Six Hitting Victory: మోదీ మొన్న అన్నారు.. క్రికెటర్లు ఎప్పుడో పాటించారు!
భారీ షాట్తో జట్టును గెలిపిస్తే ఆ మజానే వేరు. అందులోనూ కీలక మ్యాచుల్లో అయితే అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. ఇలా భారత స్టార్ క్రికెటర్లు సిక్స్తో జట్టును గెలిపించిన సందర్భాలేంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ‘‘చివరి బంతికి సిక్స్ కొట్టండి’’.. ఇదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవిశ్వాసం సందర్భంగా తమ ఎంపీలకు చేసిన సూచన. ప్రధాని మోదీ మాటలను హార్దిక్ పాండ్య విన్నట్లు ఉన్నాడు. విండీస్తో జరిగిన మూడో టీ20లో (WI vs IND) సిక్స్తో జట్టును గెలిపించాడు. అయితే, చివరి బంతి కాదు కానీ కీలకమైన మ్యాచే. ఇలా సిక్స్తో మ్యాచ్లను ముగించిన ముఖ్యమైన సందర్భాలనూ మనం ఓసారి గుర్తు చేసుకుందాం..
ఎప్పటికీ ఎవర్గ్రీన్
దాదాపు 28 ఏళ్లపాటు రెండో వన్డే వరల్డ్ కప్ను అందుకోవాలనే కలగా అలానే ఉండిపోయిన వేళ.. స్వదేశంలో జరిగిన 2011 వరల్డ్ కప్ మెగా టోర్నీలో టీమ్ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కూల్ నాయకత్వంలో రెండో ప్రపంచకప్ కావడం విశేషం. అంతకుముందు 2007లో పొట్టి కప్ను అందించాడు. అయితే, 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ స్టైల్గా సిక్స్ కొట్టిన విధానం క్రికెట్ అభిమానుల్లో అలా ఉండిపోతుంది. శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్ను 48.2 ఓవర్లలోనే భారత్ ఛేదించింది.
డీకేకు ‘నిదహాస్’ నీరాజనం
శ్రీలంకలోని కొలంబో వేదికగా 2018లో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడింది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ చివరి బంతికి విజయం సాధించి నిదహాస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం. అయితే, ఐదు బంతులకు ఏడు రన్స్ రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. సౌమ్యా సర్కార్ వేసిన ఈ ఓవర్ ఆఖరి బంతిని దినేశ్ కార్తిక్ సిక్స్గా మలిచిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఐపీఎల్లోనూ ఇలా ఫినిషింగ్ పాత్రను పోషించిన కార్తిక్.. గత ఏడాది మాత్రం నిరాశపరిచాడు.
పాక్పైనా సిక్స్తో హార్దిక్
విండీస్తో కీలకమైన మ్యాచ్లో సిక్స్తో భారత్ను గెలిపించిన హార్దిక్ పాండ్య గతేడాది జరిగిన ఆసియా కప్లోనూ ఇలాంటి ప్రదర్శనే చేశాడు. ఆ టోర్నీలో భారత్ ప్రదర్శన నిరాశపరిచినా.. పాక్పై గెలవడం మాత్రం అభిమానులకు గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత్ కూడా చివర్లో ఇబ్బంది పడేలా కనిపించింది. కానీ హార్దిక్ పాండ్య ఆత్మవిశ్వాసంతో ఆడి 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో చివరి బంతికి మనోళ్లు..
ఐదు సిక్స్ల రింకు..
ఇదే ఏడాది ఐపీఎల్లో ఇలా సిక్స్తో మ్యాచ్ను ముగించిన ఆటగాడు కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. వరుసగా ఐదు సిక్స్లు కొట్టిన రింకు సింగ్ కోల్కతాను గెలిపించాడు.
హైదరాబాద్పై రషీద్ ఖాన్
చాలాఏళ్లపాటు సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడిన రషీద్ ఖాన్ గతేడాది గుజరాత్ టైటాన్స్కు వెళ్లిపోయాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్లో హైదరాబాద్పైనే దూకుడైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ను గెలిపించాడు. నాలుగు బంతుల్లో మూడు సిక్స్లు కొట్టడం గమనార్హం. చివరి రెండు బంతుల్లో 9 పరుగులు అవసరమైన వేళ వరుసగా రెండు సిక్స్లు బాదేశాడు.
పంజాబ్పై తెవాతియా
గతేడాది ఐపీఎల్ సీజన్లో రాహుల్ తెవాతియా పేరు మారుమోగిపోయింది. మరీ ముఖ్యంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చివరి రెండు బంతుల్లో సిక్స్లు కొట్టిన తెవాతియా ఓటమి నుంచి గుజరాత్ను గట్టెక్కించాడు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ చివరి ఓవర్లో 19 పరుగులు చేయాలి. ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్స్లు కొడితేనే గుజరాత్ విజయం సాధించే పరిస్థితి. ఆశలన్నీ కోల్పోయిన వేళ తెవాతియా అసాధారణ రీతిలో రెండు సిక్స్లు కొట్టేశాడు.
కోల్కతాను హడలెత్తించిన జడ్డూ
చెన్నై జట్టు విజయవంతంగా నడవడంలో ధోనీ పాత్రతోపాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా కీలకం. ఇటీవల ముగిసిన సీజన్ ఫైనల్లోనూ గుజరాత్పై సిక్స్, ఫోర్ కొట్టి కప్ను అందించిన జడ్డూ.. 2020 సీజన్లోనూ కోల్కతాపై ఇలాగే కీలక సమయంలో వరుసగా రెండు సిక్స్లు కొట్టి విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
2016లో కింగ్స్ పంజాబ్పై ధోనీ
ఐపీఎల్ 2023 సీజన్లో ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్కు వచ్చి సిక్స్లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. కీలకమైన సమయంలో భారీ సిక్స్లు కొట్టడం ధోనీ స్పెషాలిటీ. అంతర్జాతీయంలోనే కాకుండా ఐపీఎల్లోనూ ఇలాంటి ఫీట్లు సాధించాడు. రైజింగ్ పుణె జట్టు తరఫున 2016లో బరిలోకి దిగిన ధోనీ పంజాబ్ కింగ్స్పై ఇలానే సిక్స్తో జట్టును గెలిపించాడు.
శ్రీకర్ ఖాతాలోనూ అరుదైన ఫీట్
టెస్టు బ్యాటర్గా మనకు పరిచయమున్న శ్రీకర్ భరత్ కూడా ఐపీఎల్లో సిక్స్తో తన జట్టును గెలిపించాడు. ఆర్సీబీ తరఫున ఆడిన భరత్ 2021 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్పై అర్ధశతకంతో (78*) చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. చివరి బంతికి సిక్స్ అవసరమైన సందర్భంలో అవేశ్ ఖాన్ వేసిన ఓవర్లో శ్రీకర్ భరత్ సూపర్ సిక్స్ కొట్టాడు.
రోహిత్ శర్మ కూడా..
ఫార్మాట్ ఏదైనా సిక్స్లు కొట్టడంలో కెప్టెన్ రోహిత్ శర్మ తీరే వేరు. ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున 2012 సీజన్ నుంచి ఆడిన రోహిత్.. డెక్కన్ ఛార్జర్స్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 3 బంతుల్లోనే 11 పరుగులు అవసరమైనప్పుడు రోహిత్ సిక్స్తో మ్యాచ్ను ముగించాడు. డెక్కన్ ఛార్జర్స్ 139 పరుగులే లక్ష్యంగా నిర్దేశించిన కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబయికి ఛేదన సులువుగా సాగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్