Top 5 Richest leagues: భారత టీ20 లీగ్ @ 2.. మిగతా నాలుగేవో తెలుసా?
ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్ వేరు. అవి ఏ దేశంలో జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు...
ప్రపంచంలో ఎన్ని రకాల వినోదాలున్నా క్రీడలకు ఉండే క్రేజ్ వేరు. ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులు రావడంతో గ్రామీణ ప్రాంతాలకు అవి సులభంగా చేరుతున్నాయి. ఈ క్రమంలో టోర్నీలు/లీగ్ రేటింగులు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బ్రాండ్ వాల్యూ ఊహకందని రీతిలో పెరిగిపోతోంది. తాజాగా భారత టీ20 లీగ్.. ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడా ఈవెంట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో టాప్-5లో ఉన్న మిగతా లీగ్ విశేషాలు తెలుసుకుందాం.
నేషనల్ ఫుట్బాల్ లీగ్
(Photo: NFL Twitter)
అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ మొత్తం 32 టీమ్లను కలిగి ఉంది. ఇది ఏటా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు సుమారు 5 నెలల పాటు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన లీగ్గా దీనికి పేరుంది. 1920లో తొలుత అమెరికన్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా ప్రారంభమైన ఈ లీగ్ 1922లో నేషనల్ ఫుట్బాల్ లీగ్గా మారింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రస్తుతం ప్రసారదారులు చెల్లించే సొమ్ము అక్షరాల రూ.131.9 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్గా ఇది నిలిచింది.
భారత టీ20 లీగ్
(Photo: Getty Images)
ఈ జాబితాలో భారత టీ20 లీగ్ తాజాగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నడిచే ఈ లీగ్ 2008లో ప్రారంభమవ్వగా ఇటీవలే 15 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 10 జట్లతో కొనసాగుతోన్న ఈ టీ20 లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఈవెంట్గా పేరుగాంచింది. ఇక రాబోయే ఐదేళ్లకు తాజాగా నిర్వహించిన ప్రసార హక్కుల వేలంలో బీసీసీఐ ఖజానాకు రూ.48,390 కోట్ల భారీ ఆదాయం దక్కింది. దీంతో ఇది ప్రపంచంలోనే రెండో అత్యధిక బ్రాండ్వాల్యూ కలిగిన క్రీడా లీగ్గా అవతరించింది. 2023 నుంచి 2027 వరకు ఒక్కో మ్యాచ్కు బీసీసీఐకి ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.107.5 కోట్లు.
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్
(Photo: EPL Twitter)
ఇక అత్యధిక మంది వీక్షించే క్రీడా ఈవెంట్గా ఇంగ్లాండ్లో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 1992లో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం 20 క్లబ్లు ఆడతాయి. ఏటా ఆగస్టు నుంచి మే వరకు పది నెలల పాటు ఫుట్బాల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటుంది. ఒక్కో టీమ్ ఇంటా, బయటా రెండేసిసార్లు ఇతర జట్లతో మొత్తం 38 మ్యాచ్ల్లో తలపడతాయి. అయితే, ఇన్నాళ్లూ ఇది రెండో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన ఈవెంట్గా ఉండేది. తాజాగా భారత టీ20 లీగ్ దాన్ని వెనక్కినెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఈ లీగ్లో ప్రసారదారులు ఒక్కో మ్యాచ్కు సుమారు రూ.80 కోట్లు చెల్లిస్తారు. దీంతో ఇది మూడో అత్యధిక ఆదాయం కలిగిన లీగ్గా కొనసాగుతోంది.
మేజర్ లీగ్ బేస్బాల్
(Photo: MLB Twitter)
అమెరికాలో జరిగే మరో అతిపెద్ద క్రీడా ఈవెంట్.. మేజర్ లీగ్ బేస్బాల్. ఇందులో మొత్తం 30 జట్లు పోటీపడుతుంటాయి. అందులో 15 జట్లు నేషనల్ లీగ్ నుంచి, మరో 15 జట్లు అమెరికన్ లీగ్ నుంచి వస్తాయి. నేషనల్ లీగ్ అనేది 1876లో ప్రారంభమవ్వగా.. అమెరికన్ లీగ్ 1901లో ఏర్పాటైంది. అయితే, 1903లోనే ఈ రెండు సంస్థలు నేషనల్ అగ్రిమెంట్ చేసుకున్నా 2000 సంవత్సరం వరకు లీగల్గా వేర్వేరుగానే ఉన్నాయి. ఇది మేజర్ లీగ్ బేస్బాల్గా మారినప్పటి నుంచి మంచి ప్రాచుర్యం లభించింది. దీంతో అతిగొప్ప క్రీడా లీగ్ల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రసారదారులు చెల్లించే మొత్తం రూ.72.7 కోట్లు. దీంతో ఇది అత్యంత ఖరీదైన నాలుగో బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడా లీగ్గా నిలిచింది.
బుండెస్లిగా
(Photo: Bundesliga Twitter)
ఇక ఈ జాబితాలో ఐదో అత్యంత విలువైన లీగ్గా జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఫుట్బాల్ లీగ్ బుండెస్లిగా నిలిచింది. 1963లో ప్రారంభమైన ఈ లీగ్లో మొత్తం 18 జట్లు పోటీపడతాయి. ఇది కూడా ఏటా ఆగస్టు నుంచి మే వరకు జరుగుతుంది. ఇది యూరప్లోనే కాకుండా మిగతా దేశాల్లోనూ మంచి ఆదరణ కలిగిన లీగ్గా ఎదిగింది. ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్కు ప్రసారదారులు చెల్లించే మొత్తం సుమారు రూ.30 కోట్లు. దీంతో ఇది ఐదో ఖరీదైన లీగ్గా పేరుగాంచింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం