాదాలు తెలుపుతూ.. ‘ఒకసారి ఓవల్లోని ఈడెన్ పార్క్ మైదానంలో నేను నెట్ బౌలర్గా ఉండగా మీరు నా బౌలింగ్లో బంతిని దంచికొట్టడం.. అది మైదానం దాటి వెళ్లడం నాకింకా గుర్తుంది’ అని అభిమానులతో పంచుకున్నాడు. అనంతరం సెహ్వాగ్ ప్రతి స్పందించాడు. ‘ముంబయిలో నువ్వు సాధించింది అత్యంత విశేషమైనది. అందువల్లే టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించడం కన్నా.. నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు మరింత విజయవంతం అవ్వాలని మనసారా కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. కాగా, భారత్ రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?