Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
క్రికెట్ అంటే ఫన్నీ గేమ్ అనేది ఊరికే అనలేదు. ఈ గేమ్లో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు నవ్వులు తెప్పిస్తే మరికొన్ని అయ్యో పాపం అనుకునేలా చేస్తాయి...
క్రికెట్లో అప్పుడప్పుడు సరదా ఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని నవ్వులు తెప్పిస్తే.. మరికొన్ని అయ్యో పాపం అనుకునేలా చేస్తాయి. అందుకు ప్రధాన కారణం దురదృష్టం వెంటాడటమే. తాజాగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్లో హెన్రీ నికోల్స్ ఇలాగే ఔటయ్యాడు. అతడు ఆడిన షాట్కు బంతి వెళ్లి నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ఆటగాడి బ్యాట్కు తగలడంతో అది వెళ్లి నేరుగా ఫీల్డర్ చేతుల్లో పడింది. అలా అనూహ్యరీతిలో ఔటై నిరాశతో వెనుదిరిగాడు. అయితే, ఇంతకుముందు కూడా ఆటలో ఇలాంటి విచిత్రమైన ఔట్లు చోటుచేసుకున్నాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ చూద్దాం..
దెబ్బ తగిలించుకోవద్దని మిస్బా..
పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మిస్బాఉల్ హక్ 2007లో భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలి టెస్టులో ఎవరూ ఊహించని రీతిలో ఔటయ్యాడు. దిల్లీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో పాక్ తొలి ఇన్నింగ్స్లో మిస్బా (82) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా పాయింట్ దిశగా షాట్ ఆడి సింగిల్ కోసం పరుగెత్తాడు. వెంటనే స్పందించిన దినేశ్ కార్తీక్ బంతిని నాన్స్ట్రైకర్ వికెట్లవైపు విసిరాడు. అయితే, మిస్బా క్రీజు సమీపంలోకి రాగానే ఆ బంతి తనకు తగులుతుందేమోనని భావించి గాలిలోకి ఎగురుతూ క్రీజులో అడుగుపెట్టాడు. అంతలోపే బంతి వికెట్లకు తాకి నిరాశతో వెనుదిరిగాడు.
బంతి వికెట్లకు తాకుతుందని గూచ్..
ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రహమ్ గూచ్ 1990ల్లో మేటి ఆటగాడు. అయితే, 1993లో ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో బంతిని చేతితో పక్కకు నెట్టి ఔటయ్యాడు. 511 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్గా వచ్చిన గూచ్ (133) గొప్పగా పోరాడాడు. ఆ సమయంలో హ్యూస్ బౌలింగ్లో గూచ్ ఒక బంతిని డిఫెన్స్ చేయగా అది క్రీజులోనే స్టెప్ తీసుకొని వికెట్ల మీదకు పడేలా అనిపించింది. దీంతో వెంటనే స్పందించిన ఇంగ్లిష్ బ్యాటర్ ఆ బంతిని తన చేతితో పక్కకు పడేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు.
త్రోను అడ్డుకొని ఇంజమామ్..
2006లో టీమ్ఇండియా పాక్ పర్యటనలో పెషావర్లో తొలి వన్డే ఆడింది. భారత్ 329 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించగా పాకిస్థాన్ ఛేదనకు దిగింది. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా క్రీజులోకి వచ్చిన ఇంజమామ్ 16 పరుగుల వద్ద ఉండగా శ్రీశాంత్ బౌలింగ్లో మిడ్ ఆఫ్లోకి బంతిని కొట్టి క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా బంతిని అందుకొని వికెట్లకేసి విసిరాడు. అయితే, అప్పటికే క్రీజు బయట ఉన్న ఇంజమామ్ ఆ బంతిని బ్యాట్తో అడ్డుకున్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్లు మాట్లాడుకొని ఫీల్డింగ్కు అడ్డుపడ్డాడనే కారణంతో ఔటిచ్చారు.
బంతి బౌండరీ అనుకొని అజర్ అలీ..
అబుదాబి వేదికగా 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ అజర్ అలీ(64) రెండో ఇన్నింగ్స్లో విచిత్రమైన పరిస్థితుల్లో ఔటయ్యాడు. అతడు సిడిల్ బౌలింగ్లో గల్లీ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అది బౌండరీకి వెళ్లినట్లే వెళ్లి కాస్త దూరంలో ఆగిపోయింది. దీంతో అజర్ ఆ బంతి బౌండరీకి వెళ్లి ఉంటుందని భావించి పిచ్ మధ్యలోకి వెళ్లి నాన్ స్ట్రైకర్తో మాట్లాడుతున్నాడు. అయితే, మిచెల్ స్టార్క్ బంతిని అందుకొని కీపర్ టిమ్పైన్కు విసరడంతో స్టంప్స్ను పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అజర్కు ఏం జరిగిందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యాడు. తర్వాత అసలు విషయం తెలిసి నిరాశతో పెవిలియన్ చేరాడు.
నికోల్స్ లాగే ఆండ్రూ సైమండ్స్..
ఆస్ట్రేలియా దివంగత ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ 2006లో శ్రీలంకతో ఆడిన వీబీ సిరీస్ ఆరంభ మ్యాచ్లో హెన్రీ నికోల్స్ మాదిరే ఔటయ్యాడు. సైమండ్స్ (66) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ముబారక్ వేసిన బంతిని స్ట్రైట్డ్రైవ్ ఆడాడు. దీంతో బంతి నాన్స్ట్రైకింగ్ ఎండ్లో నిల్చున్న మైఖేల్ క్లార్క్ శరీరానికి తాకి మిడ్ వికెట్లో ఉన్న తిలకరత్నె దిల్షాన్ చేతిలో పడింది. ఊహించని విధంగా ఔటవ్వడంతో సైమండ్స్ సైతం నవ్వుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం