Ashes Series: యాషెస్ సిరీస్.. కీలకంగా మారే అంశాలు ఇవేనా?
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ టెస్టు మజాను అందించడానికి మరో సిరీస్ సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ (Ashes Series) శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లాండ్ వేదికగా మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ (Ashes Series) ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో ఇరు జట్లకూ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో సీజన్ కూడా మొదలుకానుంది. గత యాషెస్ సిరీస్ను ఆసీస్ గెలుచుకోగా.. సొంతగడ్డపై తిరిగి దానిని దక్కించుకోవాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మూడు కీలకాంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
బ్రాడ్, అండర్సన్ VS వార్నర్, లబుషేన్, హెడ్
యాషెస్ సిరీస్లో ఆసీస్ బ్యాటర్లకు ఇంగ్లాండ్ బౌలర్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగడం ఖాయం. సొంతమైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను అడ్డుకోవడం అంత సులువేం కాదు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్వుడ్ పేస్ను ఎదుర్కొని పరుగులు సాధించాల్సి ఉంటుంది. యాషెస్ అనగానే డేవిడ్ వార్నర్, లబుషేన్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడేస్తారు. భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్ కూడా ఫామ్లో ఉండటం ఆసీస్కు కలిసొచ్చేదే. అయితే, గత 26 టెస్టుల్లో వార్నర్ను 14సార్లు ఔట్ చేసిన రికార్డు స్టువర్ట్ బ్రాడ్కు ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘బజ్బాల్’ క్రికెట్
ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ ఫలితాలను రాబడుతోంది. ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించేందుకు ‘బజ్బాల్’ క్రికెట్తో దూసుకొచ్చింది. కెప్టెన్ బెన్స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ప్రత్యర్థి బౌలింగ్కు భయపడకుండా ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టడమే ఈ రకం క్రికెట్ స్పెషాలిటీ. అయితే, ఆసీస్ కూడా ఈ విధంగా ఆడటంలో ముందుంటోంది. స్కాట్ బోలాండ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ వంటి బౌలర్లను తట్టుకుని ఇంగ్లాండ్ బ్యాటర్లు ‘బజ్బాల్’ క్రికెట్ ఏమేరకు ఆడతారో వేచిచూడాలి.
స్పిన్ తిప్పేదెవరు?
అందరికీ గుర్తుండిపోయే ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ నమోదైన సిరీస్ కూడా యాషెస్ కావడం విశేషం. ఇంగ్లాండ్పై ఆధిపత్యం ప్రదర్శించడంలో ఆసీస్కు స్పిన్ కూడా కీలకంగా మారింది. వార్న్ తర్వాత బ్రాడ్ హాగ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు నాథన్ లైయన్ ప్రత్యర్థులను కకావికలం చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో భారత్ నడ్డి విరచడంలో లైయన్ కీలక పాత్ర పోషించాడు. పేస్కు సహకరించిన ఈ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీశాడు. అతడితోపాటు టాడ్ మర్ఫీ ఉన్నప్పటికీ.. తుది జట్టులో ఒకరికే అవకాశం ఉండొచ్చు. మరోవైపు ఇంగ్లాండ్కు గాయం కారణంగా దూరమైన జాక్ లీచ్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీ వచ్చాడు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మరీ జట్టులోకి రావడం గమనార్హం. యువ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను వదులుకోవడం ఇంగ్లాండ్కు నష్టం చేస్తుందనే వాదనా ఉంది. మరి స్పిన్ విభాగంలో ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధిస్తారో..?
జట్లు (అంచనా)
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్
ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్/బోలాండ్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లైయన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య