Sachin - Kohli: ‘సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం’
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ (Virat Kohli) బద్దలు కొట్టడం చాలా కష్టమని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెందూల్కర్ (Sachin Tendulkar) తన కెరీర్లో లెక్కలెనన్ని రికార్డులు నెలకొల్పాడు. చాలాసార్లు తన రికార్డులను తానే తిరగరాశాడు. ముఖ్యంగా అతడు నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. అయితే, ఈ రికార్డును భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్రేక్ చేసే అవకాశముంది. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల(49)రికార్డును ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో కోహ్లీ (50 సెంచరీలు) బద్దలు కొట్టాడు. 35 ఏళ్ల విరాట్ మరో 21 సెంచరీలు చేస్తే సచిన్ శతకాల రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. అయితే, సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం చాలా కష్టమని వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా (Brian Lara) అభిప్రాయపడ్డాడు.
‘‘ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పటివరకు 80 సెంచరీలు చేశాడు. అతనికింకా 20 సెంచరీలు కావాలి. ఏడాదికి ఐదు శతకాల చొప్పున బాదినా.. సచిన్ రికార్డును సమం చేయడానికి నాలుగేళ్లు పడుతుంది. అంటే అప్పటికి కోహ్లీ 39 సంవత్సరాలకు చేరుకుంటాడు. ఈ వయసులో సెంచరీలు చేయడం చాలా కష్టం. అయితే, సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడని నేను కచ్చితంగా చెప్పలేను. నేనే కాదు ఎవరూ చెప్పలేరు. 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని చెబుతున్నవారు క్రికెట్ లాజిక్ను పరిగణనలోకి తీసుకోరు. 20 సెంచరీలు చాలా దూరంలో ఉన్నాయి. చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ మొత్తంలో 20 శతకాలు చేయలేరు. కాబట్టి, కోహ్లీ చేస్తాడని చెప్పలేను. వయసు ఎవరికీ ఆగదు. రానున్న రోజుల్లో విరాట్ మరెన్నో రికార్డులు బద్దలు కొడతాడు. కానీ, 100 సెంచరీల రికార్డు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చేయగలరా? అంటే అది కోహ్లీయే అని చెప్పడం మర్చిపోవద్దు. కోహ్లీ క్రమశిక్షణకు, అంకితభావానికి నేను పెద్ద అభిమానిని. ఒకవేళ సచిన్లా కోహ్లీ 100 సెంచరీలు చేస్తే చాలా సంతోషిస్తా. సచిన్ నా ప్రియమైన స్నేహితుడు. ముందుగా చెప్పినట్లుగానే కోహ్లీకి పెద్ద అభిమానిని’’ అని బ్రయాన్ లారా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా