WTC Final: వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. కారణాలు ఇవేనా?
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) టీమ్ఇండియాకు వరుసగా రెండోసారి ఓటమి ఎదురైంది. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 209 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం తీవ్రంగా నిరాశపరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTC Final)చేరుకోవడమే చాలా కష్టం. టెస్టు దేశాలతో పోటీ పడి మరీ టాప్ -2లో నిలవాలి. అలాంటిది వరుసగా రెండుసార్లు ఫైనల్కు చేరిన టీమ్ఇండియా మాత్రం ఛాంపియన్గా నిలవడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. టెస్టు ‘గద’ ను దక్కించుకొనే కీలక మ్యాచ్ అంటే అన్ని రంగాల్లో రాణించాలి. కానీ భారత్ మాత్రం ఆసీస్పై తేలిపోవడం గమనార్హం. అసలు ఇంతకీ భారత పరాభవానికి గల కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
అక్కడే తొలి పొరపాటు
ఇంగ్లాండ్ పిచ్లు పేస్కు అనుకూలం. అందులో సందేహం లేదు. కానీ, స్పిన్కూ అనుకూలించే అవకాశం ఉందని పిచ్ను పరిశీలించిన విశ్లేషకుల అంచనా. మన జట్టులో కనీసం పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా లేడు. జడేజాతోనే బరిలోకి దిగాం. అశ్విన్ ఉంటే తన వైవిధ్యమైన బౌలింగ్తో మార్పు వచ్చేదేమో. ఆసీస్పైనా, డబ్ల్యూటీసీ సీజన్లోనూ అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్ను పక్కన పెట్టేసింది. బ్యాటింగ్లోనూ అండగా నిలిచే సత్తా అతడి సొంతం.
పేసర్లు రివర్స్
టాస్ నెగ్గి తర్వాత బౌలింగ్ ఎంచుకున్న భారత్కు తొలి సెషన్ మినహా ఏది కలిసిరాలేదు. పేస్కు అనుకూలంగా ఉన్నా మన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. షమీ, సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించారు. బౌన్సీ పిచ్లపై రాణిస్తాడని ఆశించిన ఉమేశ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో తేలిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో కీలక వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలను వేస్తే బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేకపోయారు. సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ, నిలకడగా అలాంటి బాల్స్ వేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా..?
భారత బ్యాటింగ్ లైనప్లో అజింక్య రహానె మినహా మిగతా వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. గిల్, కోహ్లీ, రోహిత్ నేరుగా ఐపీఎల్ నుంచి వచ్చారు. ఇంకా ఆ మూడ్లో నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. క్రీజ్లో పాతుకు పోయి ఆడటంలో విఫలమయ్యారు. వీరంతా స్టార్ ఆటగాళ్లు అయినా పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్కు తమను మలుచుకోవడంలో విఫలం కావడం మ్యాచ్లో తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ వందల పరుగులు కొట్టిన వాళ్లు ఇక్కడ వంద నిమిషాలు కూడా క్రీజ్లో ఉండలేకపోయారు.
పుజారా పట్టుమని...
ఇంగ్లాండ్లో గత కొన్ని రోజులుగా కౌంటీల్లో అదరగొట్టిన పుజారా అసలు మ్యాచ్కు వచ్చేసరికి తేలిపోయాడు. పుజారా కంటే చాలా రోజులుగా టెస్టులకు దూరంగా ఉన్న రహానె కీలక ఇన్నింగ్స్లు ఆడటం గమనార్హం. అందరికీ మార్గనిర్దేశకుడిగా ఉంటూ సహచరులకు విలువైన సూచనలు ఇవ్వాల్సిన పుజారానే విఫలం కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా భావించొచ్చు. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు కనీసం వార్మప్ అవడానికి వీలుగా మ్యాచ్లు పెట్టకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాటల్లోని దూకుడు... చేతల్లో లేదు
బౌలింగ్ ఎటాక్కు వెళ్లినప్పుడు మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడం ఈ మ్యాచ్లోనూ మనం చూశాం. అయితే, ఆసీస్ బ్యాటర్లను రెచ్చగొట్టేలా ఉన్న అతడి చర్యలు.. భారత్ను మాత్రం కాపాడలేకపోయాయి. సిరాజ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి ఐదు వికెట్లు తీసి 188 పరుగులు ఇచ్చాడు. ఓ పక్క ఆస్ట్రేలియా బౌలర్లు నిశ్శబ్దంగా వికెట్లు తీస్తూ తమ జట్టును గెలిపించారు. రెండో ఇన్నింగ్స్లో 125/5 స్కోరుతో ఉన్న ఆసీస్ను కట్టడి చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు.
అంపైర్ నిర్ణయమూ కారణమే..
భారత్ ఓటమికి బౌలింగ్, బ్యాటింగ్లో విఫలం కావడంతోపాటు అంపైర్ల నిర్ణయాలు కూడా ఓ కారణమనే వాదనా ఉంది. మరీ ముఖ్యంగా భారీ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో శుభ్మన్ గిల్ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు రేగాయి. రోహిత్తో కలిసి మంచి భాగస్వామ్యం అందించే క్రమంలో గిల్ ఔట్ కావడంతో భారత్ ఒత్తిడికి గురైంది.
ఇంగ్లాండ్ అయినా ఆసీస్కే...
ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం ఈ ఫైనల్కి పేరుకే న్యూట్రల్ వేదికైనా ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఇంగ్లిష్ పిచ్లు ఆసీస్ పిచ్లకు దగ్గరగా ఉంటాయి. మన వాళ్లు ఇటీవల కాలంలో అలాంటి పిచ్లకు అలవాటుపడినా, WTC ఫైనల్ లాంటి వాటికి ఒక టీమ్కు మాత్రమే అనువైన పిచ్లు ఉండటం సరికాదు అనే విమర్శలు మ్యాచ్ తొలినాళ్లలోనే వచ్చాయి. మ్యాచ్ ఫలితానికి ఇది మొత్తంగా కారణం కాకపోయినా... ప్రభావం చూపించిన అంశాల్లో మాత్రం ఇదొక్కటి అని చెప్పొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్