Mithali Raj: థాంక్యూ క్వీన్ ఆఫ్ క్రికెట్... మిథాలీ
థాంక్యూ మిథాలీ.. నువ్వు భారత క్రికెట్లో ఆడినందుకు కాదు.. భారత మహిళల క్రికెట్కే వన్నె తెచ్చినందుకు.. థాంక్యూ మిథాలీ.. నువ్వు గొప్పగా ఆడినందుకు కాదు..
థాంక్యూ మిథాలీ.. నువ్వు భారత క్రికెట్ను నడిపించినందుకు.. థాంక్యూ మిథాలీ.. మహిళల క్రికెట్కే వన్నె తెచ్చినందుకు.. థాంక్యూ మిథాలీ.. నువ్వు యువతరానికి స్ఫూర్తిగా నిలిచినందుకు.. థాంక్యూ మిథాలీ.. క్రికెట్ కేవలం పురుషుల ఆటే కాదు.. మహిళలూ సత్తాచాటగలరని నిరూపించినందుకు..!
స్ఫూర్తి శిఖరం..
కెరీర్లో ఎవరైనా ముందుకు సాగాలంటే ఆ ప్రయాణంలో ఉన్న అవకాశాలను విశ్లేషించుకొంటారు. అంతేకానీ, గమ్యమే లేని దారిలో.. ఎదురుదెబ్బలే తప్ప అవకాశాలే కనిపించని మార్గంలో ఎవరైనా ముందుకు వెళ్తారా? కానీ, ఆమె వెళ్లింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి మ్యాచ్లోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని భారత క్రికెట్ను ఏలింది. కష్టాలు, అవమానాలు ఎదురైనా ధైర్యం కూడగట్టుకొని లక్ష్యం దిశగా ప్రయాణించింది. దీంతో ఆమె మహిళలకు ఐకాన్గా నిలిచింది. అసలు మన దేశంలో మహిళల క్రికెట్ అనేది ఒకటి ఉందని తెలియని రోజుల నుంచి.. లక్షలాది మంది అమ్మాయిలు క్రికెట్నే కెరీర్గా ఎంచుకునే స్థాయికి ఆటను తీసుకెళ్లింది. అందుకే థాంక్యూ.
సచిన్ కన్నా ఎక్కువే..
క్రికెట్లో అత్యధికకాలం కెరీర్ సాగించింది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సచిన్ తెందూల్కర్. ఆ దిగ్గజం 24 ఏళ్ల పాటు భారత క్రికెట్కు అత్యున్నత సేవలు అందించాడు. అలాంటి మేటి ఆటగాడి కన్నా మిథాలీనే వన్డే క్రికెట్లో అత్యధిక కాలం కొనసాగింది. సహజంగా పురుషులతో పోలిస్తే మహిళల ఫిట్నెస్ కాస్త తక్కువ. అయినా, ఆమె సుదీర్ఘకాలం వన్డేల్లో ఆడింది. తెందూల్కర్ 22 సంవత్సరాల 91 రోజులు ఈ ఫార్మాట్లో ఆడితే.. సనత్ జయసూర్య 21 సంవత్సరాల 184 రోజులు, జావెద్ మియాందాద్ 20 సంవత్సరాల 272 రోజులు ఆడారు. ఈ ముగ్గురి కన్నా ఎక్కువగా మిథాలీ 22 ఏళ్ల, 274 రోజులు ఆడింది. మహిళల మ్యాచ్లు తక్కువే అయినా.. బరిలోకి దిగాలంటే ఫిట్నెస్తో ఉండాల్సిందే. అలా రెండు దశాబ్దాలకుపైగా ఫిట్నెస్ కాపాడుకొని.. పురుష దిగ్గజాలతో సమానంగా క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. అలా ఆడి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. అందుకే ఆమెకు థాంక్యూ.
ఛేజింగ్ క్వీన్..
భారత క్రికెట్ లేదా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఛేజింగ్ క్రికెటర్లు ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేర్లు టీమ్ఇండియా మాజీ సారథులు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. అలాంటి దిగ్గజాలకు కూడా సాధ్యంకాని ఓ ఘనతను మిథాలీ సొంతం చేసుకొంది. వన్డే లక్ష్య ఛేదనల్లో 1000కి పైగా పరుగులు సాధించిన వారిలో అత్యుత్తమ సగటు కలిగిన క్రికెటర్గా ఆమె రికార్డు నెలకొల్పింది. మిథాలీ సగటు 109.05గా నమోదవ్వగా.. ధోనీ 102.71, న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సాటర్త్వైట్ 98.21, విరాట్ కోహ్లీ 94.56, షై హోప్ 89.38 సగటును సాధించారు. అందులో మిథాలీ 35 సందర్భాల్లో నాటౌట్గా నిలిచింది. ఫలితంగా ఛేజింగ్ క్వీన్ అని పేరుతెచ్చుకొంది. అందుకే మిథాలీకి థాంక్యూ.
అత్యుత్తమ సారథి..
భారత క్రికెట్లో ఎంతమంది గొప్ప సారథులున్నా.. మేటి సారథిగా మహేంద్రసింగ్ ధోనీ అగ్ర స్థానంలో ఎప్పటికీ నిలిచిపోతాడు. అలాగే మహిళల క్రికెట్లో మిథాలీ నాయకత్వానికి తిరుగులేదు. ఆమె ఖాతాలో ప్రపంచకప్లు లేవనే లోటే కానీ, మరే భారత సారథికీ సాధ్యంకాని ఓ ఘనత ఆమె పేరిట ఉంది. అదే వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో రెండుసార్లు టీమ్ఇండియాను ఫైనల్స్కు తీసుకెళ్లడం. సౌరభ్ గంగూలీ జట్టు 2003లో రన్నరప్గా నిలిస్తే.. ధోనీసేన 2011లో విజేతగా నిలిచింది. అయితే, మిథాలీ 2005, 2017 టోర్నీల్లో రెండుసార్లు ఫైనల్కు తీసుకెళ్లడం విశేషం. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్గా నిలిచింది. ఈ క్రమంలోనే మిథాలీ మొత్తం 195 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 109 విజయాలు సాధించింది. దీంతో మహిళల క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన మూడో సారథిగా నిలిచింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ 220 మ్యాచ్ల్లో 142 విజయాలు, మెగ్ లానింగ్ 162 మ్యాచ్ల్లో 128 విజయాలు సాధించి మిథాలీ కన్నా ముందున్నారు. ఇలా మేటి మహిళా సారథిగా నిలిచినందుకూ థాంక్యూ.
సుదీర్ఘ కెరీర్లోనూ..
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం ఆడిన క్రికెటర్గా మిథాలీరాజ్ మూడో స్థానంలో నిలిచింది. కారోలిన్ డి ఫౌ అనే నెదర్లాండ్స్ క్రికెటర్ అత్యధికంగా 26 ఏళ్ల 361 రోజుల పాటు కెరీర్ సాగించింది. కానీ, ఆమె 2008 నుంచి 2018 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. 1991 జులైలో అరంగేట్రం చేసిన కారోలిన్ 2018 జులైలో చివరి మ్యాచ్ ఆడింది. మరోవైపు శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత యూఏఈ ప్లేయర్ చమని సెనెవిరత్న 1997 నవంబర్లో అరంగేట్రం చేసి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆమె 24 సంవత్సరాల నుంచి ఆడుతూనే ఉంది. ఈ క్రమంలోనే మిథాలీ 1999 జూన్ నుంచి 2022 మార్చి వరకు మొత్తం 22 సంవత్సరాల 274 రోజులు క్రికెటర్గా ఆడింది. ఆ ప్రయాణంలో భారత మహిళల క్రికెట్కే ఆదరణ తీసుకొచ్చింది. అందుకే మిథాలీ థాంక్యూ.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం