T20 League: ఉత్కంఠ రేపుతున్న ప్లేఆఫ్స్ బెర్తులు
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్లో కొనసాగుతూ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం...
వరుసగా ఓడిపోతున్న టాప్ జట్లు
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. ఇకపై ముంబయి, చెన్నై మినహా మిగతా జట్లు అన్నింటికీ ప్రతి మ్యాచ్ అతి ముఖ్యమైనదే. అయితే, ఇన్ని రోజులూ టాప్లో కొనసాగుతూ ప్లేఆఫ్స్ బెర్తులు ఖాయం చేసుకునేలా కనిపించిన ఫేవరెట్ జట్లు ఇప్పుడు అనూహ్యంగా ఓటముల పాలవుతున్నాయి. దీంతో లీగ్స్టేజ్ పూర్తయ్యేసరికి ఎవరు ఎక్కడ నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలున్న జట్లు.. వరుస వైఫల్యాలకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గుజరాత్ ఇలాగే ఆడితే..
హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఇన్ని రోజులు వరుస విజయాలతో దూసుకుపోయిన గుజరాత్ గత రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో టాప్లో ఉండి.. ప్లేఆఫ్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నప్పటికీ.. ఈ ఓటములు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ముంబయి, పంజాబ్ చేతుల్లో ఓటమిపాలైంది. దీంతో ఇదే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయంగా మారింది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ వైఫల్యమే గుజరాత్ కొంపముంచింది. ఆ జట్టుకు మిడిల్ ఆర్డర్లో వెన్నెముకలా ఉండే డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా లాంటి ఆటగాళ్లు ఉన్నా శుక్రవారం రాత్రి ముంబయితో ఆడిన మ్యాచ్లో విఫలమయ్యారు. ఒకవేళ ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ గుజరాత్ ఇలాగే విఫలమైతే పాయింట్ల పట్టికలో టాప్-4లో వెనుకబడే ప్రమాదం ఉంది.
రాజస్థాన్ మెరుగవ్వకుంటే..
బ్యాటింగ్లో జోస్బట్లర్ చెలరేగుతుండటంతో అద్భుత విజయాలు సాధించి టాప్ రెండులోకి దూసుకుపోయిన రాజస్థాన్ ఇటీవల వరుసగా రెండు మ్యాచ్లు ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు కూడా చివర్లో కొనసాగుతున్న కోల్కతా, ముంబయి చేతుల్లోనే విఫలమవ్వడం గమనార్హం. బ్యాటింగ్లో బట్లర్ లేదంటే కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే రాణిస్తున్నారు. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తర్వాత వచ్చే డారిల్ మిచెల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయిర్ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపుతిప్పే సత్తా ఉన్నా విఫలమవుతున్నారు. దీంతో రాజస్థాన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నా ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో ఇలాగే ఆడితే ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి.
హైదరాబాద్ పరిస్థితి ఇదీ..
తొలి రెండు ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ వరుసగా ఐదు విజయాలు సాధించి అభిమానుల్లో సంతోషం నింపింది. కానీ, గత మూడు మ్యాచ్ల్లో మళ్లీ ఓటములపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విలియమ్సన్ నేతృత్వంలో బ్యాటింగ్ పరంగా బాగున్నా.. బౌలింగ్లోనే ధారాళంగా పరుగులిస్తోంది. ఇటీవల ఆ జట్టు ఆడిన అన్ని మ్యాచ్ల్లోని గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. బౌలింగ్లో కాస్త జాగ్రత్త పడితే హైదరాబాద్ పుంజుకునే వీలుంది. ఒకవేళ ఈ విషయంలో మార్పు చేసుకోకపోతే గతేడాదిలాగే ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో కనీసం 3 గేమ్స్ తప్పక గెలవాలి.
బెంగళూరు గాడిలో పడాలి..
ఇక బెంగళూరు సీజన్ ఆరంభంలో పలు విజయాలతో మంచి స్థితిలో నిలిచినా మధ్యలో వరుసగా మూడు మ్యాచ్లు ఓటములపాలై కాస్త కంగారు పెట్టింది. కానీ, గత మ్యాచ్లో చెన్నైపై గెలుపొంది మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. టాప్ ఆర్డర్లో కోహ్లీ, అనూజ్ రావత్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్ ఆర్డర్లో మొదట్లో దంచికొట్టి భారీ అంచనాలు నెలకొల్పిన దినేశ్ కార్తీక్ సైతం ఇటీవల రాణించలేకపోతున్నాడు. అతడు మళ్లీ బ్యాట్ ఝుళిపిస్తే తప్ప ఆ జట్టు పూర్తి స్థాయిలో గాడిలో పడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్స్లో టాప్ రెండులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. లేదంటే మిగతా జట్లతో పోటీపడాల్సి ఉంటుంది.
రేసులోకి దూసుకొస్తున్న దిల్లీ, పంజాబ్..
మరోవైపు నిన్న మొన్నటి వరకు దిగువ స్థాయిలో కొనసాగిన దిల్లీ, పంజాబ్ జట్లు ఒక మ్యాచ్ గెలుస్తూ, ఒక మ్యాచ్ ఓడిపోతూ పాయింట్ల పట్టికలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు జట్లూ హైదరాబాద్ మాదిరే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదేసి విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇకపై ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచ్ల్లో గట్టి పోటీనివ్వాలి. కానీ, ఈ జట్ల పరిస్థితి చూస్తుంటే అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. దీంతో వీరు టాప్-4లో నిలవాలంటే శక్తికి మించి రాణించాలి.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్