Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఆ క్షణంలో
శతకం పూర్తి కాగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్న కోహ్లి.. సాధించాను అన్నట్లుగా వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు. లేచి స్టాండ్స్లో ఉన్న తన హీరో సచిన్కు.
శతకం పూర్తి కాగానే గాల్లోకి ఎగురుతూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్న కోహ్లి.. సాధించాను అన్నట్లుగా వెంటనే మోకాళ్లపై కూలబడ్డాడు. లేచి స్టాండ్స్లో ఉన్న తన హీరో సచిన్కు.. రెండు చేతులు పైకెత్తి, కిందకు వంగుతూ కోహ్లి అభివాదం చేశాడు. అనంతరం తనకు గాల్లో ముద్దులు విసురుతున్న భార్య అనుష్కకు తిరిగి కోహ్లి గాల్లో ముద్దులు పంపించాడు.
ఏ ప్రత్యర్థిపై ఎన్ని
- శ్రీలంక- 10, వెస్టిండీస్- 9,
- ఆస్ట్రేలియా- 8, కివీస్- 6,
- బంగ్లాదేశ్- 5, దక్షిణాఫ్రికా- 5,
- పాకిస్థాన్- 3, ఇంగ్లాండ్- 3,
- జింబాబ్వే- 1
శతకాలు టాప్-5 బ్యాటర్లు
- కోహ్లి- 50 (279 ఇన్నింగ్స్)
- సచిన్- 49 (452)
- రోహిత్- 31 (253)
- పాంటింగ్- 30 (365)
- జయసూర్య- 28 (433)
కలలా ఉంది
- విరాట్
గొప్ప వ్యక్తి ఇప్పుడే నన్ను అభినందించాడు. ఇదంతా కలలా ఉంది. కానీ ఇది వాస్తవం. ఇవన్నీ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్లో ఇక్కడి వరకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ప్రపంచకప్ సెమీఫైనల్. అన్నీ కలిసొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నాకు ఒక పాత్రను అప్పగించారు. దానికి న్యాయం చేసేందుకు శ్రమిస్తున్నా.
హృదయాన్ని తాకావు
- సచిన్
భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో మొదటిసారి కలిసినప్పుడు నా కాళ్లు మొక్కాల్సిందిగా తోటి ఆటగాళ్లు నిన్ను ఆట పట్టించారు. ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయా. కాని అనతికాలంలోనే నీ అభిరుచి, నైపుణ్యంతో నా హృదయాన్ని తాకావు. ఆ యువకుడు ఇప్పుడీ స్థాయికి చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక భారతీయుడు నా రికార్డును బద్దలు కొట్టడం.. అదీ నా సొంత మైదానం కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.
విరాట్కు ప్రధాని ప్రశంస
వన్డేల్లో 50వ శతకంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ రోజు కోహ్లి కేవలం 50వ వన్డే శతకం మాత్రమే చేయలేదు. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్ఠత, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడు. అతనికి అంకితభావం, అసామాన్య ప్రతిభకు ఈ మైలురాయి నిదర్శనం. ఈ మ్యాచ్తో పాటు ఈ టోర్నీలో షమి బౌలింగ్ కొన్ని తరాల పాటు గుర్తుంటుంది’’ అని మోదీ అన్నారు. మరోవైపు మైiక్రోసాఫ్ట్ వార్షిక సమావేశం ‘ఇగ్నైట్’ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో సత్య నాదెళ్ల భారత జట్టును అభినందనలతో ముంచెత్తారు.
- 5 కోట్లు- ఈ సెమీస్ మ్యాచ్ను ఓ సమయంలో హాట్స్టార్లో ఏకంగా 5 కోట్ల మంది వీక్షించారు. ఇది ఆల్టైమ్ రికార్డు. కోహ్లి సెంచరీ సమయంలో 4.6 కోట్ల మంది చూశారు.
- 8- ఈ ప్రపంచకప్లో కోహ్లి 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇన్నింగ్స్లు. ఒకే ప్రపంచకప్లో అత్యధికంగా 50కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (2003లో 7), షకిబ్ (2019లో 7)ను అతను దాటాడు.
- 3- ఒకే ప్రపంచకప్లో వరుసగా రెండు శతకాలు చేసిన భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ స్థానం. రాహుల్ ద్రవిడ్ (1999), రోహిత్ శర్మ (2019) ముందున్నారు.
- 5- కోహ్లి ప్రపంచకప్ సెంచరీల సంఖ్య. అత్యధిక ప్రపంచకప్ శతకాల జాబితాలో సంగక్కర, పాంటింగ్తో కలిసి కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ (7), వార్నర్, సచిన్ (6) ముందున్నారు.
- 51- ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా గేల్ (49)ను దాటిన రోహిత్ కొట్టిన సిక్సర్లు. ఈ సారి టోర్నీలో ఇప్పటికే 28 సిక్సర్లు కొట్టిన రోహిత్.. ఒకే ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా గేల్ (2015లో 26) రికార్డునూ తిరగరాశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం