IND vs WI : సమస్యలను అధిగమించాలి.. ఆధిక్యంలోకి దూసుకెళ్లాలి!
విజయాలు సాధించే వరకు ఎలాంటి ప్రయోగాలు చేసినా అందరూ ఆమోదిస్తారు. ఒక్క పరాజయం ఎదురైతే చాలు ఇక జట్టు పనైపోయింది.. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ సరిగాలేదనే...
రాత్రి 9.30గంటలకు భారత్, విండీస్ జట్ల మధ్య మూడో టీ20
ఇంటర్నెట్ డెస్క్: విజయాలు సాధించే వరకూ ఎలాంటి ప్రయోగాలు చేసినా అందరూ ఆమోదిస్తారు. ఒక్క పరాజయం ఎదురైతే చాలు ఇక జట్టు పనైపోయింది.. బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ సరిగాలేదనే విమర్శలు చేస్తారు. అయితే టీమ్లోని సహచరులపై కెప్టెన్, యాజమాన్యం నమ్మకం ఉంచితేనే సత్ఫలితాలు వస్తాయి. ఈ విషయంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ను అనడానికేమీ లేదు. వారిద్దరూ ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడంలో ముందుంటారు. ఈ క్రమంలో మూడో టీ20లోతీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి తెలుసుకుందాం..
బ్యాటింగ్ ఆర్డర్ ఇబ్బందా..?
తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా రెండో మ్యాచ్లో కుదేలైంది. బ్యాటింగ్లో లోపాలు బయట పడ్డాయి. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య (31), రవీంద్ర జడేజా (27), రిషభ్ పంత్ (24) కాస్త బ్యాట్ను ఝులిపించడంతో 138 పరుగులైనా చేయగలిగింది. మరి ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే మాత్రం సిరీస్పైనే కాకుండా వచ్చే ప్రపంచకప్ సన్నాహాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఇవాళ జరిగే మూడో టీ20లో తప్పులను సరిదిద్దుకోవాలి. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ అవతారమెత్తాడు. మొదటి టీ20తోపాటు రెండో మ్యాచ్లోనూ ఫర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ సంగతికొస్తే.. ఫస్ట్మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ రెండో టీ20లో గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. అటు వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్ (0, 10) రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అయ్యర్ స్థానంలో దీపక్ హుడాను తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు. లోయర్ఆర్డర్లో దూకుడుగా ఆడే దినేశ్ కార్తిక్ను అడ్డుకోవడంలో విండీస్ బౌలర్లు విజయవంతమయ్యారు. తొలి మూడు స్థానాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్ బాగానే ఉంది కానీ..
టీమ్ఇండియా బౌలింగ్ పరంగా బాగానే ఉంది కానీ.. కీలక సమయంలో ఆఖరి ఓవర్ను యువ బౌలర్కు ఇవ్వడం సమంజసం కాదనే వాదనా వినిపించింది. ప్రయోగాల్లో భాగమైనప్పటికీ సిరీస్ కైవసం చేసుకున్న తర్వాత ఇలాంటివి చేస్తే బాగుంటుందని పలువురు మాజీల అభిప్రాయం. రెండో టీ20 మ్యాచ్నే ఉదాహరణగా తీసుకుంటే.. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి పది పరుగులు అవసరమైన వేళ పెద్దగా అనుభవం లేని అవేశ్ ఖాన్ చేతికి రోహిత్ బంతినిచ్చాడు. అప్పటికీ భువనేశ్వర్ కుమార్కు ఇంకా రెండు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఒత్తిడిని తట్టుకోలేని అవేశ్ రెండు బంతుల్లోనే మ్యాచ్ను విండీస్కు అప్పగించాడు. బౌలింగ్లో పెద్దగా మార్పులు అవసరం లేకపోయినా.. మ్యాచ్ ఫలితం తేలే ఓవర్లను అనుభజ్ఞులకు ఇస్తేనే ఉత్తమంగా ఉంటుంది.
వారిని తక్కువ అంచనా వేయొద్దు..
పొట్టి ఫార్మాట్ అంటేనే ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేం. అసలే విండీస్ ఆటగాళ్లకు టీ20లు బాగా అలవాటు. అంతేకాకుండా గత కొన్ని మ్యాచుల్లో చివరి వరకు వచ్చి ఓటమిపాలైన సందర్భాలు ఉన్నాయి. దీంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు విండీస్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో రెండో టీ20లో ఆ జట్టు బౌలర్ మెకాయ్ తొలి బంతి నుంచే టీమ్ఇండియాపై దాడి చేశాడు. అందుకే విండీస్ బౌలర్లను ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్, డేవన్ థామస్, కేల్ మయేర్స్ ఫామ్లో ఉన్నారు. పూరన్, హెట్మయేర్ కూడా ఫామ్లోకి వస్తే మాత్రం విండీస్ను ఆపడం కష్టతరమే. లోయర్ ఆర్డర్లో రోవ్మన్ పావెల్, ఒడియన్ స్మిత్తో కూడిన బ్యాటింగ్ దళం విండీస్ సొంతం. అందుకే భారత బౌలర్లూ బహుపరాక్.
పిచ్ పరిస్థితేంటి..?
మూడో మ్యాచ్ జరిగే సెయింట్ కిట్స్లోని వార్నర్ పార్క్ మైదానం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సహకారం అందిస్తుంది. నిన్న రెండో టీ20లోనూ తొలుత బౌలింగ్ అనుకులంగా అనిపించినా.. క్రీజ్లో కుదురుకుంటే మాత్రం పరుగులు రాబట్టవచ్చని బ్రాండన్ కింగ్ ఇన్నింగ్సే నిరూపించింది. భారత జట్టులోనూ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్కే పరిమితమైన సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
జట్లు వివరాలు (అంచనా) :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్
విండీస్: కేల్ మయేర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్, హట్మయేర్, డేవన్ థామస్, జాసన్ హోల్డర్, అకీల్ హోసీన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, మెకాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు