Foreign Players: కొందరు హిట్.. కొందరు ఫట్..!
ఏటా భారత టీ20 లీగ్ జరుగుతుందంటే ఎక్కువగా ఆసక్తి కొలిపే విషయం విదేశీ ఆటగాళ్లలో ఎవరెక్కువ ధరకు అమ్ముడుపోయారనేది...
భారీ ధర దక్కించుకున్న విదేశీయుల్లో ఎవరెలా ఆడారంటే..?
ఏటా భారత్లో టీ20 లీగ్ జరుగుతుందంటే ఎక్కువగా ఆసక్తి కొలిపే విషయం విదేశీ ఆటగాళ్లలో ఎవరెక్కువ ధరకు అమ్ముడుపోయారనేది. ఈసారి కూడా పలు ఫ్రాంఛైజీలు కొందరు ఆటగాళ్లని ఊహించని ధరకు కొనుగోలు చేశాయి. అందులో కొందరు తాము తీసుకున్న ధరకు న్యాయం చేస్తూ హిట్టవ్వగా.. మరికొందరు ఫట్టయ్యారు. వారు ఎవరో.. ఎలాంటి ప్రదర్శన చేశారో చూద్దాం..
* సిక్సర్లతో అలరించిన లివింగ్స్టోన్..
(Photo: Liam Livingstone Instagram)
విదేశీ ఆటగాళ్లలో ఈసారి అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. అతడిని పంజాబ్ మెగా వేలంలో రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని కాపాడుకున్న అతడు 14 మ్యాచ్ల్లో 437 పరుగులు చేశాడు. 182.08 అదిరిపోయే స్ట్రైక్రేట్తో 36.42 సగటు సాధించాడు. అందులో 34 సిక్సర్లు కూడా దంచికొట్టాడు. అత్యధిక పరుగుల వీరుడు జోస్ బట్లర్ (45) తర్వాత లివింగ్స్టోనే ఎక్కువ సిక్సర్లు సంధించాడు.
* వికెట్ల పండగ చేసుకున్న హసరంగ..
(Photo: Wanindu Hasaranga Instagram)
ఇక రెండో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడు వానిండు హసరంగ. బెంగళూరు మెగా వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో అంచనాలకు తగ్గట్టే రాణించాడు ఈ శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్. బ్యాట్తో మెరవకపోయినా బౌలింగ్లో అదరగొట్టాడు. మొత్తం 16 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీసి రెండో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. బెంగళూరు క్వాలిఫయర్-2లో ఓడిపోయింది కానీ, ఫైనల్ చేరి ఉంటే హసరంగ రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (27)ను అధిగమించే అవకాశం ఉండింది.
* దంచికొట్టలేకపోయిన నికోలస్ పూరన్..
(Photo: Nicholas Pooran Instagram)
అవకాశం దొరికితే చెలరేగిపోయే విండీస్ వికెట్ కీపర్, హిట్టర్ నికోలస్ పూరన్ ఈసారి మెగా వేలంలో రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్ టీమ్ అతడిపై భారీ అంచనాలు పెట్టుకొని నిరాశపడింది. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్ల్లో ఆడిన అతడు 306 పరుగులే చేశాడు. 144.33 స్ట్రైక్రేట్, సగటు 38.25 బాగున్నా అతడు తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేదు. కేవలం రెండు మూడు ఇన్నింగ్స్ల్లో రాణించడానికే పరిమితమయ్యాడు.
* పెద్దగా రాణించని ఫెర్గూసన్..
(Photo: Lockie Ferguson Instagram)
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ సైతం ఈ సీజన్ మెగా వేలంలో రూ.10 కోట్ల అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. ఛాంపియన్ గుజరాత్ టీమ్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, అతడు బౌలింగ్ పరంగా కొన్ని మ్యాచ్ల్లో ఆకట్టుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ, ఫైనల్లో 157.03 కిమీ వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మొత్తం అతడు 13 మ్యాచ్లు ఆడి 12 వికెట్లే తీసి సాదాసీదా బౌలర్లా అనిపించాడు. ఎకానమీ సైతం 8.95 ఏమంత గొప్పగా లేదు.
* రబాడ ప్రత్యర్థులకు దడదడ..
(Photo: Kagiso Rabada Instagram)
ఎప్పటిలాగే దక్షిణాఫ్రికా పేసర్ రబాడ చెలరేగిపోయాడు. పంజాబ్ జట్టు అతడిని మెగా వేలంలో రూ.9.25 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్న అతడు మరోసారి తన సత్తా చాటాడు. ఈ సీజ్లో మొత్తం 13 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి దక్కిన సొమ్ముకు రబాడ న్యాయం చేశాడు. కానీ, పంజాబ్ లీగ్ దశకే పరిమితమవ్వడం విచారకరం.
* హోల్డర్ బౌలింగ్లో ఓకే..
(Photo: Jason Holder Instagram)
వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఈ సీజన్లో లఖ్నవూ జట్టుకు ఆడాడు. అతడిని వేలంలో రూ.8.75 కోట్లకు ఆ జట్టు కొనుగోలు చేసింది. అయితే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ, లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ చేసే సత్తా ఉన్న అతడు ఈ సీజన్లో చెప్పుకునే స్థాయిలో రాణించలేదు. బంతితో 12 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి అంతంతమాత్రంగానే రాణించాడు. ఇక బ్యాటింగ్లో 8 ఇన్నింగ్స్లు ఆడినా కేవలం 58 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.
* హెట్మెయర్ కూడా మెరవలేదు..
(Photo: Shimron Hetmyer Instagram)
రాజస్థాన్ హిట్మ్యాన్గా చెలరేగుతాడని ఆశించిన షిమ్రన్ హెట్మెయర్ ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేదు. మెగా వేలంలో ఆ జట్టు అతడిని రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసినా కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే అలరించాడు. 15 మ్యాచ్ల్లో 314 పరుగులే చేసిన అతడు సగటు 44.86, స్ట్రైక్రేట్లో 153.92 మాత్రం ఫర్వాలేదనిపించాడు. అయితే, అతడు తీసుకునే సొమ్ముకు న్యాయం చేయలేకపోయాడు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం