Prithvi Shaw: అవసరం ఉన్నంత సేపే ప్రేమిస్తారు.. ఇన్స్టాలో పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్
టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముంబయి (Mumbai)లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద పృథ్వీ షా తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు యూట్యూబర్ సప్నాగిల్, ఆమె స్నేహితులు కొంతమంది పృథ్వీ షాపై దాడి చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షా ఫిర్యాదుతో సప్నాగిల్తోపాటు ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత బెయిల్పై బయటికి వచ్చిన ఆమె.. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబయి పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా పెద్దగా బయటికి రాలేదు. కానీ, తాజాగా అతడు ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టును చూస్తే అతడిని ఎవరో మోసం చేసినట్లు అనిపిస్తోంది.
ఇంతకీ ఆ పోస్టు ఏముందంటే.. ‘కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కానీ ఆ ప్రేమ వారికి మన అవసరం ఉండేవరకే. వారికి వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతే అక్కడే వారి విధేయత కూడా ముగుస్తుంది’ అని పృథ్వీ షా తన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు. అతడు పెట్టిన ఈ పోస్టు అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. కెరీర్ పరంగా పెట్టాడా లేదా లవ్ ఫెయిల్యూర్ వంటి కారణాలేమైనా ఉన్నాయా అని ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం బీసీసీఐని టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టాడని భావిస్తున్నారు. పృథ్వీ షా భారత్ తరఫున చివరగా 2021 మేలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్