TSRTC: ఐపీఎల్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బస్సులు.. రూట్‌లు ఇవే..

ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌-ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య బుధవారం జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. 

Published : 26 Mar 2024 14:37 IST

హైదరాబాద్‌: క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ - ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు భారీగా ప్ర‌త్యేక బ‌స్సులను ఏర్పాటు చేసింది. అభిమానుల సౌకర్యార్థం జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ మైదానానికి 60 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై.. మ్యాచ్‌ అనంతరం తిరిగి రాత్రి 11.30గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. బస్సు రూట్‌ల వివరాలు ఇవే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని