Top 5 Richest leagues: భారత టీ20 లీగ్ @ 2.. మిగతా నాలుగేవో తెలుసా?
ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్ వేరు. అవి ఏ దేశంలో జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు...
ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్ వేరు. ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు రావడంతో గ్రామీణ ప్రాంతాలకు అవి సులభంగా చేరుతున్నాయి. ఈ క్రమంలో టోర్నీలు/లీగ్ రేటింగులు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బ్రాండ్ వాల్యూ ఊహకందని రీతిలో పెరిగిపోతోంది. తాజాగా భారత టీ20 లీగ్.. ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడా ఈవెంట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో టాప్-5లో ఉన్న మిగతా లీగ్ విశేషాలు తెలుసుకుందాం.
నేషనల్ ఫుట్బాల్ లీగ్
(Photo: NFL Twitter)
అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ మొత్తం 32 టీమ్లను కలిగి ఉంది. ఇది ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు సుమారు 5 నెలల పాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన లీగ్గా దీనికి పేరుంది. 1920లో తొలుత అమెరికన్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా ప్రారంభమైన ఈ లీగ్ 1922లో నేషనల్ ఫుట్బాల్ లీగ్గా మారింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రస్తుతం ప్రసారదారులు చెల్లించే సొమ్ము అక్షరాల రూ.131.9 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్గా ఇది నిలిచింది.
భారత టీ20 లీగ్
(Photo: Getty Images)
ఈ జాబితాలో భారత టీ20 లీగ్ తాజాగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నడిచే ఈ లీగ్ 2008లో ప్రారంభమవ్వగా ఇటీవలే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 10 జట్లతో కొనసాగుతోన్న ఈ టీ20 లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఈవెంట్గా పేరుగాంచింది. ఇక రాబోయే ఐదేళ్లకు తాజాగా నిర్వహించిన ప్రసార హక్కుల వేలంలో బీసీసీఐ ఖజానాకు రూ.48,390 కోట్ల భారీ ఆదాయం దక్కింది. దీంతో ఇది ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్వాల్యూ కలిగిన క్రీడా లీగ్గా అవతరించింది. 2023 నుంచి 2027 వరకు ఒక్కో మ్యాచ్కు బీసీసీఐకి ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.107.5 కోట్లు.
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్
(Photo: EPL Twitter)
ఇక అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్గా ఇంగ్లాండ్లో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 1992లో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం 20 క్లబ్లు ఆడతాయి. ఏటా ఆగస్టు నుంచి మే వరకు పది నెలల పాటు ఫుట్బాల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. ఒక్కో టీమ్ ఇంటా, బయటా రెండేసిసార్లు ఇతర జట్లతో మొత్తం 38 మ్యాచ్ల్లో తలపడతాయి. అయితే, ఇన్నాళ్లూ ఇది రెండో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఈవెంట్గా ఉండేది. తాజాగా భారత టీ20 లీగ్ దాన్ని వెనక్కినెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ లీగ్లో ప్రసారదారులు ఒక్కో మ్యాచ్కు సుమారు రూ.80 కోట్లు చెల్లిస్తారు. దీంతో ఇది మూడో అత్యధిక ఆదాయం కలిగిన లీగ్గా కొనసాగుతోంది.
మేజర్ లీగ్ బేస్బాల్
(Photo: MLB Twitter)
అమెరికాలో జరిగే మరో అతిపెద్ద క్రీడా ఈవెంట్.. మేజర్ లీగ్ బేస్బాల్. ఇందులో మొత్తం 30 జట్లు పోటీపడుతుంటాయి. అందులో 15 జట్లు నేషనల్ లీగ్ నుంచి, మరో 15 జట్లు అమెరికన్ లీగ్ నుంచి వస్తాయి. నేషనల్ లీగ్ అనేది 1876లో ప్రారంభమవ్వగా.. అమెరికన్ లీగ్ 1901లో ఏర్పాటైంది. అయితే, 1903లోనే ఈ రెండు సంస్థలు నేషనల్ అగ్రిమెంట్ చేసుకున్నా 2000 సంవత్సరం వరకు లీగల్గా వేర్వేరుగానే ఉన్నాయి. ఇది మేజర్ లీగ్ బేస్బాల్గా మారినప్పటి నుంచి మంచి ప్రాచుర్యం లభించింది. దీంతో అతిగొప్ప క్రీడా లీగ్ల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.72.7 కోట్లు. దీంతో ఇది అత్యంత ఖరీదైన నాలుగో బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడా లీగ్గా నిలిచింది.
బుండెస్లిగా
(Photo: Bundesliga Twitter)
ఇక ఈ జాబితాలో ఐదో అత్యంత విలువైన లీగ్గా జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్ బుండెస్లిగా నిలిచింది. 1963లో ప్రారంభమైన ఈ లీగ్లో మొత్తం 18 జట్లు పోటీపడతాయి. ఇది కూడా ఏటా ఆగస్టు నుంచి మే వరకు జరుగుతుంది. ఇది యూరప్లోనే కాకుండా మిగతా దేశాల్లోనూ మంచి ఆదరణ కలిగిన లీగ్గా ఎదిగింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రసారదారులు చెల్లించే మొత్తం సుమారు రూ.30 కోట్లు. దీంతో ఇది ఐదో ఖరీదైన లీగ్గా పేరుగాంచింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా