Ashes Series: యాషెస్ సిరీస్.. కీలకంగా మారే అంశాలు ఇవేనా?
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ టెస్టు మజాను అందించడానికి మరో సిరీస్ సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ (Ashes Series) శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ వేదికగా మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ (Ashes Series) ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో ఇరు జట్లకూ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో సీజన్ కూడా మొదలుకానుంది. గత యాషెస్ సిరీస్ను ఆసీస్ గెలుచుకోగా.. సొంతగడ్డపై తిరిగి దానిని దక్కించుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడు కీలకాంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
బ్రాడ్, అండర్సన్ VS వార్నర్, లబుషేన్, హెడ్
యాషెస్ సిరీస్లో ఆసీస్ బ్యాటర్లకు ఇంగ్లాండ్ బౌలర్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగడం ఖాయం. సొంతమైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకోవడం అంత సులువేం కాదు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్వుడ్ పేస్ను ఎదుర్కొని పరుగులు సాధించాల్సి ఉంటుంది. యాషెస్ అనగానే డేవిడ్ వార్నర్, లబుషేన్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడేస్తారు. భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్ కూడా ఫామ్లో ఉండటం ఆసీస్కు కలిసొచ్చేదే. అయితే, గత 26 టెస్టుల్లో వార్నర్ను 14సార్లు ఔట్ చేసిన రికార్డు స్టువర్ట్ బ్రాడ్కు ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘బజ్బాల్’ క్రికెట్
ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ ఫలితాలను రాబడుతోంది. ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించేందుకు ‘బజ్బాల్’ క్రికెట్తో దూసుకొచ్చింది. కెప్టెన్ బెన్స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ప్రత్యర్థి బౌలింగ్కు భయపడకుండా ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టడమే ఈ రకం క్రికెట్ స్పెషాలిటీ. అయితే, ఆసీస్ కూడా ఈ విధంగా ఆడటంలో ముందుంటోంది. స్కాట్ బోలాండ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ వంటి బౌలర్లను తట్టుకుని ఇంగ్లాండ్ బ్యాటర్లు ‘బజ్బాల్’ క్రికెట్ ఏమేరకు ఆడతారో వేచిచూడాలి.
స్పిన్ తిప్పేదెవరు?
అందరికీ గుర్తుండిపోయే ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ నమోదైన సిరీస్ కూడా యాషెస్ కావడం విశేషం. ఇంగ్లాండ్పై ఆధిపత్యం ప్రదర్శించడంలో ఆసీస్కు స్పిన్ కూడా కీలకంగా మారింది. వార్న్ తర్వాత బ్రాడ్ హాగ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు నాథన్ లైయన్ ప్రత్యర్థులను కకావికలం చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో భారత్ నడ్డి విరచడంలో లైయన్ కీలక పాత్ర పోషించాడు. పేస్కు సహకరించిన ఈ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీశాడు. అతడితోపాటు టాడ్ మర్ఫీ ఉన్నప్పటికీ.. తుది జట్టులో ఒకరికే అవకాశం ఉండొచ్చు. మరోవైపు ఇంగ్లాండ్కు గాయం కారణంగా దూరమైన జాక్ లీచ్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీ వచ్చాడు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మరీ జట్టులోకి రావడం గమనార్హం. యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను వదులుకోవడం ఇంగ్లాండ్కు నష్టం చేస్తుందనే వాదనా ఉంది. మరి స్పిన్ విభాగంలో ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో..?
జట్లు (అంచనా)
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్
ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్/బోలాండ్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లైయన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన