Virat Kohli: అత్యంత కఠినమైన సమయమిదే.. రెండో ఓటమిపై విరాట్ కోహ్లీ
వ్యక్తిగత ప్రదర్శన బాగున్నా.. జట్టు విజయం సాధించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీకి తెలుసు. గత మూడు మ్యాచుల్లోనూ అతడు రాణించినా.. రెండు ఓటములను చవిచూడాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం అత్యంత బాధాకరంగా ఉందని బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో విరాట్ 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, 183 పరుగుల లక్ష్య ఛేదనను కోల్కతా మరో 19 బంతులు ఉండగానే పూర్తి చేసింది. కోల్కతాపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి బెంగళూరు డ్రెస్సింగ్ రూమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అది స్వీకరించిన తర్వాత కోహ్లీ కాస్త ఇబ్బందికరంగానే స్పందించాడు. కోహ్లీ మాట్లాడిన వీడియోను బెంగళూరు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
‘‘మనకు ఇది కఠినమైన రోజు. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం ఇంకాస్త ఉత్తమంగా ఆడాల్సిందే. దానిని అంగీకరించి ముందుకుసాగుదాం. ఇదే పోరాట స్ఫూర్తి, మన శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో మున్ముందు మ్యాచుల్లో రాణించి విజయం సాధించేందుకు ప్రయత్నిద్దాం. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉందాం’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. మూడు మ్యాచుల్లో 181 పరుగులు చేశాడు. దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ ప్రస్తుతం అతడి వద్దే ఉంది. కోహ్లీ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (2 మ్యాచుల్లో 143), రియాన్ పరాగ్ (2 మ్యాచుల్లో 127) రేసులో ఉన్నారు.
సమతూకంగా అనిపించడం లేదు: స్టువర్ట్ బ్రాడ్
మూడు మ్యాచుల్లో రెండు ఓటములతో బెంగళూరు ఐపీఎల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికలోనూ పరాజయం చవిచూసింది. బ్యాటింగ్లో ఫర్వాలేదు కానీ.. బౌలింగ్లో ఇబ్బందిపడటంపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. ‘‘కోల్కతా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ, బెంగళూరు బౌలింగ్ మాత్రం మ్యాచ్ను గెలిపించే స్థాయిలో లేదు. కోల్కతా బౌలర్లు కట్టర్స్, స్లో డెలివరీలతో బెంగళూరు జట్టును కట్టడి చేశారు. కానీ, ఆర్సీబీ బౌలర్లలో వైశాఖ్ మినహా మిగతా వారి ప్రదర్శన దారుణంగా ఉంది. గత కొన్నేళ్లుగా బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంటోంది. కానీ, బౌలింగ్పై వారు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే, ఆ జట్టు సమతూకంగా అనిపించడం లేదు. టోర్నీల్లో ఛాంపియన్గా నిలవాలంటే రెండు విభాగాలూ కీలకమే’’ అని బ్రాడ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్