Team India: టాప్ ఆర్డర్లో ఒక్కడే ఆడితే ఎలా... ‘ఇందౌర్’ పరాజయం భారత్లో మార్పు తెస్తుందా?
ఆస్ట్రేలియా (Australia) సిరీస్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్తో రెండు టెస్టులు గట్టెక్కిన భారత్ (Team India).. మూడో టెస్టు (India vs Australia 3rd Test)లో కుదేలైంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లోపం ఉందని తెలిసినా.. మూడో టెస్టులో అది కొట్టొచ్చినట్లు కనిపించింది.
టీమ్ ఇండియా (Team India) బ్యాటింగ్లో డెప్త్ ఎక్కువ. ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు (Jadeja, Ashwin, Axar) ఉండటంతో ఆ అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ధీమానే భారత్ను దెబ్బకొట్టిందా? ఇండోర్ టెస్టు (Indore Test)లో ఫలితం చూశాక ఇదే అనిపిస్తోంది.
భారత్ (Team India) టాప్ ఆర్డర్ ప్రదర్శన గత కొన్ని రోజులుగా ఏమంతగా బాలేదు. లోయర్ ఆర్డర్ అద్భుతమైన ప్రదర్శన వల్లనో, బౌలర్ల విజృంభణ వల్లో గెలుస్తూ వస్తోంది. ఆస్ట్రేలియా (Australia)తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy) కోసం తలపడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లైనప్ను పేపర్ మీద రాస్తే.. KGF సినిమాలోని ఎలివేషన్ సీన్స్ కంటే తక్కువేం ఉండదు. రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్.. ఇలా అందరూ స్టార్ ఆటగాళ్లే. వీళ్లంతా ప్రపంచస్థాయి ప్రదర్శనతో ప్రత్యర్థికి చెమటలు పట్టించేవాళ్లే. కానీ గన్లో ఆరు బులెట్లు ఉండి.. ఒకటే పేలుతుంది.. మిగిలినవన్నీ తుస్ మంటాయి అంటే ఎలా? ఇప్పుడు టీమ్ ఇండియాలోనూ అంతే. ఒక టెస్టులో ఒకరు బాగా ఆడితే.. మరో టెస్టులో ఇంకొకరు ఆడుతున్నారు.
గత ఐదు ఇన్నింగ్స్లు చూస్తే ఈ విషయం మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఆసీస్తో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ టాప్ ఆర్డర్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఎవరికి వారు రావడం, పరుగులు కొట్టడం, వెళ్లిపోవడం. ఇదే తంతు. పార్ట్నర్ షిప్లు బిల్డ్ చేసి.. పెద్ద స్కోర్ చేసే ఆలోచన ఉన్నట్లు కనిపించలేదు. అయితే ఇదే సమయంలో మన స్టార్ ఆల్రౌండర్ల నుంచి మంచి పరుగులు కనిపిస్తున్నాయి, పార్ట్నర్ షిప్లూ కనిపిస్తున్నాయి. పనిలో పనిగా వారి ప్రదర్శన వల్ల విజయాలూ వస్తున్నాయి.
వెయిటింగ్ గేమ్ ఆడలేక...
క్రికెట్ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాటే.. టెస్టుల్లో ఎంతసేపు క్రీజులో నిలిస్తే అంత బాగా ఆడగలరు అని. అయితే దానికి ఓపిక కావాలి. మన జట్టులో ఆ ఓపిక ఏడో డౌన్ తర్వాతే వస్తుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే టాప్ ఆర్డర్లో పెద్దగా కనిపించడం లేదు కాబట్టి. ఒక టెస్టులో ఎక్కువసేపు నిలబడి మంచి పరుగులు చేశాడు, ఇక కుదురుకున్నట్లే అనుకోవడమే ఆలస్యం.. తర్వాతి ఇన్నింగ్స్లోనో, టెస్టులోనే ఆ ఆటగాడు బోల్తాపడుతున్నాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లకు బౌలింగ్ వేసిన లోయర్ ఆర్డర్ వాళ్లకూ వేస్తున్నారుగా అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. అయితే మరి లోయర్ ఆర్డర్ ఇండోర్ టెస్టులో భారత్ను ఎందుకు గెలిపించలేదు అనే ప్రశ్న రావొచ్చు. వాళ్లు ఈ మ్యాచ్లో రాణించలేదు కాబట్టే.. ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది అనేది విశ్లేషకుల అంచనా.
టాప్ ఆర్డర్లో ఏ మ్యాచ్లో ఎవరు ఆడారంటే...
- తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సెంచరీ (120)తో కదం తొక్కాడు. మిగిలిన టాప్ ఆర్డర్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. అయితే రవీంద్ర జడేజా (70), అక్షర్ పటేల్ (84) అర్ధ శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు.
- రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (44)నే టాప్ ఆర్డర్లో రాణించాడు. ఇక్కడ అక్షర్ పటేల్ (74), అశ్విన్ (37), జడేజా (26) తోడవడంతో జట్టుకు ఉపయుక్తకరమైన పరుగులు వచ్చి.. విజయం లభించింది.
- ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో చూస్తే.. ఇటు టాప్ ఆర్డర్, అటు లోయర్ ఆర్డర్లో ఎవరూ అర్ధ సెంచరీ వరకు వెళ్లలేకపోయారు. ఆ మాటకొస్తే ముచ్చటగా 30 పరుగులు కూడా దాటలేదు.
- మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఛెతేశ్వర్ పుజారా (59) అర్ధ శతకంతో జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. టాప్ ఆర్డర్లో మిగిలిన వాళ్లు ఎప్పటిలాగే త్వరగా ఔటయ్యారు. మరోవైపు మన ముగ్గురు స్పిన్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.
గత 3 టెస్టుల్లో భారత్ బ్యాటింగ్ తీరు
అన్నిసార్లు లోయర్ ఆర్డర్ కాపాడుతుందని అనుకోవడం, ఆశించడమూ తప్పే. టాప్ ఆర్డర్ సరైన పునాది వేస్తే లోయర్ ఆర్డర్ దాని మీద ఏదో ఒకటి చేయగలుగుతుంది. కీలకమైన WTC ఫైనల్స్ అవకాశం సంపాదించాలన్నా, ఒకవేళ సాధించి ఫైనల్లో గెలవాలన్నా.. మన బ్యాటర్లు అందులోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విజృంభించాలి. ఈ అద్భుతమైన సన్నివేశం అహ్మదాబాద్ టెస్టులో జరుగుతుందని ఆశిద్దాం!
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు