IND vs AUS: మూడో టెస్టులో భారత్ ఓటమి.. టాస్ నుంచి అన్నీ ప్రతికూలతలే..!
వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఊపు మీదున్న టీమ్ఇండియాకు (Team India) ఆసీస్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లోపే ముగిసిన ఇందౌర్ టెస్టులో భారత్పై ఆసీస్ (IND vs AUS) విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: మూడు రోజుల్లోనే సంబరం ముగిసింది. స్పిన్ మంత్రమంటూ ప్రత్యర్థిని (IND vs AUS) ఉక్కిరిబిక్కిరి చేసేద్దామని ప్రణాళికలను రచించిన టీమ్ఇండియాకు (Team India) అదే పెను శాపమైంది. తీరా పర్యాటక టీమ్ బౌలర్లు (Bowling) ఆధిపత్యం ప్రదర్శించి గెలుపును ఎగరేసుకుపోయారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను (IND vs AUS) నమోదు చేసిన టీమ్ఇండియా (Team India).. మూడో మ్యాచ్లో మాత్రం ఆసీస్ (Australia) చేతిలో ఓడి చతికిలపడింది. ఇలా ఓటమి చెందడానికి పలు కారణాలు ఉన్నాయనేది కాదనలేని సత్యం.
టాస్ గెలిచి మరీ.. (Toss)
భారత్లో టెస్టులు అనగానే స్పిన్ పిచ్లు అని మనందరికీ తెలుసు. ప్రత్యర్థులు కూడా అలాగే ప్రిపేర్ అవుతారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ కూడా తొలి రెండు టెస్టుల్లో ఇలానే ఇబ్బంది పడింది. ఇందౌర్ పిచ్ కూడా స్పిన్కు అనుకూలం. మరి అలాంటి మైదానంలో తలపడేటప్పుడు ప్రతి విషయంపైనా దృష్టిపెట్టాలి. కానీ, టీమ్ఇండియా మాత్రం భారీ తప్పిదంతోనే మ్యాచ్ను ప్రారంభించింది. ఇలాంటి మ్యాచ్లో టాస్ చాలా కీలకం. అలాంటిది భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గి మరీ తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురి చేసింది. వచ్చిన అవకాశాలను ఆసీస్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 109 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక్కడే ఆసీస్ విజయానికి.. భారత్ ఓటమికి నాంది పడింది.
అదేం ఆట.. ఒక్కరైనా.. (Attacking Game)
ఆసీస్ స్పిన్నర్లు ఎటాకింగ్ బౌలింగ్ చేస్తూ భారత (Team India) బ్యాటింగ్ లైనప్ను చిందరవందర చేశారు. టీమ్ఇండియా ఆటగాళ్లు వారి బౌలింగ్ దాడికి దాసోహమన్నారు. కనీసం, భారీ షాట్లు కొడదామనే ఆలోచన కూడా వచ్చినట్లు లేదు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ల్లోనూ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో ఓ వైపు పుజారా (Pujara) గోడలా క్రీజ్లో పాతుకుపోతే.. మరోవైపు కనీసం దూకుడుగా ఆడదామనే ఆలోచన కూడా రాలేదు. శ్రేయస్ అయ్యర్ (Shreya iyer) ఏదో కాసేపు అలరించినా.. ప్రయోజనం మాత్రం లేదు. ఇదే సమయంలో రిషభ్ పంత్ (Rishabh Pant) గుర్తుకు రావడం సహజం. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడి ప్రత్యర్థిని డిఫెన్స్లో పడేస్తాడనే నమ్మకం అతడిపై ఉండేది. టీ20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ కూడా వేగంగానే ఆడతాడు. కానీ, వన్డేలు, టెస్టుల్లో విఫలం కావడం అతడికి జట్టులో స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణం. యువ బ్యాటర్ శ్రీకర్ భరత్ ఆ బాధ్యతను తీసుకుంటే బాగుండేది.
‘స్పిన్’ మంత్రం ఏమైంది..? (Spin Bowling)
స్వదేశంలో భారత బ్యాటింగ్ లైనప్ను అడ్డుకోవాలంటే ప్రత్యర్థి బౌలర్లకు అంత సులువేం కాదు. కానీ, మూడో టెస్టు మ్యాచ్లో మన బ్యాటింగ్ను చూస్తే.. ఎక్కడో విదేశాల్లో ఆడినట్లు అనిపించింది. ఆసీస్ యువ బౌలర్లు కున్మన్, మర్ఫీని ఎదుర్కోవడానికి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇబ్బంది పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసీస్ బ్యాటర్లూ కాస్త ఇబ్బంది పడినా.. ఛేదనలో మాత్రం దూకుడు ప్రదర్శించి ఫలితం రాబట్టారు. అలాంటి ఎటాకింగ్ గేమ్ మన దగ్గర లేకుండా పోయింది. మరోవైపు బౌలింగ్లోనూ ఆసీస్తో పోలిస్తే భారత స్పిన్నర్లు తేలిపోయారు. ఏకంగా 18 వికెట్లను ఆసీస్ స్పిన్ బౌలర్లు పడగొట్టగా.. భారత టాప్ స్పిన్నర్లు మాత్రం 8 వికెట్లను మాత్రమే తీశారు. నాథన్ లైయన్ ఒకే ఇన్నింగ్స్లో (భారత్ రెండో ఇన్నింగ్స్) ఎనిమిది వికెట్లు పడగొట్టి అబ్బుర పరిచాడు. జడేజా, అశ్విన్ వికెట్లు తీసినప్పటికీ.. అక్షర్ పటేల్ మాత్రం ఈ మ్యాచ్లో ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోవడం గమనార్హం. కీలక సమయాల్లో ఫీల్డింగ్ వైఫల్యం కూడా భారత్ ఓటమికి ఒక కారణం. ఆసీస్ అద్భుతమైన ఫీల్డింగ్తో క్యాచ్లను ఒడిసి పట్టింది.
అదనంగా ఓ బ్యాటర్ ఉంటే.. (Extra Batter)
అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ భారత్కు మూడు రకాలుగా కీలకం కానుంది. బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీని గెలవడంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTV Final) దూసుకెళ్లడం, ఐసీసీ (ICC) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్ర స్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి టెస్టు మ్యాచ్లోనైనా భారత్ విజయం సాధించాలంటే.. తుది జట్టు ఎంపిక చాలా కీలకం. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల అవసరం పెద్దగా లేదు. కాబట్టి, ఇప్పుడున్న ఉమేశ్, సిరాజ్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చి.. అదనంగా మరో బ్యాటర్ను ఆడించాలి. పరిస్థితులను పట్టించుకోకుండా కాస్త దూకుడుగా ఆడే సూర్యకుమార్ యాదవ్కు (Surya kumar Yadav) అవకాశం ఇస్తే బాగుంటుందనేది క్రికెట్ విశ్లేషకుల సూచన. ఓ నాలుగు భారీ షాట్లు ఆడితే ప్రత్యర్థి బౌలింగ్ గాడి తప్పేందుకు ఛాన్స్ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన