Virat Kohli: కింగ్ కోహ్లీ @ 200 మిలియన్లు.. అతడే తొలి భారతీయుడు
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేసినా ఇతరులతో పంచుకుంటున్నారు...
మరి తర్వాతి స్థానాల్లో ఎవరు?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలకు అలవాటుపడ్డారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేసినా ఇతరులతో పంచుకుంటున్నారు. దీంతో వారిని అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ను అనుసరించే వారి సంఖ్య తాజాగా 200 మిలియన్లు దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అయితే, అతడి తర్వాత అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత క్రీడాకారులతో పాటు టాప్ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం..
* విరాట్ కోహ్లీ: విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రికెటర్గా నిలిచాడు. గత బుధవారం అతడిని అనుసరిస్తున్న వారి సంఖ్య 200 మిలియన్ మార్క్ చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్, తొలి భారతీయుడిగా నిలిచాడు. అతడు మాత్రం 245 మందినే ఫాలో అవుతున్నాడు. ఇక క్రీడల్లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన ప్రముఖుల్లో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచాడు. అతడిని ప్రస్తుతం 453 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. లియోనెల్ మెస్సీ 336 మిలియన్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
* మహేంద్రసింగ్ ధోనీ: భారత క్రీడాకారుల్లో కోహ్లీ తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న ఆటగాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అతడు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా అభిమానుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. మరోవైపు మిగతా ప్రముఖులతో పోలిస్తే ధోనీ సామాజిక మాధ్యమాల వినియోగం కూడా తక్కువే. అయినా, ప్రస్తుతం ఆయనను అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 38.6 మిలియన్లుగా ఉంది. అయితే, మహీ మాత్రం కేవలం నలుగురినే ఫాలో అవుతున్నాడు.
* సచిన్ తెందూల్కర్: ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరొందిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ భారత క్రీడా ప్రముఖుల్లో అత్యధిక మంది ఫాలో అవుతున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆయనను ఇప్పుడు ఇన్స్టాలో అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 34.7 మిలియన్లుగా ఉంది. క్రికెట్కు దూరమై చాలా కాలమైనా ఇప్పటికీ మిగతా క్రికెటర్లతో పోలిస్తే మంచి ఫాలోయింగ్నే సొంతం చేసుకున్నాడు. సచిన్ అనుసరిస్తున్న వారి సంఖ్య 30గా ఉంది.
* రోహిత్ శర్మ: ప్రస్తుత టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయినా, ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత క్రీడా ప్రముఖుల్లో సచిన్ తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ను ఇప్పుడు 24.1 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అయితే, అతడు 122 మందిని ఫాలో అవుతున్నాడు.
* హార్దిక్ పాండ్య: ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్లో గుజరాత్ లాంటి కొత్త జట్టును ఛాంపియన్గా నిలిపిన హార్దిక్ పాండ్యకు సైతం ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడిని ప్రస్తుతం 21.38 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో రోహిత్ తర్వాత అత్యధిక మంది అనుసరిస్తున్న భారత క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. హార్దిక్ 359 మందిని ఫాలో అవుతున్నాడు.
* సురేశ్ రైనా: ఇక సురేశ్ రైనా టీమ్ఇండియాకు దూరమైనా ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. ఆయనెప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. బయట తానేం చేసినా నిత్యం అభిమానులతో పంచుకుంటాడు. దీంతో ఇన్స్టాలో రైనాను అనుసరించేవారి సంఖ్య 20.2 మిలియన్లకు చేరింది. పాండ్య తర్వాత అత్యధిక మంది ఫాలో అవుతున్న క్రీడా ప్రముఖుడిగా కొనసాగుతున్నాడు.
కోహ్లీ తర్వాత టాప్ 9 ప్రముఖులు..
* ప్రియాంక చోప్రా: ఇక భారత్లో రెండో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రముఖుల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిలిచారు. కోహ్లీ తర్వాత ఆమె 79.3 మిలియన్ల మంది అభిమానులతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రియాంక ప్రస్తుతం 696 మందిని అనుసరిస్తున్నారు.
* శ్రద్ధా కపూర్: మరో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మూడో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారత సెలబ్రిటీగా నిలిచారు. 73 మిలియన్ల మంది అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. శ్రద్ధా అనుసరిస్తున్న వారి సంఖ్య 871.
* నేహా కక్కర్: బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్కు కూడా ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమె 70.2 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. దీంతో భారత్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఆమె అనుసరిస్తున్న వారి సంఖ్య 253.
* నరేంద్ర మోదీ: భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయనను అనుసరిస్తోన్న వారి సంఖ్య 67.8 మిలియన్లు. భారత రాజకీయ నాయకులలో అత్యధిక మంది ఫాలో అవుతున్న అగ్ర నాయకుడు మోదీనే. అయితే, ఆయన మాత్రం ఎవరినీ ఫాలో కావటం లేదు.
* దీపికా పదుకొణె: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం ఈ జాబితాలో ఆరో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీగా నిలిచారు. ఆమెను ఇప్పుడు 67.3 మిలియన్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. కాగా, దీపిక 183 మందిని ఫాలో అవుతున్నారు.
* అలియా భట్: ఏడో స్థానంలో కూడా బాలీవుడ్ హీరోయినే ఉన్నారు. యువ కథానాయిక ఆలియా భట్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 66.3 మిలియన్లు. ఆమె 482 మందిని అనుసరిస్తున్నారు.
* కత్రినా కైఫ్: కత్రినా కైఫ్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఆమెను ఇప్పుడు ఇన్స్టాలో 65.1 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. కత్రినా 497 మందిని అనుసరిస్తున్నారు.
* అక్షయ్ కుమార్: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనను ప్రస్తుతం అనుసరిస్తున్న అభిమానుల సంఖ్య 62.3 మిలియన్లుగా ఉంది. ఆయన మాత్రం కేవలం ఐదు మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
* జాక్వెలిన్ ఫెర్నాండెజ్: మరో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పదో స్థానంలో ఉన్నారు. ఆమెను ప్రస్తుతం 61.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అలాగే అత్యధిక మందిని ఫాలో అవుతున్న సెలబ్రిటీగానూ కొనసాగుతున్నారు. జక్వెలిన్ 1,192 మందిని అనుసరిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం