ICC: సెహ్వాగ్ సహా మరో ఇద్దరికి ఐసీసీ అత్యున్నత గౌరవం
వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది.
ICC Hall of Fame| దుబాయ్: భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరో ఇద్దరికి అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్(ICC Hall of Fame)లోకి వీరేంద్ర సెహ్వాగ్, భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీకి చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది.
వీరేంద్ర సెహ్వాగ్కు భారత క్రికెట్లో ప్రత్యేక స్థానం ఉంది. తనదైన దూకుడైన ఆటతీరుతో టీమ్ఇండియా విజయంలో అనేక సందర్భాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్కప్లోనూ అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మొత్తం 104 టెస్టుల్లో 8, 586 పరుగులు చేసిన సెహ్వాగ్.. 251 వన్డేల్లో 8, 273 పరుగులు, 19 టీ20ల్లో 394 రన్స్ చేశాడు. తనను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2023కి ఎంపిక చేయడంపై సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశాడు. తనను ఎంపిక చేసిన ఐసీసీకి, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పాడు. అత్యంత ఇష్టమైన క్రికెట్లోనే తన జీవితంలో ఎక్కువ కాలం గడిపినందుకు తనెంతో ధన్యుడినని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తనతో ఆడిన వ్యక్తులు, తన కోసం నిస్వార్థంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు.
మహిళా క్రికెట్కే గర్వకారణం: డయానా ఎడుల్జీ
భారత్ నుంచి తొలి మహిళా క్రికెటర్గా హాల్ ఆఫ్ ద ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై దిగ్గజ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ హర్షం వ్యక్తంచేశారు. ఈ అత్యున్నత గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు ఐసీసీ, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ, పురుష క్రికెటర్ల గెలాక్సీలో చేరిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ క్షణం తనకు పాటు తన కుటుంబ సభ్యులకే కాదు.. బీసీసీఐ, భారత మహిళా క్రికెట్కు గర్వకారణమని పేర్కొన్నారు.
ఐసీసీకి థాంక్స్.. అరవింద డిసిల్వా
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కడంపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డిసిల్వా సంతోషం వ్యక్తం చేశారు. తనకు గొప్ప గౌరవాన్ని కల్పించిన ఐసీసీకి థాంక్స్ చెప్పారు. ఈ క్షణం తన హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘనత తన క్రికెట్ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన అంకితభావం, త్యాగం, ప్రేమకు దక్కిన ప్రశంస అన్నారు. తనను కుటుంబ సభ్యులు, స్నేహితులు విజయంవైపు నడిపించేందుకు ఎంతగానో ప్రోత్సహించారని, కుటుంబ సభ్యుల తిరుగులేని మద్దతు, త్యాగానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు