ICC: సెహ్వాగ్ సహా మరో ఇద్దరికి ఐసీసీ అత్యున్నత గౌరవం
వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది.
ICC Hall of Fame| దుబాయ్: భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరో ఇద్దరికి అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్(ICC Hall of Fame)లోకి వీరేంద్ర సెహ్వాగ్, భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీకి చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది.
వీరేంద్ర సెహ్వాగ్కు భారత క్రికెట్లో ప్రత్యేక స్థానం ఉంది. తనదైన దూకుడైన ఆటతీరుతో టీమ్ఇండియా విజయంలో అనేక సందర్భాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్కప్లోనూ అతడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మొత్తం 104 టెస్టుల్లో 8, 586 పరుగులు చేసిన సెహ్వాగ్.. 251 వన్డేల్లో 8, 273 పరుగులు, 19 టీ20ల్లో 394 రన్స్ చేశాడు. తనను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2023కి ఎంపిక చేయడంపై సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశాడు. తనను ఎంపిక చేసిన ఐసీసీకి, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పాడు. అత్యంత ఇష్టమైన క్రికెట్లోనే తన జీవితంలో ఎక్కువ కాలం గడిపినందుకు తనెంతో ధన్యుడినని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తనతో ఆడిన వ్యక్తులు, తన కోసం నిస్వార్థంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు.
మహిళా క్రికెట్కే గర్వకారణం: డయానా ఎడుల్జీ
భారత్ నుంచి తొలి మహిళా క్రికెటర్గా హాల్ ఆఫ్ ద ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై దిగ్గజ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ హర్షం వ్యక్తంచేశారు. ఈ అత్యున్నత గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు ఐసీసీ, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ, పురుష క్రికెటర్ల గెలాక్సీలో చేరిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ క్షణం తనకు పాటు తన కుటుంబ సభ్యులకే కాదు.. బీసీసీఐ, భారత మహిళా క్రికెట్కు గర్వకారణమని పేర్కొన్నారు.
ఐసీసీకి థాంక్స్.. అరవింద డిసిల్వా
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కడంపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డిసిల్వా సంతోషం వ్యక్తం చేశారు. తనకు గొప్ప గౌరవాన్ని కల్పించిన ఐసీసీకి థాంక్స్ చెప్పారు. ఈ క్షణం తన హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘనత తన క్రికెట్ ప్రయాణాన్ని తీర్చిదిద్దిన అంకితభావం, త్యాగం, ప్రేమకు దక్కిన ప్రశంస అన్నారు. తనను కుటుంబ సభ్యులు, స్నేహితులు విజయంవైపు నడిపించేందుకు ఎంతగానో ప్రోత్సహించారని, కుటుంబ సభ్యుల తిరుగులేని మద్దతు, త్యాగానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్