IPL 2023: ఈ ఐపీఎల్కు దూరమైన కీలక ఆటగాళ్లు వీరే..
శుక్రవారం నుంచి ఐపీఎల్ (IPL 2023) సందడి ప్రారంభం కానుంది. ఆయా జట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. అయితే కొంతమంది కీలక ఆటగాళ్లు మాత్రం దూరం కావడం అభిమానులను నిరాశకు గురి చేసే అంశం..వాళ్లెవరో చూద్దామా?
క్రికెట్ ప్రేమికులకు ఈ నెలాఖరు నుంచి పండగే. దాదాపు రెండు నెలలపాటు సాగే ఐపీఎల్ (IPL 2023) కోసం ఆటగాళ్లు సిద్ధమయ్యారు. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడి ఈ మెగాటోర్నీకి దూరమవుతున్నారు. వాళ్లెవరు, ఎందుకు దూరమవుతున్నారో చూద్దాం!
- రిషభ్ పంత్: గత సీజన్లో దిల్లీ కెప్టెన్ అయిన పంత్.. ఇటీవల రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. దిల్లీ విజయాల్లో కీలకంగా ఉన్న పంత్ మిస్సవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి స్థానంలో డెవిడ్ వార్నర్కు తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. జట్టులో ఉత్సాహాన్ని నింపేందుకు పంత్ను కొన్ని మ్యాచ్లకైనా డగౌట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హెడ్కోచ్ పాంటింగ్ తెలిపాడు.
- బుమ్రా : వెన్నునొప్పి కారణంగా టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రా.. గత ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్కూ ఆడటం లేదు. అతడి స్థానంలో ముంబయి జట్టు జోఫ్రా ఆర్చర్ సేవలను వినియోగించుకోనుంది.
- శ్రేయస్ అయ్యర్ : వెన్ను గాయం కారణంగా కోల్కతా జట్టుకు దూరమైన శ్రేయస్ స్థానంలో.. నితీష్ రాణాను తాత్కాలిక కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్.. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు.
- జానీ బెయిర్స్టో : ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటరైన బెయిర్స్టో కాలికి సర్జరీ కారణంగా ఈ ఐపీఎల్కు దూరమవుతున్నాడు. దీంతో పంజాబ్ జట్టు అతడి స్థానంలో మాథ్యూ షార్ట్ను తీసుకుంది.
- ప్రసిధ్ కృష్ణ : వెన్ను నొప్పితో రాజస్థాన్ పేసర్ ప్రసిద్ కృష్ణ ఆ జట్టుకు దూరమవుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో సందీప్ శర్మను జట్టు ఎంపిక చేసుకుంది.
- రజత్ పటిదార్ : గతేడాది అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రజత్.. మడమ గాయం కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మిడిల్ ఆర్డర్ ఆర్సీబీ బ్యాటర్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం ఉన్నాడు.
- ముఖేశ్ చౌదరి : చెన్నై యువ పేసర్ ముఖేశ్ చౌదరి.. ఈ సీజన్కు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడు త్వరగా కోలుకొని జట్టులోకి రావాలని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించాడు.
- జోష్ హేజిల్వుడ్ : గాయం కారణంగా ఇటీవల బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి దూరమైన జోష్ హేజిల్వుడ్.. ఈ ఐపీఎల్ సీజన్ తొలి అర్ధభాగానికి దూరమవుతున్నాడు. ఆర్సీబీ పేస్ దళంలో కీలక బౌలర్ అయిన హేజిల్వుడ్.. గత ఏడాది 20 వికెట్లు పడగొట్టాడు.
- కైల్ జేమీసన్ : న్యూజిలాండ్ పేసర్ అయిన జేమీసన్.. వెన్ను గాయం కారణంగా గత 9 నెలలుగా ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో చెన్నై జట్టు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ సిసిందాతో ఒప్పందం చేసుకుంది.
- గ్లెన్ మాక్స్వెల్: మోకాలి గాయం కారణంగా గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. భారత్తో వన్డే సిరీస్లోనూ జట్టుతోపాటు ఉన్నప్పటికీ రెండు వన్డేలు ఆడలేదు. ఈ క్రమంలో ఆసీస్ కోచ్ కూడా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదని తెలిపాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు