Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ స్పిన్ బౌలింగ్లో కాస్త తగ్గించదని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. రాబోయే టెస్టు సిరీస్ కోసం కింగ్కు అతడు ఓ సలహా ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే నాగ్పుర్ చేరుకున్న టీమ్ఇండియా (Team India) జట్టు తొలి టెస్టు కోసం సాధన మొదలుపెట్టింది. ఈ సిరీస్లో క్రికెట్ అభిమానుల కళ్లన్నీ విరాట్ కోహ్లీ (Virat Kohli)పైనే. పరిమిత ఓవర్లలో తిరిగి ఫామ్లోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఈ పరుగుల రారాజు.. టెస్టుల్లోనూ సత్తా చాటాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. ఈ ట్రోఫీ గురించి స్పందిస్తూ టెస్టుల్లో విరాట్ ఆటతీరును విశ్లేషించాడు. అతడికి ఓ సలహా కూడా ఇచ్చాడు.
‘‘ఈ సిరీస్లో అతడు (కోహ్లీ) నాథన్ లయన్, ఆష్టన్ అగర్ స్పిన్ బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై దృష్టిపెట్టాలి. ఎందుకంటే స్పిన్ బౌలింగ్లో అతడు కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కన్పిస్తోంది. ఈ బౌలింగ్ ఎదుర్కోవడంలో అతడి స్ట్రైక్ రేటు కాస్త తగ్గింది. అందుకే అతడు మరింత దూకుడుగా ఆడితే బాగుంటుంది. ఇది టెస్టు క్రికెట్ అని తెలుసు. కానీ, కొన్నిసార్లు అతడు స్పిన్ను దూకుడుగా ఎదుర్కోక తప్పదని అనుకుంటున్నా. ముఖ్యంగా నాథన్ లయన్ లాంటి బౌలర్ ఉన్నప్పుడు.. కోహ్లీ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి’’ అని ఇర్పాన్ పఠాన్ సూచించాడు.
ఆస్ట్రేలియా (Australia)పై ఇప్పటి వరకు 20 టెస్టు మ్యాచ్లు ఆడిన విరాట్ (Virat Kohli) 1682 పరుగులు చేశాడు. సగటు 48.05గా ఉంది. ఆసీస్పై ఏడు సెంచరీలు కూడా నమోదు చేశాడు.
ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9-13 మధ్య నాగ్పుర్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టుకు దిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?