Shreyas - Gill: విమర్శలను నిజం చేస్తున్న గిల్.. అయ్యర్... ఇదే ఆఖరి మ్యాచా?
కీలక స్థానాల్లో బ్యాటింగ్కు వస్తూ.. జట్టును ముందుండి నడిపించాల్సిన ఇద్దరు బ్యాటర్లు ఇప్పుడు తమ స్థానాలనే ప్రమాదంలోకి నెట్టుకున్నారు.
సీనియర్ల స్థానంలో వచ్చారు... సత్తా చాటుతారనుకుంటే... ఒకరేమో పెవిలియన్కు వచ్చేద్దామా అన్నట్లు ఆడుతున్నాడు. మరొకరు కాసేపు బాగానే ఆడినా చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. టీమ్ ఇండియాను ఫాలో అయ్యేవాళ్లు ఈ ఇద్దరూ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు వాళ్ల స్థానాల్లోకి రావడానికి కొత్త కుర్రాళ్లు రెడీగా ఉన్నా... ఆ భయమే గిల్ - అయ్యర్లో కనిపించడం లేదు.
ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె జట్టులో ఉండటంతో మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్కు (Shreyas Iyer) అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చినా ఒకట్రెండు మ్యాచులే. ఆ సీనియర్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో గిల్, అయ్యర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మిడిలార్డర్లో జట్టును కాచుకుంటారని ఆశిస్తే తరచూ విఫలం కావడం అభిమానులకు రుచించడం లేదు. దీంతో ‘ఈ టెస్టులో ఆడకపోతే ఇదే ఆఖరు’, ‘మీరు పక్కకు తప్పుకొని కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వండి’ అని అభిమానులు అనే పరిస్థితి వచ్చింది.
వికెట్ పారేసుకుని...
శ్రేయస్ విషయానికొస్తే... ఇంగ్లాండ్తో (IND vs ENG) తొలి టెస్టులో 35, 13 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 27 పరుగులు. గత 11 ఇన్నింగ్స్ల్లో అతడి నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ధాటిగా ఆరంభిస్తున్నా... వాటిని అర్ధ శతకాలుగా, సెంచరీలుగా మలచలేకపోతున్నాడు. టెస్టుల్లో అతి ముఖ్యమైన ఓపిక అతనిలో కనిపించడం లేదు. అందుకే వికెట్ పారేసుకుంటున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు.
ఎక్కడా జి‘గిల్’
‘మూడో స్థానానికొస్తా... నేనేంటో చూపిస్తా’ అంటూ ఓపెనర్ ప్లేస్ను వదిలి వన్ డౌన్కి వచ్చాడు గిల్ (Shubman Gill). అలా కిందకొచ్చిన శుభ్మన్ బ్యాటింగ్ ప్రదర్శన ఇంకా కిందకు పడుతూనే ఉంది. గత ఐదు టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 36. తాజాగా వైజాగ్ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్ సెంచరీ చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. నిజానికి ఈ మ్యాచ్ ముందు కూడా గిల్కు అవకాశం ఇవ్వడం అవసరమా? అనే వ్యాఖ్యలు వినిపించాయి.
పేస్ పిచ్ల మీద ఇబ్బందిపడతాడు... స్పిన్ను ఆటాడుకుంటాడన్న శ్రేయస్ ఉసూరుమనిపిస్తుంటే... అదే స్పిన్కు దాసోహమంటున్నాడు గిల్. ఇద్దరు ఇండియన్ బ్యాటర్లు ఇలా స్పిన్ను ఎదుర్కోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో అవకాశం వచ్చి... ఇద్దరూ ఇలానే నిరాశపరిస్తే... ఆ స్థానాలను చేజేతులా కొత్త వాళ్లకు అప్పగించినట్లు అవుతుంది. మరి రాణించి జట్టులో ఉంటారో? లేక బెంచ్కే పరిమితమవుతారో చూడాలి.
ఆ ఇద్దరు వీరేనా?
ఫస్ట్ డౌన్ వద్దు ఓపెనర్గా వెళ్తా అని గిల్ అనుకుంటే... ఆ స్థానాన్ని ‘వదిలేదే లే’ అని శతకంతో చెప్పకనే చెప్పాడు జైస్వాల్. కాబట్టి గిల్కు ఆ ప్లేస్లో ఛాన్సే లేదు. ఇక అయ్యర్ను పక్కన పెడదాం అంటే సర్ఫరాజ్ ఖాన్ రెడీగా ఉన్నాడు. విశాఖ టెస్టులో దక్కాల్సిన మెయిడెన్ క్యాప్ రాజ్ కోట్లో అందుకునే అవకాశం ఉంది. మిగిలిన మూడు టెస్టులకు ఈ వారంలో జట్టును అనౌన్స్ చేస్తారు. ఆ జాబితా వస్తే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!