T20 World Cup: జడేజా స్థానంలో అక్షర్ అన్నారు.. మరి బుమ్రా బదులు ఎవరున్నారు?
ారగాయాలు మళ్లీ టీమ్ఇండియాను ఇబ్బందిలోకి నెడతాయా..?జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయా..? మరో 24 రోజుల్లోనే టీ20 ప్రపంచకప్లో...
టీ20 ప్రపంచకప్నకు ముందు భారత్కు గాయాల బెడద!
ఇంటర్నెట్ డెస్క్: గాయాలు మళ్లీ టీమ్ఇండియాను ఇబ్బందిలోకి నెడతాయా..? జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయా..? మరో 24 రోజుల్లోనే టీ20 ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతున్న వేళ.. గట్టి దెబ్బ తగలింది. ఇప్పటికే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమవుతాడనే వార్తలు టీమ్ఇండియా అభిమానుల్లో కలవరం రేపింది. ఆల్రౌండర్గా ఉపయోగపడతాడని భావించిన శార్దూల్ ఠాకూర్ కూడా గాయంతో ఆసీస్తో సిరీస్కు ముందే జట్టు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
ఫోబియా తొలగిస్తాడని భావిస్తే..
గత ప్రపంచకప్లో దారుణ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే భారత్ ఇంటిముఖం పట్టింది. అప్పటి సారథి విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదిలేశాడు. రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో జట్టు పగ్గాలను అందుకొన్న విషయం తెలిసిందే. గత ఆసియా కప్లో మినహా పలు ద్వైపాక్షిక సిరీసుల్లో భారత్ విజయాలు సాధిస్తూ.. ఆసీస్ వేదికగా జరగబోయే మెగా టోర్నీ కోసం సన్నద్ధమవుతోంది. అయితే వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్నకు దూరమైన బుమ్రా.. ఆసీస్తో సిరీస్కు వచ్చాడని సంబరపడ్డాం. దక్షిణాఫ్రికా సిరీస్లోనూ ఆడతాడని ఆశగా ఎదురుచూశాం. అయితే మరోసారి వెన్ను నొప్పి తిరగబెట్టడంతో భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. డెత్ ఓవర్లలో టీమ్ఇండియా ఫోబియాను తొలగిస్తాడని ఆశిస్తే.. జట్టులోనే లేకుండాపోయే ప్రమాదం వచ్చింది. చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆసియా కప్లో భారత్ భారీ మూల్యం చెల్లించుకొంది. హర్షల్, బుమ్రా రాకతో డెత్ ఓవర్లలో టీమ్ఇండియా బలంగా మారుతుందని ప్రతి ఒక్కరూ భావించారు.
వారిద్దరిలో ఆ స్థానం ఎవరికి?
గత ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్కే పరిమితమైన భారత్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉన్న సమయంలోనే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరం కావడం గట్టి షాక్. అయితే జడేజా స్థానంలో అక్షర్ పటేల్ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అంచనా వేశారు. వారికి తగ్గట్లుగానే అక్షర్ బౌలింగ్లో అదరగొట్టేస్తున్నాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా సరిగా ఆడలేకపోయాడు. అయితే మంచి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం మాత్రం అక్షర్ సొంతం. అయితే ఇప్పుడంతా బుమ్రాకి బదులు ఎవరు వస్తారు? అనేదానిపై చర్చ సాగుతోంది. మహమ్మద్ షమీనే సరైన ఎంపిక అని కొందరు.. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అయితే బాగుంటుందనే వారూ లేకపోలేదు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరూ బాగానే బౌలింగ్ చేయగలరు. ప్రస్తుతం ఉన్న భువనేశ్వర్, హర్షల్ పటేల్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చారు. కొత్త బంతితో భువీ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. చివర్లో యువ బౌలర్ అర్ష్దీప్ ఉత్తమంగా బౌలింగ్ వేస్తున్నప్పటికీ.. అతడికి తోడుగా మరొక బౌలర్ ఉండాల్సిన అవసరం ఉంది. షమీ అయితే అనుభవజ్ఞుడు. కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ వేయాలనేది అతడికి బాగా తెలుసు. అయితే టీమ్ఇండియా అభిమానుల మదిలో మరో సందేహం.. ప్రపంచకప్ నాటికి ఇంకెంతమంది ఆటగాళ్లు గాయపడతారోనని ఆందోళనతో ఉన్నారు.
స్టాండ్బైలోకి ఎవరు వస్తారు?
బుమ్రా స్థానంలో అవకాశం కోసం షమీతోపాటు మీడియం పేసర్ దీపక్ చాహర్ కూడా పోటీ పడే అవకాశం ఉంది. దీపక్ చాహర్ కూడా ఇటు బ్యాటింగ్తోపాటు, బౌలింగ్లోనూ అక్కరకొస్తాడు. అయితే ఆసీస్ పిచ్లు పేస్కు అనుకూలం కాబట్టి పేసర్ అయితేనే ఉత్తమం. అందుకే టీమ్ఇండియా మేనేజ్మెంట్ షమీ వైపు మొగ్గు ఛాన్స్ ఉంది. అప్పుడు స్టాండ్బై ఆటగాడిగా ఒకరిని భారత్ ఎంపిక చేయాలి. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్.. యువ బౌలర్ ఉమ్రాన్ ఖాన్.. అవేశ్ ఖాన్.. ప్రసిధ్ కృష్ణ.. ఇలా ఎవరికి అవకాశం వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. వీరందరిలో సిరాజ్ కాస్త ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన పేస్ రాబట్టగలడు. కానీ ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. లేకపోతే ఆసీస్ పిచ్లకు సరిపోతాడని ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సోషల్ మీడియాలో రచ్చ..
‘‘భారత టీ20 లీగ్లో మాత్రం అన్ని మ్యాచ్లు ఆడేందుకు బుమ్రాకి ఎలాంటి గాయాలు అడ్డు రావని.. ఇప్పుడే అన్ని వస్తాయి’’ అని ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం.. ఇదీ నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి కాస్త ముందు వెన్నునొప్పి కారణంగా బుమ్రా తప్పుకోవడంతో వచ్చిన కామెంట్.
* చాలా విరామం తర్వాత బుమ్రా కేవలం రెండు టీ20లను మాత్రమే ఆడాడు. మళ్లీ గాయపడ్డాడు. ఫిట్నెస్ గురించి జాగ్రత్త తీసుకోకపోవడం గమనార్హం.
* కింగ్ ఆఫ్ ఇంజ్యూరీ - ఓ అభిమాని ట్వీట్
* అంతర్జాతీయంగా మూడు టీ20లు ఆడలేడు. అదే టీ20 లీగ్లో మాత్రం ముంబయి కోసం 14 మ్యాచ్లు ఆడేస్తాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్