Sanju-Pant: సంజూకి బదులు పంత్కు అవకాశాలు.. కారణమిదేనా..? వారిద్దరి గణాంకాలు ఇలా..?
ఇప్పుడు కేవలం ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్ల గురించే చర్చ. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు..? శాంసన్పై వివక్ష ఎందుకనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లోకి ముందే అడుగు పెట్టినా.. అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం రిషభ్ పంత్ కంటే సంజూ శాంసన్ వెనుకడుగే. ఫామ్ లేక ఇలా జరిగిందా అంటే.. కాదనే సమాధానం వస్తుంది. పంత్ కంటే సంజూదే బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువ. మరీ ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు, టీ20లు) గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సంజూ శాంసన్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనేలేదు.
రిషభ్ పంత్ 2017లో టీమ్ఇండియాకు ఎంపిక కాగా.. పంత్కు రెండేళ్ల ముందు అంటే 2015లోనే సంజూ భారత జెర్సీని ధరించాడు. ఇద్దరూ మొదట టీ20ల్లోనే అరంగేట్రం చేశారు. కానీ రిషభ్ పంత్ టెస్టుల్లోకి అడుగు పెట్టగా.. సంజూకి అవకాశం దక్కలేదు. కెరీర్ ఆరంభంలో రిషభ్ పంత్ కీలక ఇన్నింగ్స్లతో అదరగొట్టాడు. టెస్టుల్లోనూ దూకుడైన ఆటతీరుతో అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ గడ్డపైనా సెంచరీ (125*) సాధించి ఔరా అనిపించాడు. అలాగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మైదానాల్లోనూ విజృంభించాడు. కానీ గత కొన్ని రోజులుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం పంత్ పూర్తిగా విఫలం కావడం విమర్శలపాలైంది.
కారణమదేనా..?
ఒకే ఏడాదిలో జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్.. పలు ద్వైపాక్షిక సిరీస్లను పరిగణనలోకి తీసుకొంటే పంత్తో పోలిస్తే సంజూకి అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ శైలి అని నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే పంత్ లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్ కాగా.. సంజూ కుడిచేతి వాటం కలిగిన ఆటగాడు. ప్రస్తుతం ఉన్న భారత మిడిలార్డర్లో లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ పంత్ మాత్రమే. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎడమ చేతివాటం అయినా.. వీరంతా పూర్తిస్థాయి బ్యాటర్లు కాదు. అంతేకాకుండా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపైనే పేస్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కొని పరుగులు సాధించడం కూడానూ పంత్ వైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.
గత 10 మ్యాచుల్లో వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉందంటే..?
* గత పది వన్డేల్లో రిషభ్ పంత్ ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలతో 336 పరుగులు చేశాడు. అదే సమయంలో సంజూ శాంసన్ ఒక్క హాఫ్ సెంచరీ సాయంతో 284 పరుగులు చేశాడు. కానీ యావరేజ్ మాత్రం సంజూదే అధికం కావడం గమనార్హం.
* ఇక టీ20ల విషయానికొస్తే.. సంజూ శాంసన్ ఒక్క అర్ధశతకంతో 223 పరుగులు చేశాడు. కానీ రిషభ్ పంత్ మాత్రం దారుణంగా విఫలం కావడం విశేషం. కేవలం నాలుగు సార్లు మాత్రమే డబుల్ డిజిట్ సాధించాడు. మొత్తం కలిపి 89 పరుగులు చేశాడు. అందుకే పంత్ను తప్పించి సంజూకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అభిమానుల నుంచి వస్తోంది.
మెగా టోర్నీలపై ప్రభావం..
పంత్కు బదులు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్న సంజూ శాంసన్ను తీసుకోవాలనే డిమాండ్లూ వస్తున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్తోపాటు ఆసియా కప్ జరగనున్నాయి. వీరిద్దరి స్థానాలపై జట్టు యాజమాన్యం తేల్చకపోతే మెగా టోర్నీల్లో భారత్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావంపడే అవకాశం లేకపోలేదు. గత టీ20 ప్రపంచకప్లో దినేశ్ కార్తిక్పై భారీ అంచనాలు పెట్టుకొని పంత్ను తుది జట్టులోకి తీసుకోలేదు. ఆసీస్ గడ్డపై బాగా ఆడే అతడిని పక్కన పెట్టడం కూడా పంత్ ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఉంటుందని పలువురి విశ్లేషణ. అందుకే వచ్చే మెగా టోర్నీల్లో ఎవరిని ఆడించాలనే దానిపై బీసీసీఐ క్లారిటీతో ఉండాలి.
పంత్ కెరీర్ గణాంకాలు ఇలా..
* 31 మ్యాచుల్లో 43.32 సగటుతో 2,123 పరుగులు చేశాడు. అందులో ఐదు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 159*.
* 27 వన్డేల్లో 36.52 సగటుతో 840 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 125*.
* అంతర్జాతీయ టీ20ల్లో 64 మ్యాచుల్లో 22.43 యావరేజ్తో 987 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 65. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
సంజూ కెరీర్ ఇలా..
* అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఏడేళ్లలో సంజూ కేవలం 11 వన్డేలను మాత్రమే ఆడాడు. 66 సగటుతో 330 పరుగులు సాధించాడు.
* టీ20లు.. 16 మ్యాచుల్లో 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 77 పరుగులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్