Prithvi Shaw: అవసరం ఉన్నంత సేపే ప్రేమిస్తారు.. ఇన్స్టాలో పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్
టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముంబయి (Mumbai)లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద పృథ్వీ షా తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు యూట్యూబర్ సప్నాగిల్, ఆమె స్నేహితులు కొంతమంది పృథ్వీ షాపై దాడి చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షా ఫిర్యాదుతో సప్నాగిల్తోపాటు ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత బెయిల్పై బయటికి వచ్చిన ఆమె.. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబయి పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా పెద్దగా బయటికి రాలేదు. కానీ, తాజాగా అతడు ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టును చూస్తే అతడిని ఎవరో మోసం చేసినట్లు అనిపిస్తోంది.
ఇంతకీ ఆ పోస్టు ఏముందంటే.. ‘కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కానీ ఆ ప్రేమ వారికి మన అవసరం ఉండేవరకే. వారికి వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతే అక్కడే వారి విధేయత కూడా ముగుస్తుంది’ అని పృథ్వీ షా తన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు. అతడు పెట్టిన ఈ పోస్టు అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. కెరీర్ పరంగా పెట్టాడా లేదా లవ్ ఫెయిల్యూర్ వంటి కారణాలేమైనా ఉన్నాయా అని ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం బీసీసీఐని టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టాడని భావిస్తున్నారు. పృథ్వీ షా భారత్ తరఫున చివరగా 2021 మేలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం