IND vs PAK: ఆ మజాను మళ్లీ చూడలేమా?.. కిక్ ఇవ్వలేకపోతున్న భారత్ - పాక్ మ్యాచ్లు
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్లు ఏ ఆటలో తలపడ్డా ఇరు దేశాల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక క్రికెట్లో రెండు జట్లూ తలపడితే.. ఇరు దేశాల అభిమానులూ టీవీలకు అతుక్కుపోతారు. ఆ మాటకొస్తే దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ పట్ల ఆసక్తి చూపిస్తారు. ఐతే ఈ ఆసక్తికి తగ్గట్లు చిరకాల ప్రత్యర్థుల పోరాటాలు జరగకపోవడం నిరాశ కలిగిస్తోంది.
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్లు ఏ ఆటలో తలపడ్డా ఇరు దేశాల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక క్రికెట్లో రెండు జట్లూ తలపడితే.. ఇరు దేశాల అభిమానులూ టీవీలకు అతుక్కుపోతారు. ఆ మాటకొస్తే దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ పట్ల ఆసక్తి చూపిస్తారు. ఐతే ఈ ఆసక్తికి తగ్గట్లు చిరకాల ప్రత్యర్థుల పోరాటాలు జరగకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఈ మధ్య ఈ రెండు జట్ల మ్యాచ్లు చాలా వరకు ఏకపక్షం అవుతున్నాయి. ఎక్కువగా భారతే విజయం సాధిస్తుండగా.. ఆ మ్యాచ్లన్నీ ఏకపక్షమే. అప్పుడప్పుడూ పాక్ గెలిచినా అదే పరిస్థితి. రెండు జట్లూ విజయం కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడటం, ఫలితంపై చివరి వరకు ఉత్కంఠ నెలకొనడం లాంటి దృశ్యాలు అరుదైపోతున్నాయి.
భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. వేరే టోర్నీల్లో రెండు జట్లు తలపడటం వేరు, ప్రపంచకప్లో ఢీకొనడం వేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఒక హోరాహోరీ సమరాన్ని ఆశించి ఈ మ్యాచ్ చూడటం మొదలుపెట్టారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఒక దశ వరకు పోటాపోటీగానే సాగింది. 29 ఓవర్లకు 150/2తో నిలిచిన పాక్.. భారత్కు గట్టి సవాలు విసిరేలా కనిపించింది.
ఆ దశ నుంచి ఉన్నట్లుండి కుప్పకూలి చివరికి 191 పరుగులకే పరిమితం అయింది. తర్వాత లక్ష్యాన్ని భారత్ కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ మధ్యలోనే ఏకపక్షం అయిపోయి.. ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయారు. మన వాళ్లు ఆటలో పైచేయి సాధించడం, అంతిమంగా మన జట్టే గెలవడం ఆనందాన్నిచ్చే విషయాలే కానీ.. మ్యాచ్లో అసలు పోటీయే లేకపోవడం, ఉత్కంఠభరితంగా సాగకపోవడం సగటు క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. ఈ మ్యాచ్ అనే కాదు.. గత కొన్నేళ్లలో భారత్-పాక్ మ్యాచ్లు చాలా వరకు ఇలాగే ఏకపక్షం అవుతున్నాయి.
చరిత్ర వేరు..
వన్డే ప్రపంచకప్లో పాక్ చేతిలో భారత్కు ఓటమి అన్నదే లేదు. మొత్తంగా ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ టీమ్ఇండియానే విజయం సాధించింది. అయితే ఒకప్పుడు ఒకప్పుడు పాక్పై విజయాలు అంత తేలిగ్గా ఏమీ రాలేదు. 90వ దశకంలో దాయాది జట్టు ఎంత బలంగా ఉండేదో తెలిసిందే. 1992లో ఆ జట్టు తొలి ప్రపంచకప్ గెలిచిన సమయంలోనే ఆ టోర్నీలో భారత్ చేతిలో తొలి పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ ఓడిపోయింది.
1996లో భారత్ 288 పరుగుల లక్ష్యాన్ని నిలపగా.. పాక్ ధాటిగా ఛేదనను ఆరంభించి ఆ తర్వాత గాడి తప్పింది. 1999లో భారత్ చేసింది 6 వికెట్లకు 227 పరుగులే. అయినా పాక్ను 180కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్లన్నీ చాలా వరకు పోటాపోటీగానే సాగాయి. ఇక 2003లో చిరకాల ప్రత్యర్థుల పోరు ఎంత రసవత్తరంగా సాగిందో తెలిసిందే. అప్పట్లో 274 పరుగులంటే పెద్ద లక్ష్యం. అయితే సచిన్ అసాధారణ ఇన్నింగ్స్తో ఛేదనలో భారత్ దీటుగా బదులిచ్చింది. అద్భుత విజయాన్నందుకుంది. 2011 ప్రపంచకప్ సెమీస్లో సైతం పాక్ గట్టి పోటీనే ఇచ్చింది.
కానీ 2015 నుంచి మ్యాచ్లు ఏకపక్షం అవుతున్నాయి. ఆ టోర్నీలో భారత్ 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పాక్ 224 పరుగులకే కుప్పకూలింది.2019లో భారత్ 5 వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు చేస్తే.. వర్షం వల్ల లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా కుదించగా, పాక్ 212/6కు పరిమితం అయింది. ఇక ప్రస్తుత టోర్నీ సంగతి తెలిసిందే. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో, 2021 టీ20 ప్రపంచకప్లో పాక్ గెలిచిన సమయాల్లో కూడా మ్యాచ్లు ఏకపక్షమే అయ్యాయి. ఈ రెండు సందర్భాల్లో భారత్ పోటీ ఇవ్వలేకపోయింది. వరుసగా 180 పరుగులు, 10 వికెట్ల తేడాతో ఓడింది.
గత దశాబ్ద కాలంలో ఇరు జట్ల మధ్య అత్యంత హోరాహోరీగా సాగిన మ్యాచ్ అంటే.. గత ఏడాది టీ20 ప్రపంచకప్లో పోరే. ఆ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 160 పరుగుల ఛేదనలో భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడగా.. కోహ్లి 82 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అభిమానులకు మామూలు మజానివ్వలేదు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇలా సాగాలని.. అప్పుడే మజా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే ప్రపంచకప్లో కూడా ఇలాంటి ఉత్కంఠభరిత పోరాటాన్ని ఆశిస్తే మ్యాచ్ ఏకపక్షమైంది. తర్వాత ఈ రెండు జట్లూ తలపడ్డపుడైనా మ్యాచ్ అంచనాలకు తగ్గట్లు సాగుతుందేమో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య