WTC Final: వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. కారణాలు ఇవేనా?
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) టీమ్ఇండియాకు వరుసగా రెండోసారి ఓటమి ఎదురైంది. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 209 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం తీవ్రంగా నిరాశపరిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTC Final)చేరుకోవడమే చాలా కష్టం. టెస్టు దేశాలతో పోటీ పడి మరీ టాప్ -2లో నిలవాలి. అలాంటిది వరుసగా రెండుసార్లు ఫైనల్కు చేరిన టీమ్ఇండియా మాత్రం ఛాంపియన్గా నిలవడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. టెస్టు ‘గద’ ను దక్కించుకొనే కీలక మ్యాచ్ అంటే అన్ని రంగాల్లో రాణించాలి. కానీ భారత్ మాత్రం ఆసీస్పై తేలిపోవడం గమనార్హం. అసలు ఇంతకీ భారత పరాభవానికి గల కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
అక్కడే తొలి పొరపాటు
ఇంగ్లాండ్ పిచ్లు పేస్కు అనుకూలం. అందులో సందేహం లేదు. కానీ, స్పిన్కూ అనుకూలించే అవకాశం ఉందని పిచ్ను పరిశీలించిన విశ్లేషకుల అంచనా. మన జట్టులో కనీసం పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా లేడు. జడేజాతోనే బరిలోకి దిగాం. అశ్విన్ ఉంటే తన వైవిధ్యమైన బౌలింగ్తో మార్పు వచ్చేదేమో. ఆసీస్పైనా, డబ్ల్యూటీసీ సీజన్లోనూ అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్ను పక్కన పెట్టేసింది. బ్యాటింగ్లోనూ అండగా నిలిచే సత్తా అతడి సొంతం.
పేసర్లు రివర్స్
టాస్ నెగ్గి తర్వాత బౌలింగ్ ఎంచుకున్న భారత్కు తొలి సెషన్ మినహా ఏది కలిసిరాలేదు. పేస్కు అనుకూలంగా ఉన్నా మన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. షమీ, సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించారు. బౌన్సీ పిచ్లపై రాణిస్తాడని ఆశించిన ఉమేశ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో తేలిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో కీలక వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలను వేస్తే బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని మాజీలు చెబుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేకపోయారు. సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. కానీ, నిలకడగా అలాంటి బాల్స్ వేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.
ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా..?
భారత బ్యాటింగ్ లైనప్లో అజింక్య రహానె మినహా మిగతా వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. గిల్, కోహ్లీ, రోహిత్ నేరుగా ఐపీఎల్ నుంచి వచ్చారు. ఇంకా ఆ మూడ్లో నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. క్రీజ్లో పాతుకు పోయి ఆడటంలో విఫలమయ్యారు. వీరంతా స్టార్ ఆటగాళ్లు అయినా పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్కు తమను మలుచుకోవడంలో విఫలం కావడం మ్యాచ్లో తీవ్ర ప్రభావం చూపించింది. అక్కడ వందల పరుగులు కొట్టిన వాళ్లు ఇక్కడ వంద నిమిషాలు కూడా క్రీజ్లో ఉండలేకపోయారు.
పుజారా పట్టుమని...
ఇంగ్లాండ్లో గత కొన్ని రోజులుగా కౌంటీల్లో అదరగొట్టిన పుజారా అసలు మ్యాచ్కు వచ్చేసరికి తేలిపోయాడు. పుజారా కంటే చాలా రోజులుగా టెస్టులకు దూరంగా ఉన్న రహానె కీలక ఇన్నింగ్స్లు ఆడటం గమనార్హం. అందరికీ మార్గనిర్దేశకుడిగా ఉంటూ సహచరులకు విలువైన సూచనలు ఇవ్వాల్సిన పుజారానే విఫలం కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా భావించొచ్చు. కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు కనీసం వార్మప్ అవడానికి వీలుగా మ్యాచ్లు పెట్టకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాటల్లోని దూకుడు... చేతల్లో లేదు
బౌలింగ్ ఎటాక్కు వెళ్లినప్పుడు మహ్మద్ సిరాజ్ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడం ఈ మ్యాచ్లోనూ మనం చూశాం. అయితే, ఆసీస్ బ్యాటర్లను రెచ్చగొట్టేలా ఉన్న అతడి చర్యలు.. భారత్ను మాత్రం కాపాడలేకపోయాయి. సిరాజ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి ఐదు వికెట్లు తీసి 188 పరుగులు ఇచ్చాడు. ఓ పక్క ఆస్ట్రేలియా బౌలర్లు నిశ్శబ్దంగా వికెట్లు తీస్తూ తమ జట్టును గెలిపించారు. రెండో ఇన్నింగ్స్లో 125/5 స్కోరుతో ఉన్న ఆసీస్ను కట్టడి చేయడంలో మన బౌలర్లు విఫలమయ్యారు.
అంపైర్ నిర్ణయమూ కారణమే..
భారత్ ఓటమికి బౌలింగ్, బ్యాటింగ్లో విఫలం కావడంతోపాటు అంపైర్ల నిర్ణయాలు కూడా ఓ కారణమనే వాదనా ఉంది. మరీ ముఖ్యంగా భారీ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో శుభ్మన్ గిల్ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు రేగాయి. రోహిత్తో కలిసి మంచి భాగస్వామ్యం అందించే క్రమంలో గిల్ ఔట్ కావడంతో భారత్ ఒత్తిడికి గురైంది.
ఇంగ్లాండ్ అయినా ఆసీస్కే...
ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం ఈ ఫైనల్కి పేరుకే న్యూట్రల్ వేదికైనా ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఇంగ్లిష్ పిచ్లు ఆసీస్ పిచ్లకు దగ్గరగా ఉంటాయి. మన వాళ్లు ఇటీవల కాలంలో అలాంటి పిచ్లకు అలవాటుపడినా, WTC ఫైనల్ లాంటి వాటికి ఒక టీమ్కు మాత్రమే అనువైన పిచ్లు ఉండటం సరికాదు అనే విమర్శలు మ్యాచ్ తొలినాళ్లలోనే వచ్చాయి. మ్యాచ్ ఫలితానికి ఇది మొత్తంగా కారణం కాకపోయినా... ప్రభావం చూపించిన అంశాల్లో మాత్రం ఇదొక్కటి అని చెప్పొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన