పసికూన... అది పాత కథ... క్రికెట్లో తగ్గిపోతున్న పెద్ద, చిన్న జట్ల అంతరం
ప్రపంచకప్ అనగానే ఒకట్రెండు చిన్నజట్లు వస్తాయి... ఆ మ్యాచ్ల్లో పెద్ద టీమ్లు సునాయాసంగా విజయం సాధిస్తాయి అనుకునేవారు. కానీ 2023 ప్రపంచకప్లో అలా జరగడం లేదు.
ఒకప్పుడు ప్రపంచకప్ లాంటి టోర్నీలు జరుగుతుంటే.. కొన్ని జట్లను పసికూనలు అనేవాళ్లు. ఆ జట్లతో మ్యాచ్లు అంటే ఏకపక్షమే అన్న అభిప్రాయం ఉండేది. ఆ అంచనాకు తగ్గట్లే మ్యాచ్లు జరిగేవి. ఈ జట్లలో ఏదైనా ఓ పెద్ద జట్టును ఓడిస్తే టోర్నీలో ప్రకంపనలు రేగేవి. అదో పెద్ద సంచలనం అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్లు. చాలా ఏళ్ల పాటు ఆ మ్యాచ్లు గుర్తుండిపోయేవి. కానీ ఇప్పుడు కథ మారింది. ఏ జట్టునూ పసికూన అని అనలేని పరిస్థితి. అలా అనుకున్న జట్లు పెద్ద జట్లను ఓడించడం సాధారణ విషయంగా మారిపోయింది. చిన్న, పెద్ద జట్ల మధ్య అంతరం తగ్గిపోయి.. ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయలేని, తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఇదే.
2023 వన్డే ప్రపంచకప్కు అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధిస్తే.. శ్రీలంక, వెస్టిండీస్ లాంటి జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి వచ్చింది. దీన్ని బట్టే ప్రపంచ క్రికెట్లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవచ్చు. క్వాలిఫయర్స్లో శ్రీలంక, వెస్టిండీస్ సునాయాసంగా గెలిచేసి ప్రపంచకప్కు వచ్చేస్తాయని అనుకున్నారు. ఐతే లంక బాగానే ఆడినా.. దానికి గట్టి పోటీ తప్పలేదు. ఇక వెస్టిండీస్ పరిస్థితి ఏమైందో తెలిసిందే. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్ల చేతిలో షాక్లు తిని ప్రపంచకప్నకే దూరం అయింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మునుపెన్నడూ లేనంత హోరాహోరీగా సాగాయి. స్కాట్లాండ్, జింబాబ్వే కూడా తీవ్రంగా ప్రయత్నించినా.. చివరికి శ్రీలంకతో పాటుగా నెదర్లాండ్స్ ప్రపంచకప్ అర్హత సాధించింది. ఐతే ప్రపంచకప్లో చిన్న జట్లు.. పెద్ద జట్ల నుంచి పోటీని ఏమాత్రం తట్టుకుంటాయో అనుకున్నారు. కానీ వాటి ప్రదర్శన అనూహ్యంగా సాగుతోంది.
ఒకటి రెండు కాదు..
ప్రతి ప్రపంచకప్లో ఒకటో రెండో సంచలనాలు నమోదు కావడం మామూలే. కానీ ఈసారి ప్రపంచకప్లో జరిగింది మాత్రం వేరు. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఈ టోర్నీలో అఫ్గానిస్థాన్ ప్రదర్శన గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో సందేహం లేదు. దాన్ని ఇకపై పసికూన, చిన్న జట్టు అనడం పెద్దే తప్పే అవుతుందేమో. మొదట ఇంగ్లాండ్.. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది అఫ్గాన్. ఇందులో ఏ మ్యాచ్లోనూ ప్రత్యర్థి జట్లు అనూహ్యంగా ఏమీ కుప్పకూలిపోలేదు. అఫ్గాన్కు సవాలు విసిరాయి. కానీ అఫ్గాన్ దీటుగా స్పందించింది. ఆరంభం నుంచి చివరి వరకు ఒక ప్రణాళిక ప్రకారం ఆడింది. ఒక పెద్ద జట్టు స్థాయిలో సాధికారిక ప్రదర్శనతో మ్యాచ్లను గెలిచిన తీరు అనూహ్యం.
దిల్లీలో బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి.. 215 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేయడం.. చెన్నైలో బౌలింగ్ పిచ్పై పాక్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లే కోల్పోయి ఛేదించడం.. లఖ్నవూలో బ్యాటింగ్కు మరింత కష్టంగా మారిన పిచ్ మీద లంక 241 పరుగులు చేస్తే 28 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదన పూర్తి చేయడం అఫ్గాన్ ప్రమాణాలు ఎంత పెరిగాయో సూచిస్తుంది. ఈ ప్రపంచకప్తో అఫ్గాన్ ‘చిన్న జట్టు’ అనే ముద్రను పూర్తిగా తొలగించుకుంది అనడంలో సందేహం లేదు. ఇక నెదర్లాండ్స్ సైతం ఈ టోర్నీతో ఎన్నో మెట్లు ఎక్కింది. దక్షిణాఫ్రికాపై ఆ జట్టు విజయాన్ని ఎంతమాత్రం గాలివాటం అనలేం. బలమైన బౌలింగ్ను ఎదుర్కొంటూ 246 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే కాక.. ఒక ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేసి 38 పరుగుల తేడాతో సాధికారికంగా గెలిచింది. ఇక బంగ్లాదేశ్ అయితే నెదర్లాండ్స్కు పోటీనే ఇవ్వలేకపోయింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 142కే కుప్పకూలింది.
ఐసీసీ దృష్టిసారిస్తే..
చిన్న జట్లు ప్రపంచ క్రికెట్లో ఒక స్థాయి అందుకోవడానికి.. వేగంగా ఎదుగుతుండటానికి టీ20 క్రికెట్ ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఈ ఫార్మాట్ జట్ల మధ్య అంతరాలను తగ్గించేసింది. 20 ఓవర్ల ఆటలో దూకుడుగా, తెగించి ఆడటం అలవాటు చేసుకుంటున్న జట్లు.. వన్డేల్లో కూడా సత్తా చాటగలుగుతున్నాయి. ఇక అసోసియేట్ దేశాల్లో భాగమైన క్రికెటర్లు చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్స్లో ఆడుతున్నారు. పేరున్న ఆటగాళ్లతో కలిసి ఆడుతూ మంచి అనుభవం సంపాదిస్తున్నారు. దీంతో పెద్ద జట్లతో ఆడుతున్నపుడు బెరుకు ఉండట్లేదు. ఒత్తిడికి గురి కావట్లేదు. సై అంటే సై అన్నట్లు తలపడుతున్నారు. కాబట్టి మున్ముందు చిన్న, పెద్ద జట్ల మధ్య అంతరం మరింత తగ్గిపోవడం ఖాయం.
టీ20, వన్డే ప్రపంచకప్ల్లో ఈ జట్లను ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. దీని వల్ల చిన్న జట్లతో మ్యాచ్ అంటే ఏకపక్షం, బోరింగ్ అనుకునే పరిస్థితి కూడా ఉండదు. ఐరోపా, గల్ఫ్ దేశాల్లో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలామంది వెలుగులోకి వస్తున్నారు. అసోసియేట్ దేశాల మధ్య జరిగే సిరీస్లు, టోర్నీలతో పాటు.. లీగ్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. ఐసీసీ కూడా ఆయా దేశాలకు మరింత ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు అంతర్జాతీయ సిరీస్ల సంఖ్య పెంచడం.. మధ్య స్థాయి జట్లతో తరచుగా సిరీస్లు ఆడిస్తే మున్ముందు మరిన్ని నాణ్యమైన జట్లు తయారవుతాయి. ప్రపంచ క్రికెట్లో పోటీ పెరిగి ఆటకు మరింత మేలు జరుగుతుంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!