Akash Madhwal: ఇంజినీర్ TO క్రికెటర్.. పాతికేళ్లకు ఎంట్రీ.. ఇదీ ఆకాశ్ మధ్వాల్ స్టోరీ!
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ఎలిమినేటర్ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన బౌలర్ ఆకాశ్ మధ్వాల్ (Akash Madhwal). బుల్లెట్ల లాంటి బంతులను సంధించి లఖ్నవూను ఓడించడంలో ఈ ముంబయి బౌలర్ కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్ 2023 (IPL 2023) ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూను చిత్తు చేసి ముంబయి (LSG vs MI) ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర యువ బౌలర్ ఆకాశ్ మధ్వాల్దే. కేవలం ఐదే పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ చేశాడు. దీంతో అందరి దృష్టి ఈ బౌలర్పై పడింది. ఇంతకీ అతడెవరా..? అని వెతికేయగా మధ్వాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మరి అవేంటో మీరూ చదివేయండి..
ఇంజినీరింగ్ చేసి..
ఐదేళ్ల కిందట వరకు కేవలం టెన్నిస్ బాల్తోనే ఆట. ఉత్తరాఖండ్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి అడుగు పెట్టిన తొలి బౌలర్గా రికార్డు. దేశవాళీ క్రికెట్లో శుభ్మన్ గిల్ వంటి బ్యాటర్కు బంతులేసిన అనుభవం. ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం మానేసి క్రికెట్నే కెరీర్గా ఎంచుకోవడంపై బంధువుల నుంచి ఉచిత సలహాలు.. ఇదీ సంక్షిప్తంగా ఆకాశ్ మధ్వాల్ బయోడేటా. రూర్కీలో 1993లో జన్మించిన ఆకాశ్ సివిల్ ఇంజినీరింగ్ను పూర్తి చేశాడు. సాధారణంగా క్రికెటర్ కావాలని కోరుకుంటే చిన్నప్పటి నుంచే దానిని కెరీర్గా స్వీకరిస్తారు. కానీ, ఆకాశ్ మాత్రం ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం చేసిన తర్వాత క్రికెటర్గా మారాడు.
జాఫర్ చొరవతో..
పాతికేళ్ల వయసులో ఆకాశ్ మధ్వాల్ 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడేందుకు తొలిసారి ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ ఏడాదే ఉత్తరాఖండ్కు ఆడే అవకాశం మొదటిసారి లభించింది. అప్పటి వరకు టెన్నిస్ బంతితోనే ఆడిన ఆకాశ్.. తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే రెడ్ బాల్ను చేతబట్టాడు. అదీనూ టీమ్ఇండియా మాజీ ఆటగాడు, ఉత్తరాఖండ్కు కోచ్గా పనిచేసిన వసీం జాఫర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రయల్స్లో పాల్గొనడం ఆకాశ్కు కలిసొచ్చింది. జాఫర్ చొరవ చూపించి మద్దతుగా నిలవడంతో తన సత్తా ఏంటో మధ్వాల్ నిరూపించుకొన్నాడు. దీంతో ఐపీఎల్ ఎంట్రీకి తలుపులు తెరుచుకున్నాయి.
ముంబయి అన్వేషణ..
కీలక ఆటగాళ్లను వెతికి తెచ్చుకోవడంలో ముంబయి ఇండియన్స్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందులో భాగంగానే ఆకాశ్ మధ్వాల్ ప్రదర్శనను గమనించిన ముంబయి అతడికి అవకాశం కల్పించింది. అలా కేవలం రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్నప్పటికీ.. గత సీజన్లో ఒక్క మ్యాచ్లోనూ ఆడలేకపోయాడు. ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాశ్ జట్టులోకి వచ్చాడు. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. నెట్ బౌలర్గా నాణ్యమైన ప్రదర్శనతో యాజమాన్యం దృష్టిలో పడ్డాడు. ఈ సీజన్లోనూ బుమ్రా లేకపోవడంతో అవకాశం లభిస్తుందని భావించినప్పటికీ.. దక్కలేదు. కానీ, ఆర్చర్ కూడా దూరం కావడంతో మధ్వాల్కు ఛాన్స్ వచ్చింది. ఈ సీజన్లోనే ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. తాజా సీజన్లో ఏడు మ్యాచుల్లోనే 13 వికెట్లు తీశాడు.
పంత్ గురువు వద్దే..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఆకాశ్ మధ్వాల్ సహచరుడే. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు. అలాగే పంత్కు కోచింగ్ ఇచ్చిన అత్వార్ సింగ్ వద్దే ఆకాశ్ కూడా శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో ఆకాశ్ ఆటతీరుకు అతడిని కెప్టెన్సీ వరించింది. ఉత్తరాఖండ్ జట్టుకు సారథిగా నియమిస్తూ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆకాశ్లో స్పెషల్ అదే..
బంతిని తక్కువ బౌన్స్తో జారవిడిచేలా వేయడం ఆకాశ్ మధ్వాల్ ప్రత్యేకత. లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై నాలుగు వికెట్లు తీసిన ఆకాశ్.. ఈసారి మాత్రం మరింత కట్టుదిట్టంగా బంతులను సంధించాడు. అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్ వేసిన బౌలర్గా మారాడు. లఖ్నవూపై 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. లఖ్నవూ బ్యాటర్ బదోనిని క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత బంతికే డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ను బోల్తా కొట్టించాడు. టెస్టుల్లో మాత్రమే చూసే లెంగ్త్తో బంతిని సంధించి వికెట్లు రాబట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?