Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు భారత్ (IND vs SA) సిద్ధమవుతోంది. దాదాపు నెలరోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ (IND vs SA) జట్లను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కాస్త విరామం ఇచ్చింది. టెస్టు సిరీస్కు మాత్రం ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకుంటున్న తరుణంలో అతడికి విశ్రాంతినిస్తూ ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్కు సూర్యకుమార్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టు సిరీస్కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా నియమించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఇప్పుడీ సిరీస్లో లేకపోవడంతో జట్టుకు నష్టం చేకూరే అవకాశం ఉందని భారత మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ వీడిన తర్వాత తొలిసారి నెహ్రా స్పందించాడు.
‘‘భారత జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్కు అప్పగించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే దాని గురించి మాట్లాడలేను. సెలక్టర్లకూ కఠిన పరీక్ష తప్పదని అనిపిస్తోంది. ప్రస్తుతం హార్దిక్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడనేది తెలియదు. ఒకవేళ పాండ్య నేరుగా ఐపీఎల్లోనే ఆడితే మాత్రం.. భారత సెలక్షన్ కమిటీకి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్లో ఆడించాలని మద్దతుగా నిలిచే వారూ ఉన్నారు. ఒకవేళ వారిద్దరూ ఫిట్గా ఉంటే మాత్రం ఫామ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా టీ20 ప్రపంచకప్లో వారిని చూసే అవకాశం ఉంటుంది’’ అని నెహ్రా తెలిపాడు.
ఐపీఎల్లో రాణిస్తే.. వరల్డ్ కప్లో షమీకి ఛాన్స్
దక్షిణాఫ్రికా పర్యటనలో షమీని కేవలం టెస్టు సిరీస్కు మాత్రం ఎంపిక చేశారు. అదీనూ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే జట్టులోకి వస్తాడు. వన్డే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షమీ నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుత ఫామ్లో ఉన్న షమీని వచ్చేఏడాది పొట్టి కప్లోనూ ఆడించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్లో అతడి ప్రదర్శననుబట్టి టీ20 ప్రపంచకప్లో ఆడతాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
‘‘వచ్చే ఏడాది ఎక్కువగా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే అవకాశం లేదు. అయితే, టెస్టులు ఆడతాడు. ఇంగ్లాండ్తో ఐదు, దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లో తలపడొచ్చు. షమీ వచ్చే ఏడాది పొట్టి కప్లో ఆడాలని భావిస్తే మాత్రం ఐపీఎల్లో అతడి ప్రదర్శన బాగుండాలి. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ తరఫున షమీ టాప్ వికెట్ టేకర్. మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతమైతే తప్పకుండా వరల్డ్ కప్లో ఆడతాడు’’ అని ఓ మీడియా కథనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..